India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
@ వేములవాడ ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. @ ధర్మపురి ఉపాధ్యాయురాలికి రాష్ట్రపతి అవార్డు. @ బలగం వేణుకు సీఎం రేవంత్ రెడ్డి, మాజీమంత్రి కేటీఆర్ అభినందన. @ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఫ్రెండ్షిప్ డే వేడుకలు. @ రామడుగు మండలంలో పర్యటించిన దర్శకుడు బోయపాటి శ్రీను. @ జగిత్యాలలో కొనసాగుతున్న జర్నలిస్టుల నిరవధిక నిరసన.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మొట్టమొదటిసారి బ్రేక్ దర్శనాలను ఈనెల 5 నుంచి ప్రారంభిస్తున్నట్లు ఈవో వినోద్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి రోజు రెండు సార్లు ఉ.10:15 నుంచి 11:15 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు బ్రేక్ దర్శనాలు కొనసాగుతాయని, ఒక్కొ టికెట్పై రూ.300 ఛార్జీ, ఒక లడ్డు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
రామడుగు మండలం గోపాల్రావుపేటలోని శివాలయంలో ఆదివారం ప్రముఖ సినీ డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాలరావుపేట గ్రామానికి విచ్చేసిన బోయపాటి శ్రీనును జాతీయ యువజన అవార్డ్ గ్రహీత అలువాల విష్ణు సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు కిరణ్, తదితరులు పాల్గొన్నారు.
సినీ పరిశ్రమలో ప్రతిభ కనబర్చిన దర్శకులు, నటీనటులకు 2024 ఫిలింఫేర్ అవార్డ్స్ ప్రదానం చేసిన విషయం తెలిసిందే. అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన దర్శకులు వేణు ఎల్దండి, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన బలగం, దసరా సినిమాలకు ఈ అవార్డులు రావడం విశేషం. ఉత్తమ దర్శకులుగా వారు ఈ అవార్డులు అందుకోగా.. ఉత్తమ నటీనటులుగా నాని, కీర్తి సురేశ్లకు ఈ అవార్డులు దక్కాయి.
సాఫ్ట్వేర్ ఉత్పత్తుల ఎగుమతిలో రూ.7లక్షల కోట్లతో బెంగళూరు మొదటి స్థానంలో ఉండగా, హైదరాబాద్ రెండో స్థానంలో ఉందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
వచ్చే మూడేళ్లలో తాము బెంగళూరును అధిగమించి ముందుకెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. కాగా, రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు నేటి నుంచి ఈనెల 13 వరకు మంత్రి అమెరికా, సౌత్ కొరియాలో పర్యటిస్తున్నారు.
సాఫ్ట్వేర్ ఉత్పత్తుల ఎగుమతిలో రూ.7లక్షల కోట్లతో బెంగళూరు మొదటి స్థానంలో ఉండగా, హైదరాబాద్ రెండో స్థానంలో ఉందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
వచ్చే మూడేళ్లలో తాము బెంగళూరును అధిగమించి ముందుకెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. కాగా, రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు నేటి నుంచి ఈనెల 13 వరకు మంత్రి అమెరికా, సౌత్ కొరియాలో పర్యటిస్తున్నారు.
సిరిసిల్ల పట్టణంలోని నెహ్రూనగర్కు చెందిన ప్రణీత నీట్లో రాష్ట్రస్థాయిలో 136వ ర్యాంకు సాధించింది. జాతీయస్థాయిలో జరిగిన నీట్ పరీక్షలో 720 మార్కులకు 678 మార్కులతో 8,100వ ర్యాంకు సాధించింది. దీంతో పలువురు ఆమెను అభినందించారు. కాగా, ప్రణీత సోదరి కూడా నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతోంది.
సిరిసిల్లకు చెందిన బలగం దర్శకుడు వేణు యెల్దండికి మాజీ మంత్రి, నియోజకవర్గ MLA కేటీఆర్ అభినందనలు తెలిపారు. బలగం సినిమా ఫిలీంఫేర్ అవార్డుల్లో ఉత్తమ చిత్రం అవార్డు పొందడంతో పాటు, వేణు బెస్ట్ డైరెక్టర్గా ఎంపిక కావడం పట్ల కంగ్రాట్యులేషన్స్ చెప్పారు. తన సోదరుడైన వేణు మరిన్ని మంచి సినిమాలు రూపొందించాలని సినీ రంగంలో రాణించాలని కోరుకున్నారు.
దోస్తానా అంటే కరీంనగర్ వాసులు జాన్ ఇస్తారు. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు వీడని బంధాలు నగరంలో కోకొల్లలు. ఆటపాటలతో పాటు ఆపదలోనూ తోడుంటూ కొండంత అండగా ఉంటారు. ఇక స్కూల్ దోస్తుల జ్ఞాపకాలు లైఫ్లాంగ్ గుర్తుండిపోతాయి. ఫెయిర్వెల్ పార్టీలో కన్నీరు కార్చిన మిత్రులెందరో. అటువంటి మిత్రుల కోసమే నేడు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం జరుపుకుంటున్నారు. మరి మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు..? Happy Friendship Day
కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో సోమవారం (ఆగస్టు 5వ తేదీన ) జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమం నేపథ్యంలో జిల్లా అధికారులు ఈ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నందున ఈనిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. తిరిగి ప్రతి సోమవారం యథావిధిగా ప్రజావాణి ఉంటుందని కలెక్టర్ వివరించారు.
Sorry, no posts matched your criteria.