Khammam

News May 8, 2025

ఖమ్మం: ఆసుపత్రి నర్స్.. అనుమానాస్పద మృతి

image

సత్తుపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న భూక్య కళ్యాణి(22) అనే యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది. పెనుబల్లి మండలం బ్రహ్మలకుంటకు చెందిన కళ్యాణి సత్తుపల్లిలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో నర్సుగా పనిచేస్తూ మసీదు రోడ్డులోని ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటుంది. రూమ్‌లో ఉరివేసుకుని మృతి చెందగా స్థానికులు గమనించి కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News May 7, 2025

KMM: సెలవుల్లో పిల్లలు జర జాగ్రత్త..!

image

బడులకు వేసవి సెలవులు, పిల్లలకు ఆటవిడుపు మొదలయ్యాయి. పిల్లలకు ఆటలు, తమ మిత్రులతో సరదా కోసం ఈతకు బయటకి వెళ్తుంటారు.. పిల్లలను తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. గత వారం రోజులుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండలు మండిపోతుండటంతో పిల్లలు ఆటవిడుపు కోసం బయటకి వెళ్లి వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని, పిల్లలను బయటకు వెళ్లకుండా తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు పాటించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.

News May 7, 2025

ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్యాంశాలు

image

1) ఖమ్మం: ‘విద్యా రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వాలు’ 2) ఏన్కూర్: ‘ఎన్నికలొస్తే బీఆర్ఎస్‌దే విజయం’ 3) కూసుమంచి: ఖమ్మం-సూర్యాపేట హైవేపై ఆటో పల్టీ 4) మధిర: వర్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా 30న సభ 5) మధిర: బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ 6) ఖమ్మం: తపాలా శాఖ రూ.10, రూ.15లక్షల బీమా 7) ధరణిని బంగాళాఖాతంలో కలిపాం: వైరా ఎమ్మెల్యే 8) ఖమ్మం: ఆరోగ్య రక్షణలో వైద్యులు కీలకం: కలెక్టర్.

News May 7, 2025

ఖమ్మంలో మళ్లీ తగ్గుతున్న టమాటా ధరలు

image

ఖమ్మం ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ (VDO’Sకాలనీ)లో శనివారం కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. కేజీ టమాటా రూ.18, వంకాయ 20, బెండకాయ 20, పచ్చిమిర్చి 40, కాకర 46, కంచకాకర 50, బీరకాయ 50, సొరకాయ 16, దొండకాయ 18, క్యాబేజీ 20, చిక్కుడు 66, ఆలుగడ్డ 26, చామగడ్డ 40, క్యారెట్ 30, బీట్రూట్ 24, బీన్స్ 66, క్యాప్సికం 50, ఉల్లిగడ్డలు 25, కోడిగుడ్లు(12) రూ.65గా ఉన్నాయని ఎస్టేట్ అధికారి శ్వేత పేర్కొన్నారు.

News May 7, 2025

టేకులపల్లి: అదనపు కట్నం వేధింపులతోనే దీపిక సూసైడ్

image

శుక్రవారం <<16216775>>దంపతులు<<>> ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. SI ప్రకారం.. టేకులపల్లి(M) రేగులతండా వాసి దీపిక(19), వెంకట్యాతండా వాసి శ్రీను ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అత్తింటివారితో దీపికకు గొడవ జరగడంతో దంపతులు గురువారం కూల్‌డ్రింక్‌లో పురుగుమందు కలిపి తాగారు. కుటుంబీకులు KMM తరలించగా దీపిక చనిపోగా, శ్రీను చికిత్స పొందుతున్నాడు. అదనపు కట్నం వేధింపులతో సూసైడ్ చేసుకుందని దీపిక కుటుంబీకులు ఫిర్యాదు చేశారు.

News May 7, 2025

ఖమ్మం: వడదెబ్బతో పది మంది మృతి

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత వారం రోజులు 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం వైరా మండలంలో 43 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. వారంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పది మంది వడదెబ్బతో మృతి చెందారు. రాబోయే మూడు రోజుల్లో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు మధ్యాహ్న సమయంలో బయటకు రాకపోవడమే మంచిదని సూచించింది.

News May 7, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} కారేపల్లిలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
∆} నేలకొండపల్లి లో భూభారతీ పై అవగాహన కార్యక్రమం
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు సెలవు
∆} ఖమ్మంలో మంత్రి తుమ్మల పర్యటన
∆} మధిర విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} సత్తుపల్లి పట్టణ బంద్
∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరా లో అంతరాయం

News May 7, 2025

ఖమ్మం జిల్లా వైపు.. MLC కల్వకుంట్ల కవిత చూపు?

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాపై MLC కల్వకుంట్ల కవిత ఫోకస్ పెట్టారనే మాటలు వినిపిస్తున్నాయి. ఇటీవల 2రోజులు జిల్లాలో ఆమె పర్యటించి, నేతలకు.. కేసీఆర్‌కు మధ్య వారధిగా ఉంటానని భరోసానిచ్చారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆమె ఖమ్మం నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. నిజామాబాద్‌లో గ్రూపు తగాదాలతో ఆమె సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఖమ్మంను ఎంచుకున్నట్లు ప్రచారం నడుస్తోంది.

News May 7, 2025

ఖమ్మం: రోడ్డుప్రమాదంలో యువకుడి దుర్మరణం

image

రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. మండలంలోని అనంతనగర్ గ్రామ శివారులో ఆగి ఉన్న టిప్పర్‌ను ద్విచక్రవాహనం ఢీకొనడంతో బైక్‌పై ఉన్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News May 7, 2025

నేలకొండపల్లి రైస్ మిల్లును సందర్శించిన సీపీ

image

నేలకొండపల్లి మండలంలో గల డీసీఎంఎస్ కేంద్రాన్ని, రాజేశ్వరపురంలోని అరుణచల రైస్ మిల్లును శుక్రవారం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సందర్శించారు. ధాన్యం, కొనుగోలు, ట్రాన్స్‌పోర్ట్, కాంటాలు, బిల్లులు తదితర అంశాలపై రైతులు, మిల్లర్లతో మాట్లాడారు. రైతులకు ఏలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని మిల్లర్లకు సూచించారు. సీపీ వెంట సీఐ సంజీవ్, ఎస్ఐ సంతోష్ పాల్గొన్నారు.