India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చంద్రబాబు నాయుడుని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి తుమ్మల వెంట ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాల్లో తండ్రి, కొడుకులు అర్హత సాధించారు. ఖమ్మం పట్టణానికి చెందిన దాసరి రవి కిరణ్, ఆయన కుమారుడు మైకేల్ ఇమ్మానుయేల్ ఇద్దరూ గ్రూప్-1 ప్రిలిమ్స్లో క్వాలిఫై అయ్యారు. రవి కిరణ్ కామేపల్లిలోని ఎంజేపల్లిలో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. 53 ఏళ్ల వయసులోనూ రవికిరణ్ గ్రూప్ -1 ప్రిలిమ్స్లో అర్హత సాధించడంతో యువతకు మార్గదర్శకుడిగా నిలిచారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయనున్న రైతు భరోసాను ఒక్కో రైతుకు 10 ఎకరాల వరకు పరిమితం చేయాలని జిల్లాలోని మెజారిటీ రైతులు అభిప్రాయపడ్డారు. ఒక రైతుకు అంతకుమించి భూమి ఉన్నా రైతు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అంతేకాదు వ్యవసాయ భూములకు మాత్రమే రైతు భరోసా అమలు చేయాలని, రియల్ఎస్టేట్ వెంచర్లు, వ్యవసాయేతర భూములకు రైతు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు.
నిద్రమాత్రలు మింగి జిల్లా టీఎన్జీవో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆదివారం ఖమ్మంలో జరిగింది. జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు అబ్దుల్ హాసన్ తన ఇంట్లో భారీ మొత్తంలో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అతనిని కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. సంతకాల ఫోర్జరీ కేసులో ఇటీవల అరెస్టైన ఆయన బెయిల్పై విడుదలయ్యారు.
ఖమ్మం క్యాంపు కార్యాలయంలో ఆదివారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ఈ సందర్భంగా కార్యాలయానికి విచ్చేసిన ప్రజల నుంచి డిప్యూటీ సీఎం దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలనుంచి స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు.
గోదావరిలో ఓ యువకుడు గల్లంతైన ఘటన భద్రాచలంలో ఈ ఉదయం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. హైదరాబాద్కు చెందిన నలుగురు యువకులు ఈరోజు ఉదయం గోదావరిలో స్నానానికి వెళ్లాకం. ఓ యువకుడు గల్లంతయ్యాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు.
రైతు భరోసా స్కీమ్ను కౌలు రైతులకు కూడా వర్తింపజేస్తామని కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో పేర్కొంది. దీంతో కౌలు రైతులను గుర్తించడం సమస్యగా మారింది. ఈ క్రమంలో కౌలు చేస్తున్న రైతు ఇచ్చిన సమాచారం సరిపోదని, భూ యజమాని తన భూమిని ఫలాన రైతుకు కౌలుకు ఇచ్చినట్టు అఫడవిట్ సమర్పిస్తేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఈ అంశంపై జోరు చర్చలు జరుగుతున్నాయి.
భార్య మరణించిన పదిహేను రోజులకే భర్త మృతి చెందిన సంఘటన రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెం జగ్యాతండాలో శనివారం జరిగింది. గ్రామస్థుల కథనం ప్రకారం.. తేజావత్ సంగ్యా(60), కౌసల్య దంపతులు. తీవ్ర అనారోగ్యానికి గురైన కౌసల్య చికిత్స పొందుతూ జూన్ 22న మృతి చెందింది. ఆమెను తలుచుకుంటూ నిత్యం మనోవేదనకు గురైన తేజావత్ సంగ్యా శనివారం మృతి చెందాడు.
భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి దేవస్థానంలో రామయ్య నిత్యకల్యాణం కమనీయంగా జరిగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యా వాచనం నిర్వహించారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీతధారణ , అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని జరిపారు.
సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న అశ్వారావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ చికిత్స పొందుతూ ఈ ఉదయం మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆయన మరణ వార్త విని ఆమె మేనత్త రాజమ్మ కుప్ప కూలిపోయింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇద్దరు ఒకే రోజున మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
Sorry, no posts matched your criteria.