Khammam

News July 7, 2024

సీఎం రేవంత్‌కు మంత్రి తుమ్మల లేఖ

image

సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ శనివారం రాశారు. తెలంగాణ ప్రజాప్రతినిధులు రాసిన సిఫార్సు లేఖలను తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పరిగణనలోకి తీసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు తెలంగాణ సిఫార్సు లేఖలపై నేడు జరగనున్న తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీలో ప్రస్తావించాలని లేఖలో పేర్కొన్నారు.

News July 7, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో TODAY HEADLINES

image

∆] డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన
∆} ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} ఇల్లెందులో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} ఖమ్మంలో ఎంపీ RRR పర్యటన
∆} మణుగూరులో సింగరేణి కార్మికుల నిరాహార దీక్ష
∆} ఖమ్మంలో మాల మహానాడు సమావేశం

News July 7, 2024

ఖమ్మం: ఫోన్ ధర డబ్బులు చెల్లించాల్సిందే!

image

భద్రాద్రి జిల్లా రామవరానికి చెందిన మహబూబ్ అలీ 2022లో ఆన్‌లైన్‌లో సెల్‌ఫోన్  రూ.18,298 చెల్లించి బుక్ చేసుకున్నాడు. ఆర్డర్ రాగా దానిని ఓపెన్ చేస్తే చార్జర్, పౌచ్ మాత్రమే ఉండటంతో ఆన్లైన్ కంపెనీకి ఫోన్ చేశాడు. వారి నుంచి స్పందన రాకపోవడంతో జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌కు నివేదించాడు. పరిశీలించిన కమిషన్ కంపెనీ నిర్లక్ష్యం ఉందని నిర్ధారించి ఫోన్ ధర చెల్లించాలని తీర్పునిచ్చారు.

News July 7, 2024

ఖమ్మం జిల్లాలో 31.06 లక్షల మొక్కలను నాటడమే లక్ష్యం:కలెక్టర్

image

ఖమ్మం: వర్షాలు మొదలవడంతో ప్లాంటేషన్ ఒక పండుగలా చేపడుతున్నట్లు రాష్ట్ర ఆటవీ ముఖ్య సంరక్షణ అధికారిణి ప్రియాంక వర్గీస్ అన్నారు. శనివారం జిల్లా కలెక్టరేట్ నందు వనమహోత్సవంపై అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 31.06 లక్షల మొక్కలను నాటడమే లక్ష్యమని.. ఈ లక్ష్యాన్ని వివిధ శాఖల ద్వారా పూర్తి చేయుటకు చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పేర్కొన్నారు.

News July 6, 2024

డబ్బులు తీసుకోవడం మర్చిపోతే కాల్ చేయండి: RM సరిరామ్

image

ఆర్టీసీ బస్సులో కండక్టర్ టికెట్ వెనుక రాసే డబ్బులు మర్చిపోతే తిరిగి పొందొచ్చని ఖమ్మం RM సరిరామ్ అన్నారు. TGSRTC హెల్ప్ లైన్ నంబర్ 040-69440000 కాల్ చేస్తే డబ్బులు ఇస్తామని చెప్పారు. కాల్ చేసి టికెట్ మీద ఉన్న కండక్టర్ ఎంప్లాయ్ నంబర్ చెప్తే అతని కాంటాక్ట్ నంబర్ ఇస్తామని, దీంతో ఆ డబ్బులు రికవర్ చేసుకోవచ్చని తెలిపారు.

News July 6, 2024

మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ న్యాయవాది అరెస్ట్

image

భద్రాచలంలో ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ న్యాయవాదిని పట్టణ పోలీసులు అరెస్టు చేసి సబ్ జైలుకు తరలించారు. కొంతకాలం క్రితం ఓ మహిళ తన కుటుంబ వివాద పరిష్కారం కోసం కృష్ణ ప్రసాద్ అనే న్యాయవాదిని సంప్రదించింది. ఈ క్రమంలో అతను మహిళకు మాయ మాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా.. న్యాయవాదిని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు.

News July 6, 2024

కొత్తగూడెం: రైలు కిందపడి సూసైడ్

image

రైలు కిందపడి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన హేమచంద్రాపురం రైల్వేగేట్ సమీపంలో చోటుచేసుకుంది. భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్ నుంచి డోర్నకల్ వెళ్తున్న ఓ ఎక్స్ ప్రెస్ రైలు కిందపడి, ఆత్మహత్య చేసుకున్నాడని లోకో పైలట్ ద్వారా రైల్వే పోలీసులు తెలుసుకున్నారు. మృతదేహం వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించామన్నారు.

News July 6, 2024

కొత్తగూడెం: రైలు కిందపడి సూసైడ్

image

రైలు కిందపడి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన హేమచంద్రాపురం రైల్వేగేట్ సమీపంలో చోటుచేసుకుంది. భద్రాచలం రోడ్డు రైల్వే స్టేషన్ నుంచి డోర్నకల్ వెళ్తున్న ఓ ఎక్స్ ప్రెస్ రైలు కిందపడి, ఆత్మహత్య చేసుకున్నాడని లోకో పైలట్ ద్వారా రైల్వే పోలీసులు తెలుసుకున్నారు. మృతదేహం వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించామన్నారు.

News July 6, 2024

KTDM: గుండెపోటుతో ఏడో తరగతి విద్యార్థి మృతి

image

గుండెపోటుతో ఏడో తరగతి విద్యార్థి మృతి చెందిన ఘటన చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలో జరిగింది. కుటుంబ సభ్యుల వివరాలిలా.. తేజావత్ హరికృష్ణ (13) ఓ ప్రైవేట్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. స్కూల్లో ఛాతీ నొప్పి రావడంతో కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే హరి మృతిచెందినట్లు చెప్పారు. కాగా ఆ బాలుడు చిన్నతనం నుంచే గుండెజబ్బుతో బాధపడుతున్నాడు.

News July 6, 2024

పెంపుడు జంతువులతో అతి మురిపెం .. ప్రమాదకరం!

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రోజువారీగా రేబిస్ వ్యాధి నిరోధక టీకాలు తీసుకుంటున్న వారి సంఖ్య సగటున 30గా నమోదవుతోంది. రేబిస్ కారణంగా ఏటా 500-600 గేదెలు, ఆవులు తదితర పశువులు మృత్యువాత పడుతున్నాయి. కుక్కలు, పిల్లులు కరిస్తే పది నిమిషాల్లోపు ఆప్రాంతంలో నురగ వచ్చే వరకు సబ్బుతో ఎక్కువసార్లు శుభ్రపరచాలి. అప్రమత్తంగా లేకపోతే వీటి నుంచి సంక్రమించే వ్యాధులతో మనుషుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది.