India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామి ఆలయంలో జాతర బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం బిల్వ పత్రాలతో లక్ష బిల్వార్చన, ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. గణపతి పూజ, పుణ్యాహవచనం, నిత్య హోమాలు, హారతి, మంత్రపుష్పం, రుద్రాభిషేకం నిర్వహించి బిల్వార్చన చేశారు. లోక కల్యాణార్థం ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు అర్చకులు తెలిపారు.
కొత్తకొండ జాతర బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏటా ఉత్సవాలలో భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి ఎడ్లబండ్ల రథాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సంక్రాంతి రోజు ఆలయం చుట్టూ ఎడ్లబండ్లతో ప్రదక్షిణలు చేసి, భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని దర్శించుకుంటారు. 57 ఏళ్ల సంప్రదాయం ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అందంగా అలంకరించిన 70 ఎడ్లబండ్ల రథాలు జాతరకు కదులుతాయి. దారివెంట రథాలు తిలకించేందుకు జనం ఆసక్తిగా చూస్తారు.
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయానికి ఒక ఆనవాయితీ ఉంది. ఏ పుణ్యక్షేత్రానికి పోవాలన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రజలు ముందుగా రాజన్నను దర్శించుకుంటారు. కోడెను తీసుకొని గుడి చుట్టూ ప్రదక్షిణ చేయించి ప్రాంగణంలో కట్టేసి, రాజన్నను దర్శించుకోవడం వల్ల తమ ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుగుతుందని భక్తుల నమ్మకం.
సంక్రాంతి పండుగ అంటే ముఖ్యంగా గుర్తొచ్చేది ముగ్గులు, పతంగులు. కొన్నిచోట్ల అయితే కోళ్ల పందేలు. కానీ మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాత్రం గుర్తొచ్చేది సకినాలు. అవును.. సకినాలనేవి సంక్రాంతి సమయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలా ఫేమస్. ప్రతి ఇంటి పిండి వంటలో ఇవి కచ్చితంగా ఉంటాయి. ఇవి లేకుండా ఓల్డ్ కరీంనగర్ జిల్లాలో పండుగనే జరగదు. మరి ఇంట్లో సకినాలు చేశారో? లేదో కామెంట్ చేయండి.
జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శనివారం రూ.2,25,314 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,16,714, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.89,590, అన్నదానం రూ.19,010 వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.
యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ Xలో స్పందించారు. ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలపైన దాడులు చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందన్నారు. ఇందిరమ్మ రాజ్యం పేరుతో అధికారంలోకి వచ్చి తెలంగాణలో గుండారాజ్యం చలాయిస్తున్నారని పలు వ్యాఖ్యలు చేశారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
ఉమ్మడి KNR జిల్లాలో నిన్న జరిగిన ప్రమాదాల్లో ఆరుగురు మృతిచెందారు. వివరాలిలా.. జగిత్యాల(D)లో జరిగిన <<15121069>>రోడ్డు <<>>ప్రమాదంలో జాబితాపూర్ వాసులు అరవింద్, సాయి, కొండాపూర్ వాసి వంశీ మృతిచెందారు. పుట్టిన రోజు <<15121119>>వేడుకలు <<>>జరుపుకోని వస్తున్న మంగపేట వాసి రాజకుమార్, అప్పన్నపేట వాసి అభినవ్ను బొలెరో ఢీకొట్టింది. చిన్నకల్వల వాసి ఈశ్వరమ్మను సుల్తానాబాద్ వద్ద <<15121180>>లారీ <<>>ఢీకొనడంతో మరణించింది.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మహాత్మా నగర్ ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో ఇటీవల విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఘటనలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ వి.రేవను కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఫుడ్ పాయిజన్ ఘటనపై సమాచారం ఇవ్వకుండా విద్యార్థినుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ రాశారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని లేఖలో పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీ అమలులో రాష్ట్ర ప్రభుత్వం తీరు ‘నోటితో పొగిడి – నొసటితో వెక్కిరించినట్లు ఉందన్నారు. ఆరోగ్య శ్రీ రూ.10లక్షలకు పెంచి ఆచరణకు వచ్చే సరికి అసలు బిల్లులే చెల్లించకుండా నెట్ వర్క్ హాస్పిటల్స్ను ఇబ్బందులు పెడుతున్నారని పేర్కొన్నారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురి పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు కనుల పండుగగా జరిగాయి. ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తెల్లవారుజామునే గోదావరి స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రభుత్వ వీపీ లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, ఆలయ ఈఓ శ్రీనివాస్, ఇతర అధికారులు ముక్కోటి ఏకాదశి వేడుకల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
Sorry, no posts matched your criteria.