Khammam

News October 30, 2025

227 మందిని పునరావాస కేంద్రాలకు తరలించాం: కలెక్టర్

image

ఖమ్మం నగరంలో మున్నేరు నది ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో 90 కుటుంబాల పరిధిలో 227 సభ్యులను పునరావాస కేంద్రాలకు తరలించినట్లు కలెక్టర్ అనుదీప్ తెలిపారు. వారికి అవసరమైన ఆహారం, పారిశుధ్యం, వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. అతి తక్కువ ఆస్తి నష్టం, ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు. తుపాన్ వల్ల 24 రోడ్లపై నీటి ప్రవాహం రావడం వల్ల రాకపోకలు నిలిపి వేశామని పేర్కొన్నారు.

News October 30, 2025

క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలి: సీఎం

image

ఖమ్మం: మొంథా తుఫాన్ నేపథ్యంలో మంత్రులు, అధికారులు ప్రభావిత ప్రాంతాలలో క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉంటూ ప్రజలను ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం సీఎం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ అనుదీప్, సీపీ సునీల్ దత్, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య పాల్గొన్నారు. వరదల నేపథ్యంలో విద్యుత్ పునరుద్ధరణ యుద్ధ ప్రాతిపదికన జరిగేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సూచించారు.

News October 30, 2025

పునరావాస కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ అనుదీప్

image

ఖమ్మం: మున్నేరు వాగు ఉధృతి నేపథ్యంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గురువారం పరిశీలించారు. నయాబజార్ స్కూల్, జూనియర్ కళాశాల శిబిరాల్లోని వసతులు, భోజనం నాణ్యత, హెల్త్ క్యాంప్‌ల నిర్వహణపై ఆయన ఆరా తీశారు. ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలకు ఇబ్బంది లేకుండా మెరుగైన సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

News October 30, 2025

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ సెలవులు రద్దు

image

ఖమ్మం జిల్లాలో వర్ష ప్రభావం తగిన నేపథ్యంలో (రేపు) శుక్రవారం తిరిగి ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ప్రారంభమవుతుందని ఉన్నత శ్రేణి కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తెలిపారు. రైతుల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని తుఫాను ప్రభావం తగ్గి వాతావరణం పొడిగా ఉన్నందున మార్కెట్ను తిరిగి రేపు ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. కావున రైతాంగ సోదరులు గమనించి తమ పంటలను మార్కెట్‌కు తీసుకువచ్చి అమ్మకాలు జరపాలని అధికారులు పేర్కొన్నారు.

News October 30, 2025

ఖమ్మంలో అర్ధరాత్రి హై అలర్ట్

image

మున్నేరు వాగు పరివాహక ప్రాంతాలలో అర్ధరాత్రి పోలీసులు, మున్సిపల్ అధికారులు హై అలెర్ట్ ప్రకటించారు. మున్నేరు ప్రవాహనం పెరగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. బుధవారం రాత్రి 7 గంటలకు 17 అడుగుల వద్ద ఉన్న వాగు అర్ధరాత్రి 22 అడుగులకు చేరుకుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు నగరంలోని బొక్కలగడ్డ, మోతీ నగర్ ప్రాంతాలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించారు. తెల్లవారుజామున 5 గంటలకు 23 అడుగులకు చేరుకుంది.

News October 30, 2025

ఖమ్మం: అంగన్వాడీల్లో కరువైన పర్యవేక్షణ..!

image

జిల్లాలో గర్భిణీలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ అధికారుల పర్యవేక్షణ లోపంతో అస్తవ్యస్తంగా మారింది. జిల్లాలోని పలు కేంద్రాల్లో చిన్నారులకు మధ్యాహ్న భోజనాన్ని సైతం పెట్టడం లేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు కేంద్రాలపై దృష్టి సారించి, మెరుగైన సేవలు అందేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

News October 30, 2025

విద్యుత్ స్తంభాల వద్ద అప్రమత్తంగా ఉండండి: SE

image

మొంథా తుఫాను ప్రభావంతో ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజల అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రీనివాసా చారి తెలిపారు. రైతులు పంట పొలాల వద్ద జాగ్రత్తలు పాటించాలని, పశువులను విద్యుత్ స్తంభాలకు కట్టరాదని సూచించారు. ఉరుములు, పిడుగులు సంభవించినప్పుడు విద్యుత్ లైన్స్ సమీపంలో ఉండవద్దని హెచ్చరించారు. విద్యుత్ ప్రమాదాలను నివారించేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

News October 29, 2025

అత్యవసరమైతే 1077కు కాల్ చేయండి: ఖమ్మం కలెక్టర్

image

‘మొంథా’ తుపాను కారణంగా ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, అత్యవసర సమయాల్లో ప్రజలు కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని కలెక్టర్ అనుదీప్‌ దురిశెట్టి సూచించారు. వరదలు, ప్రమాదాల సమయంలో వెంటనే టోల్‌ ఫ్రీ నంబర్‌ 1077 లేదా 90632 11298కు కాల్ చేయవచ్చని తెలిపారు. పరిస్థితిని పర్యవేక్షించడానికి కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.

News October 29, 2025

ఖమ్మంలో పట్టు సడలుతున్న BRS..?!

image

ఖమ్మం జిల్లాలో BRS పట్టు సడలుతోంది. గత 3 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్క సీటుకే పరిమితం కావడం పార్టీని కలవరపెడుతోంది. కమ్మ సామాజిక వర్గ నేతలకు పెద్దపీట వేసినప్పటికీ, ఆ వర్గం ఓటర్లు BRSను ఆదరించలేకపోయారనే విశ్లేషణలు ఉన్నాయి. ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న తాతా మధు సైతం పార్టీకి బలం చేకూర్చలేకపోతున్నారనే ప్రచారం ఉంది. BCలకు అవకాశాలు కల్పిస్తే జిల్లాలో పార్టీ బలోపేతమవుతుందనే టాక్‌ వినిపిస్తోంది.

News October 29, 2025

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఖమ్మం సీపీ

image

జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు. జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో నీట మునిగిన రోడ్లను దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు. ఎవరు కూడా చేపల వేటకు వెళ్లవద్దని, పశువుల కాపర్లు చెరువులు, వాగులు దాటవద్దని, యువకులు సెల్ఫీల కోసం నీటి ప్రవాహం వద్దకు వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు.