Khammam

News April 25, 2025

పరీక్ష కేంద్రాల వద్ద భారీ భద్రత: ఖమ్మం సీపీ

image

ఖమ్మం జిల్లాలోని తెలంగాణ మోడల్ స్కూల్స్ ప్రవేశాల కామన్ ప్రవేశ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ అమలు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ప్రకటనలో తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి తెలంగాణ మోడల్ స్కూల్స్‌లో 6వ నుంచి 10వ తరగతి వరకు ప్రవేశాలకు ఈనెల 27న పరీక్ష జరుగనున్న నేపథ్యంలో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

News April 24, 2025

ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తప్పని నీటి కష్టాలు

image

ఎండల తీవ్రత పెరుగుతుండడంతో ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి నీటి కష్టాలు పొంచి ఉన్నాయి. ఓ పక్క భూగర్భ జలాలు అడుగంటడం, మరో పక్క మున్సిపల్ కార్పొరేషన్ నుంచి రోజు విడిచి రోజు నీటి సరఫరాతో కష్టాలు తప్పేలా లేవు. అంతేకాక బోర్ల ద్వారా కూడా సరఫరా తగ్గిపోతుండటంతో ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో ఈ ఏడాది నీళ్ల ముప్పు ఎదురుకానుంది. ఖమ్మం నగరంలో మంచినీటి సరఫరాకు ఇబ్బంది కలగకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు.

News April 24, 2025

ఖమ్మంలో నేడు మంత్రి పొంగులేటి పర్యటన

image

ఖమ్మం జిల్లాలో గురువారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించనున్నట్లు మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ముందుగా కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారరు. అనంతరం జూలూరుపాడులో నిర్వహించే భూభారతి అవగాహన సదస్సులో పాల్గొంటారని చెప్పారు. మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని పేర్కొన్నారు.

News April 24, 2025

ఖమ్మం జిల్లాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు

image

ఖమ్మం జిల్లాలో బుధవారం రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా పెనుబల్లిలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. అటు నేలకొండపల్లి, ఎర్రుపాలెం 42.9, ఖమ్మం(U), మధిర (సిరిపురం) 42.8, వైరా, ముదిగొండ (పమ్మి) 42.7, చింతకాని 42.6, కూసుమంచి, రఘునాథపాలెం 42.5, ఖమ్మం (R) పల్లెగూడెం 42.4, సత్తుపల్లి 42.2, తిరుమలాయపాలెం 41.8, వేంసూరు, ఏన్కూరు 41.4, కామేపల్లి (లింగాల) 41.0 నమోదైంది.

News April 24, 2025

ఖమ్మం: పంట బీమా పథకంపై మంత్రి తుమ్మల సమావేశం

image

పంట బీమా పథకం అమలుపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వానాకాలం, యాసంగి కాలాల్లో ఏయే పంటలకు ఏయే విపత్తుల కింద బీమా వర్తింపచేయాలనే అంశంపై అధికారులతో చర్చిస్తున్నారు. ప్రధాన పంటలకు బీమా ప్రీమియం అంచనా వేసి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. పంట బీమా పథకంలో భాగంగా రైతులందరికీ ప్రయోజనం చేకూరే విధంగా చర్యలు ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు.

News April 24, 2025

KMM: తాగునీటికి ఇబ్బందులు రావొద్దు: కలెక్టర్

image

వేసవి కాలంలో తాగునీటికి ఇబ్బందులు రాకుండా పటిష్ఠ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో వేసవి కాలంలో తాగునీటి సరఫరా, ఇంకుడు గుంతల నిర్మాణంపై అదనపు కలెక్టర్ శ్రీజతో కలిసి మున్సిపల్ కమిషనర్, సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. వేసవి కాలంలో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

News April 23, 2025

ఆడబిడ్డలతోనే ఇంటికి పరిపూర్ణత: ఖమ్మం కలెక్టర్

image

ఆడబిడ్డలతోనే ఇంటికి పరిపూర్ణత వస్తుందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం మా ఇంటి మణిద్వీపం కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ మధిర మండలం దెందుకూరులో ఆడపిల్ల జన్మించిన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి స్వీట్ బాక్స్ అందించి, శుభాకాంక్షలు తెలిపారు. మన ఆలోచనల్లో మార్పు వస్తే ఇంట్లో పుట్టిన ఆడపిల్లలకు, మగ పిల్లలతో సమానంగా చూడడం జరుగుతుందని పేర్కొన్నారు.

News April 23, 2025

ఖమ్మం: 5.8 కేజీల గంజాయి చాక్లెట్లు స్వాధీనం

image

ఖమ్మం జిల్లాలో గంజాయి చాక్లెట్లు కలకలం సృష్టించాయి. ఏదులాపురం మున్సిపాలిటీ గుర్రాలపాడులోని ఓ గ్రానైట్‌‌ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కూలీల నుంచి సుమారు 5.880 కేజీల గంజాయి చాక్లెట్లను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకొని, నిందితుడు బానోత్ హరియాను అరెస్టు చేశారు. నిందితుడు ఒడిశాలో గంజాయి చాక్లెట్లను కొని ఖమ్మం తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నట్లు గుర్తించారు. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ చంద్రమోహన్, నరసింహ ఉన్నారు.

News April 23, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన ∆} మధిరలో భూభారతిపై అవగాహన కార్యక్రమం ∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ∆} ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్న ఓపెన్ 10వ తరగతి పరీక్షలు ∆} వైరా అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

News April 23, 2025

ఖమ్మం: 28 నుంచి కేయూ సెమిస్టర్ పరీక్షలు

image

కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ 2వ, 4వ, 6వ సెమిస్టర్, డిగ్రీ (బ్యాక్ లాగ్) మొదటి, మూడో, ఐదో సెమిస్టర్ పరీక్షలను ఈనెల 28 నుంచి నిర్వహించనున్నారు. ఏప్రిల్ 21 నుంచి పరీక్షలు జరగాల్సి ఉండగా కొన్ని కళాశాలలు పరీక్షా ఫీజులు, నామినల్ రోల్స్ అందించని కారణాలతో వాయిదా పడినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య రాజేందర్ తెలిపారు. సవరించిన పరీక్షా టైం టేబుల్, ఇతర వివరాలను యూనివర్సిటీ వెబ్ సైట్లో చూడవచ్చన్నారు.