Khammam

News November 3, 2025

పాఠశాలల్లో మౌలిక వసతుల పనులు పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్

image

పాఠశాలల్లో విద్యుత్, త్రాగునీరు, టాయిలెట్స్ వంటి మౌలిక వసతుల కల్పన పనులు వేగంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో హెడ్ మాస్టర్‌లు, మున్సిపల్ కమీషనర్‌లతో ఆమె సమీక్ష నిర్వహించారు. పీఎం శ్రీ స్కూల్స్ మంజూరైన నిధులను ప్రణాళిక ప్రకారం వినియోగించి అభివృద్ధి పనులు పూర్తి చేయాలని సూచించారు.

News November 3, 2025

ప్రజావాణి అర్జీలను పెండింగ్‌లో ఉంచొద్దు: అదనపు కలెక్టర్ శ్రీజ

image

ఖమ్మం కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ పాల్గొని అర్జీలను స్వీకరించారు. అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. భూమి, రహదారి, స్వయం ఉపాధి, జీతం వంటి పలు సమస్యలపై ప్రజలు సమర్పించిన అర్జీలపై తగు చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.

News November 2, 2025

సెలవులపై వెళ్లిన ఖమ్మం కలెక్టర్

image

ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వ్యక్తిగత సెలవులో వెళ్తున్నారు. నేటి నుంచి వారం పాటు ఆయన సెలవులో ఉంటారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. తిరిగి కలెక్టర్ 10వ తేదీన విధుల్లో చేరతారు. అప్పటి వరకు అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ ఇన్చార్జి కలెక్టర్ గా వ్యవహరించనున్నారు.

News November 2, 2025

ఖమ్మం: ఈనెల 15న సూపర్ లోక్ అదాలత్

image

పెండింగ్ కేసుల పరిష్కారమే లక్ష్యంగా ఈనెల 15న సూపర్ లోక్ ఆదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా జడ్జీ జి.రాజగోపాల్ తెలిపారు. ఖమ్మం జిల్లా కోర్టులో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా సోమవారం నుంచి ఈనెల 15వ తేదీ వరకు చెక్ బౌన్స్ కేసులు, రోడ్డు ప్రమాద బీమా కేసులు, రాజీ పడదగిన సివిల్, క్రిమినల్ కేసులను పరిష్కరించుకోవచ్చని వెల్లడించారు.

News November 1, 2025

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్

image

వర్ష ప్రభావంతో వరద చేరే లోతట్టు ప్రాంతాల ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించి శాశ్వత పరిష్కారానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అనుదీప్ అన్నారు. శనివారం మధిరలోని లోతట్టు ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటించారు. పెద్దచెరువు బ్యాక్ వాటర్ ప్రభావం వలన లోతట్టు ప్రాంతాల వరద నియంత్రణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను పూర్తి చేయాలన్నారు.

News November 1, 2025

కంప్యూటర్ల మరమ్మతుకు టెండర్లు దాఖలు చేయాలి: అ.కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలోని 84 ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న కంప్యూటర్స్ మరమ్మతులకు NOV 6 లోపు టెండర్లు దాఖలు చేయాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి తెలిపారు. కంప్యూటర్ మరమ్మతుల నిమిత్తం 69 ఉన్నత పాఠశాలలకు రూ.15 వేలు చొప్పున, 15 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.5 వేల చొప్పున మొత్తం రూ.11.10 లక్షలు కేటాయించడం జరిగిందన్నారు. ఆసక్తి గల వారు DEO కార్యాలయంలో ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News November 1, 2025

క్షేత్రస్థాయి వాస్తవ నివేదికలు సిద్ధం చేయండి: కలెక్టర్

image

ఖమ్మం: మొంథా తుఫాన్ నష్టం అంచనాలపై శనివారం టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఏదైనా తప్పుడు ఫిగర్ను ఇవ్వకూడదని, నష్టం జరిగిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పరిహారం అందేలా చూడాలని సూచించారు. అక్రమాలకు తావు లేకుండా పారదర్శకంగా అంచనాలు తయారు చేయాలని అధికారులకు వివరించారు.

News November 1, 2025

ఖమ్మం జిల్లా ఆత్మ పీడీగా సరిత నియామకం

image

ఖమ్మం జిల్లా ఆత్మ (అగ్రికల్చర్ టెక్నికల్ మేనేజ్మెంట్ ఏజెన్సీ) ప్రాజెక్టు డైరెక్టర్ గానే కాక జిల్లా రైతు శిక్షణా కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ గా బి.సరితను పూర్తి అదనపు బాధ్యతలతో నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ స్థానంలో ఉన్న కె.అభిమన్యుడు ఉద్యోగ విరమణ చేయడంతో భద్రాద్రి జిల్లాలో పీడీగా విధులు నిర్వర్తిస్తున్న ఆమెను నియమించారు. ఈమేరకు ఉద్యోగులు అభిమన్యుడు, సరితను సన్మానించారు.

News November 1, 2025

ఖమ్మం: పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్‌ చేసిన కలెక్టర్

image

పీఎఫ్ఎంఎస్ నిధులు రూ.4 లక్షల పైగా దుర్వినియోగం చేసిన ఆరోపణలపై బోనకల్ మండలం రాపల్లి పంచాయతీ కార్యదర్శి వెంకటరమణను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో రావినూతల పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన సమయంలో ఆమె ప్రత్యేక అధికారులకు తెలియకుండా నిధులను దుర్వినియోగం చేసినట్లు ఎంపీవో విచారణ నివేదిక ఇచ్చారు. దీని ఆధారంగా కలెక్టర్ శనివారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు.

News November 1, 2025

ఈ నెల 6లోగా నష్ట నివేదికలు ఇవ్వాలి: అదనపు కలెక్టర్

image

ఖమ్మం: ‘మొంథా’ తుఫాన్ వల్ల జిల్లాలో జరిగిన పంట, రహదారి, విద్యుత్, చెరువుల నష్టంపై నవంబర్ 6 నాటికి నిర్ణీత నమూనాలో నివేదికలను సమర్పించాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ అధికారులను ఆదేశించారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. వ్యవసాయ, ఆర్అండ్‌బీ, విద్యుత్తు, నీటిపారుదల శాఖలు క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్ట అంచనాలను పక్కాగా సమర్పించాలన్నారు. తుఫాన్ ప్రభావం ఉన్న ప్రతి రైతు, గ్రామం కవర్ కావాలని సూచించారు.