Khammam

News June 26, 2024

ఖమ్మం: స్వల్పంగా పెరిగిన పత్తి ధర.. స్థిరంగా మిర్చి

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో బుధవారం
పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ. 20,000 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ. 7,200 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈరోజు పత్తి ధర రూ.100 పెరగగా, ఏసీ మిర్చి ధర మాత్రం స్థిరంగా ఉన్నట్లు మార్కెట్ కమిటీ సభ్యులు పేర్కొన్నారు.

News June 26, 2024

KMM: నామినేటెడ్ పదవుల కోసం నేతల పోటాపోటీ

image

ఎన్నికల కోడ్ ముగియడం పరిపాలనలో ప్రభుత్వం నిమగ్నం కావడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కాంగ్రెస్ నేతల్లో మళ్లీ నియామక పదవులపై ఆశలు పెరుగుతున్నాయి. త్వరలోనే ప్రభుత్వ నియామక పదవులు ఖరారవుతాయని కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. వివిధ శాఖలో ఉన్న నామినేటెడ్ పదవులకు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో ఎలాగైనా పదవి దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్నారు. 

News June 26, 2024

ఖమ్మంలో నేటి నుంచి జీఎన్ఎం పరీక్షలు

image

నేటి నుంచి జులై 6 వరకు జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ(జీఎన్ఎం) విద్యార్థుల సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశామని మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజేశ్వరరావు తెలిపారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు నర్సింగ్ కళాశాల లకు చెందిన 530 మంది విద్యా ర్థులు హాజరవుతారని వివరించారు. ఖమ్మం మెడికల్ కళాశాల భవనంలో పరీక్షల నిర్వహణకు అవసరమైన సదుపాయాలను సమ కూర్చామని ఆయన వెల్లడించారు.

News June 26, 2024

జిల్లాలో పెరగనున్న సన్న రకం వరి

image

ఈ వానాకాలం సీజన్లో జిల్లాలో సన్నరకం వరి సాగు గణనీయంగా పెరగనుంది. ఇప్పటికే రైతులు సన్నరకం వరి విత్తనాలను కొనుగోలు చేసి నార్లు పోసుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం క్వింటాకు రూ.500 బోనస్ ప్రకటించడంతో రైతుల్లో ఉత్సాహం నిండింది. అంతేకాక మిల్లర్లు, వ్యాపారులు సైతం ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకే ఆసక్తి కనబరుస్తుండడంతో రైతులు ఆ పంట సాగుకే మొగ్గు చూపుతున్నారు.

News June 26, 2024

పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నాం: కలెక్టర్ జితేష్ వి పాటిల్

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోషక లోపం ఉన్న పిల్లలను గుర్తించి వారి ఎదుగుదలకు దోహదపడేలా పౌష్టికాహారం అందిస్తున్నామని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. పౌష్టికాహారం అందించేందుకు ప్రణాళికాయుతంగా చర్యలు తీసుకుంటున్నామని, బాలామృతం అందజేస్తున్నామని వివరించారు.

News June 26, 2024

బొగ్గు గనుల ప్రైవేటీకరణ అడ్డుకుంటాం: తమ్మినేని

image

కేంద్రం బొగ్గు గనుల వేలం ద్వారా
ప్రైవేటీకరణకు చేస్తున్న ప్రయత్నాలను ఇండియా కూటమి ఆధ్వర్వంలో అడ్డుకుంటామని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. కొణిజర్ల మండలం చిన్నగోపతిలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న రాజకీయ శిక్షణా తరగతులను ఆయన మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని బొగ్గు గనులను సింగరేణికి అప్పగించేలా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో పోరాడాలన్నారు.

News June 26, 2024

పంచాయతీ కార్యదర్శుల బదిలీకి రంగం సిద్ధం

image

జిల్లాలోని పంచాయతీ కార్యదర్శుల బదిలీలు జరగనున్నాయి. ఇప్పటికే అధికారులు సమాచారం తెప్పించుకుని జాబితా తయారీలో నిమగ్నమయ్యారు. జిల్లాలో 589 జీపీలు ఉండగా గ్రేడ్ 1 పంచాయతీ కార్యదర్శులు 26 మంది, గ్రేడ్- 2 కార్యదర్శులు 31 మంది, గ్రేడ్-3 కార్యదర్శులు 39మంది, గ్రేడ్-4 కార్యదర్శులు 321 మందితో పాటు ఔట్సోర్సింగ్ కార్యదర్శులు 25, జూనియర్ పంచాయతీ కార్యదర్శులు 135 మంది సహా 577 మంది విధులు నిర్వర్తిస్తున్నారు.

News June 26, 2024

కొనసాగుతున్న ‘భగీరథ’ సర్వే

image

రాష్ట్రప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా తీరుతెన్నులపై చేపట్టిన సర్వే ఖమ్మం జిల్లాలో వేగంగా కొనసాగుతోంది. జిల్లాలోని 3.20 లక్షల గృహాలకు గాను 11వ తేదీ నుంచి ఇప్పటివరకు 2,13,883 గృహాల్లో సర్వే పూర్తి చేశారు. తద్వారా 70 శాతం పూర్తి కావడంతో ఇళ్ల వారీగా నల్లా కనెక్షన్లు, సరఫరా, వినియోగం తదితర అంశాలను యాప్లో నమోదు చేస్తున్నారు.

News June 26, 2024

నేలకొండపల్లిలో ఆన్ లైన్ స్కీం.. రూ.100 కోట్లు స్కాం

image

ప్రభుత్వాలు ఎన్ని నియంత్రణలు పెట్టినా నిత్యం ఎక్కడో ఒక్క చోట ఆర్థిక మోసాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఎంతో మంది బాధితులుగా మారుతున్నారు. తాజాగా ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఓ ఆర్థిక మోసం బయటపడింది. ఎటువంటి అనుమతులు లేకుండా ఓ వ్యక్తి ఆన్లైన్ మనీ సర్క్యులేషన్ దందా నిర్వహించి డిపాజిటర్లను నిండా ముంచాడు. సుమారు రూ.100 కోట్లకు పైగా కుచ్చుటోపి పెట్టగా బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

News June 26, 2024

KMM: 29 నుంచి ఎగ్జామ్స్

image

కాకతీయ విశ్వవిద్యాలయం వ్యాయామ విద్య డిగ్రీ నాలుగో సెమిస్టర్ పరీక్షల సవరించిన షెడ్యూల్‌ను పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎస్.నరసింహాచారి, అదనపు నియంత్రణ అధికారి డా.రాధిక విడుదల చేశారు. మొదటి పేపర్ జూన్ 29న, రెండో పేపర్ జులై 1న, మూడో పేపర్ 3న, నాలుగో పేపర్ 5న ఉన్నట్లు తేలిపారు. పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు జరుగుతాయని తెలిపారు.