Karimnagar

News August 2, 2024

చిన్నారికి అండగా నిలిచిన సిరిసిల్ల కలెక్టర్

image

వీర్నపల్లి మండలం గర్జనపల్లికి చెందిన చిన్నారి నయనశ్రీ క్యాన్సర్‌తో బాధపడుతోంది. విషయం తెలుసుకున్న కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆమెకు చికిత్స చేయించేందుకు ముందుకు వచ్చి కుటుంబానికి అండగా నిలిచారు. చిన్నారి తల్లి, తహశీల్దార్ పేరు మీద జాయింట్ ఖాతా ప్రారంభించి రూ.10 లక్షలు జమ చేస్తామన్నారు. క్యాన్సర్‌ను నయం చేసేందుకు మెరుగైన వైద్యం ఎక్కడ అందించాలో పరిశీలించి నివేదిక సమర్పించాలని DMHOను ఆదేశించారు.

News August 2, 2024

ప్రతి నియోజకవర్గానికి 100 మోకులు: మంత్రి పొన్నం

image

గీత కార్మికుల ప్రమాదాల నుంచి రక్షణ కోసం ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన కాటమయ్య రక్షణ కవచ్ మోకుల పంపిణీకి రంగం సిద్ధమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆగస్టు 5 నుంచి ప్రతి నియోజకవర్గానికి 100 మోకుల చొప్పున మొదటి విడతలో పదివేల మోకులు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. కల్లు గీత వృత్తి చేసుకునే ప్రతి ఒక్కరికీ ఈ మోకులను పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు.

News August 2, 2024

కరీంనగర్: SU డిగ్రీ ఫలితాలు విడుదల

image

శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ 2వ, 4వ, 6వ (రెగ్యులర్ & బ్యాక్ లాగ్స్) సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్టు విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి శ్రీరంగ ప్రసాద్ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు పరీక్ష ఫలితాల కోసం విశ్వవిద్యాలయం వెబ్‌సైట్ www.satavahana.ac.inను సందర్శించాలని పేర్కొన్నారు.

News August 2, 2024

హుస్నాబాద్: 9వ తరగతి బాలిక ఆత్మహత్య

image

HYD కాప్రా మండలం జవహర్‌నగర్ PS పరిధిలో విషాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. బాలాజీనగర్‌లో నివాసం ఉంటున్న బాలిక(16) సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో 9వ తరగతి చదువుతోంది. అయితే బాలాజీనగర్‌లోని ఇంటికి ఆమె ఇటీవల రావడంతో శివ అనే యువకుడు ప్రేమ పేరుతో ఆమెను లైంగికంగా వేధించాడు. దీంతో గురువారం రాత్రి ఉరేసుకుని ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

News August 2, 2024

సిరిసిల్ల: డెంగ్యూతో మహిళ మృతి

image

సిరిసిల్ల జిల్లాలో విషాదం నెలకొంది. స్థానికుల వివరాల ప్రకారం.. చందుర్తి మండలం మర్రిగడ్డకు చెందిన అంజలి(53) ఐదు రోజుల క్రితం అనారోగ్యం బారిన పడగా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి డెంగ్యూతో పాటు ఊపిరితిత్తుల్లో నీరు చేరిందని నిర్ధారించారు. దీంతో కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో HYD తరలిస్తుండగా మార్గమధ్యలో గురువారం రాత్రి మృతిచెందింది.

News August 2, 2024

సిరిసిల్ల: డెంగ్యూతో మహిళ మృతి

image

సిరిసిల్ల జిల్లాలో విషాదం నెలకొంది. స్థానికుల వివరాల ప్రకారం.. చందుర్తి మండలం మర్రిగడ్డకు చెందిన అంజలి(53) ఐదు రోజుల క్రితం అనారోగ్యం బారిన పడగా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి డెంగ్యూతో పాటు ఊపిరితిత్తుల్లో నీరు చేరిందని నిర్ధారించారు. దీంతో కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో HYD తరలిస్తుండగా మార్గమధ్యలో గురువారం రాత్రి మృతిచెందింది.

News August 2, 2024

శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి 29,960 క్యూసెక్కుల వరద నీరు

image

ఎగువ కురుస్తున్న వర్షాలకు శ్రీరామ్ ప్రాజెక్టులో భారీగా నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు సామర్థ్యం 1091 అడుగులు, 80.5 టీఎంసీలు ఉండగా.. ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 29,960 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 2,695 క్యూసెక్కులు ఉంది. ప్రస్తుతం ఉదయం 6 గంటల వరకు ప్రాజెక్టులో 38.993 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వివిధ అవసరాల కోసం ప్రాజెక్ట్ నుంచి మొత్తం 684 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

News August 2, 2024

జగిత్యాల: ASIని సస్పెండ్ చేసిన ఐజీ

image

జగిత్యాల జిల్లా బుగ్గారం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ASI లక్ష్మినాయణను సస్పెండ్ చేస్తూ మల్టీజోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. SI, తోటి సిబ్బందితో లక్ష్మినాయణ దురుసుగా ప్రవర్తించడంతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయన్నారు.

News August 2, 2024

మద్య మానేరులో 10.55 టీఎంసీలకు చేరుకున్న నీటి నిల్వ

image

సిరిసిల్ల జిల్లా బోయినపల్లి, మండలం మన్వాడ వద్ద గల మధ్యమానేరులో నీటి నిల్వ 10.55 టీఎంసీలకు చేరిందని ప్రాజెక్ట్ అధికారులు వెల్లడించారు. శ్రీ రాజరాజేశ్వర జలాశయానికి ఎల్లంపల్లి జలాలు 14,814 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుందన్నారు. జలాశయం పూర్తి సామర్థ్యం 318 మీటర్లు కాగా.. ప్రస్తుతం 309.45 మీటర్లు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 27.50 టీఎంసీలకుగాను 10:15 టీఎంసీలమేరకు నీరు ఉందని అధికారులు తెలిపారు.

News August 2, 2024

KNR: బోసిపోయిన చెరువులు నిండుతున్నాయి

image

ఇన్నాళ్లు నీరు లేక వేలవేల బోయిన చెరువుల్లో జలకళ సంతరించుకుంటుంది. గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో చెరువులు నిండుకుంటున్నాయి. కరీంనగర్ మండలంలో దాదాపు పెద్ద చెరువులు 33 ఉండగా.. చిన్న చెరువులు, కుంటలు 40 వరకు ఉంటాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు చెరువులోకి నీరు చేరి జలకళ సంతరించుకుంటుంది. ఇన్నాళ్లు వెలవెలబోయిన చెరువులు నీరు చేరడంతో ఆయా గ్రామాల ప్రజలు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.