India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భద్రాద్రి జిల్లా పరిధిలో రోడ్డు ప్రమాదాలను నివారించి విలువైన ప్రాణాలు కాపాడేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం రోడ్డు భద్రతపై జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తో కలిసి జిల్లాస్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో రోడ్డు ప్రమాదాల కారణంగా ఏ ఒక్కరూ వైకల్యం బారిన పడకుండా రోడ్డు భద్రత చర్యలు చేపట్టాలన్నారు.
ఇవిఎం గోడౌన్ వద్ద పటిష్ఠ నిఘాతో భద్రతా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం కలెక్టర్, కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోడౌన్ నెలవారీ తనిఖీ చేశారు. గోడౌన్ సీళ్లను కలెక్టర్ పరిశీలించారు. అగ్నిమాపక పరికరాలు, సీసీ కెమెరాలను పరిశీలించి, పనిచేస్తున్నవి, లేనిది అడిగి తెలుసుకున్నారు. భద్రతా సిబ్బంది షిఫ్టుల వారి విధుల గురించి అడిగి తెలుసుకున్నారు.
భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా అభివృద్ధి చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బుధవారం ఖమ్మం నగరంలోని 16వ డివిజన్లో చేపట్టిన డ్రైనేజీ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. నీటి ప్రవాహక దారులను ఆక్రమిస్తే విపత్తులు తప్పవని తెలిపారు. డ్రైనేజ్ నిర్మాణం సమయంలో సరైన లెవల్స్ మెయింటైన్ చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు.
ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే రోగులకు మెరుగైన వసతులతో వైద్యసేవలు అందించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ జిల్లా ప్రధాన ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రధాన ఆస్పత్రిలోని క్యాజువాలిటీ, ఏఎంసీ, జనరల్ వార్డులు, వెయిటింగ్ హాల్, ఐసీయూ, ఫార్మసీ, ఓపీ, ఫిజియోథెరపి రూమ్లను కలెక్టర్ పరిశీలించారు. అందుతున్న సేవలు, ఆస్పత్రిలో ఏవైనా సమస్యలు ఉన్నాయా అని ఆరా తీశారు.
సింగరేణి లాభాలకు వాటా సంబంధించి ప్రభుత్వంపై విమర్శ చేసే క్రమంలో సీపీఐ, ఏఐటీయూసీ బాధ్యత వహించాలని కేటిఆర్ చేసిన వ్యాఖ్యలను కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు తప్పుపట్టారు. BRS ప్రభుత్వం ఏమి చేసిందో, ఈ ప్రభుత్వం కూడా అదే చేసిందని చెప్పారు. BRS ప్రభుత్వం పాక్షికంగా కార్మికులకు వాటాలను పంచిందని చెప్పారు. రూ.4701 కోట్లు కాగా రూ.2412 కోట్ల నికర లాభాల నుండి 33% ఇచ్చారని అన్నారు.
అమెరికా లాస్ వెగాస్లో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద మైనింగ్ ప్రదర్శన “MINExpo”ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అధికారుల బృందం సందర్శించారు. ప్రపంచంలోని అతిపెద్ద మైనింగ్ పరికరాల తయారీదారుల సమ్మేళనం అయిన లాస్ వెగాస్లోని MINExpo వద్ద సెప్టెంబరు 24న మంగళవారం ఉపముఖ్యమంత్రి పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు.
భద్రాద్రి జిల్లా కరకగూడెం మండలంలో దారుణం జరిగింది. పోలీసుల వివరాలిలా.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బిజ్జా సాంబయ్య అనే వ్యక్తి మైనర్ బాలికను తన ఇంటికి ఎత్తుకెళ్లి నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ఈ విషయాన్ని తల్లికి చెప్పింది. ఆమె పోలీసులను ఆశ్రయించడంతో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఏడూళ్ళబయ్యారం సీఐ వెంకటేశ్వర్లు దర్యాప్తు చేస్తున్నారు.
∆} వివిధ శాఖల అధికారులతో ఖమ్మం భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} వైరాలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన
∆} మణుగూరులో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటన
∆} కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} అశ్వరావుపేటలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటన
∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు
ఖమ్మం జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. సాయంత్రానికి 155.3మిల్లి మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా పెనుబల్లి మండలంలో 50.3 మిల్లిమీటర్లు అత్యల్పంగా ఎర్రుపాలెం మండలంలో కురిసింది. పెనుబల్లితో పాటు వేంసూర్, తల్లాడ సత్తుపల్లి ప్రాంతాల్లో కురిసినట్లు వాతావరణశాఖ వెల్లడించింది. మరో రెండురోజుల పాటు భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
దమ్మపేట మండలం జగ్గారం గ్రామంలో మంగళవారం ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. కాగా గ్రామంలో పిడుగుపాటుకు ఇద్దరు యువతులు సున్నం అనూష (23), కట్టం నాగశ్రీ (23) మృతిచెందినట్లు స్థానికులు తెలిపారు. మరో మహిళ మడకం సీతమ్మ పరిస్థితి విషమంగా ఉందన్నారు. జగ్గారంలో కౌలు వ్యవసాయం చేస్తున్న రవిరాజు చేల్లో పనులకు వెళ్ళిన కూలీల సమీపంలో పిడుగు పడిందన్నారు. సీతమ్మను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Sorry, no posts matched your criteria.