India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

డీలర్లకు నెలలు తరబడి పెండింగ్ ఉన్న కమీషన్ను ఈనెల 31వ తేదీ వరకు విడుదల చేయాలని రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బానోతు వెంకన్న, షేక్ జానీమియ కోరారు. లేనిపక్షంలో సెప్టెంబర్ 1నుంచి రేషన్ షాపులు బంద్ చేస్తామని ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. 1వ తేదీన తహసీల్ ఎదుట, 2న ఆర్డీఓ కార్యాలయాల ఎదుట, 3వ తేదీన కలెక్టరేట్ ఎదుట ధర్నా చేయడమే కాక 4న అసెంబ్లీ ముట్టడి చేపడతామని తెలిపారు.

పీఎం ధర్తీ ఆబా జన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష అభియాన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు. అనంతరం 63 మంది మాస్టర్లకు శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. జిల్లాలో 9 మండలాల పరిధిలో 35 గ్రామాలలో అమలుచేసే గిరిజన జనాభాకు అందుబాటులో ఉన్న వనరులు పరిశీలించారు. ఇంకా ఏమేమి వసతులు కావాలో ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు సూచించారు.

పిల్లలు లేనివారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం మాత్రమే పిల్లలను దత్తత తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. కేరా నిబంధనల ప్రకారం దత్తత ప్రక్రియ జరగాలని ఆయన స్పష్టం చేశారు. బంధువుల పిల్లలైనా, ఇతరుల పిల్లలైనా నిబంధనలను పాటించకుండా దత్తత తీసుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చట్టవిరుద్ధంగా పిల్లలను పెంచుకోవడం, దత్తత ఇవ్వడం లేదా తీసుకోవడం నేరమని పేర్కొన్నారు.

ఖమ్మం జిల్లాకు 5 డెంగీ ఏలిషా వాషర్, రీడర్ యంత్రాలను సరఫరా చేయడానికి టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు DMHO కళావతి బాయి తెలిపారు. ఆసక్తిగల సరఫరాదారులు జిల్లా కలెక్టరేట్లోని వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయంలో ఆగస్టు 31వ తేదీ లోపు తమ టెండర్లను సమర్పించాలని పేర్కొన్నారు. సెప్టెంబర్ 1న మధ్యాహ్నం 3 గంటలకు వాటిని ఫైనల్ చేయనున్నట్లు ఆమె వివరించారు.

కొణిజర్ల మండలం లాలాపురం- తీగలబంజారా వద్ద గల పగిడేరు వాగు వరద ప్రవాహన్ని గురువారం సీపీ సునీల్ దత్ పరిశీలించారు. వరద తీవ్రతను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జలమయమైన రోడ్లు, వంతెనలు దాటే ప్రయత్నం చేయవద్దన్నారు. అత్యవసర సమయాల్లో డయల్ 100, 1077కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఆ మార్గంలో రాకపోకలు సాగించకుండా నిరోధించాలని ఆదేశించారు.

జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించడానికి NDRF, SDRF బృందాలు సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రజల సహాయార్థం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. ఏమైనా అత్యవసర పరిస్థితులు ఎదురైతే 1077 లేదా 9063211298 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని కలెక్టర్ సూచించారు.

ఖమ్మం కలెక్టరేట్లో జరిగిన PM ధర్తీ ఆబాజన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష అభియాన్ శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రారంభించారు. గిరిజన గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి పటిష్ట కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు. రాబోయే 5 ఏళ్లలో రూ.79,156 కోట్లతో ఈ పథకం అమలవుతుందని తెలిపారు. ఖమ్మం జిల్లాలో 9 మండలాల్లోని 35 గ్రామాల్లో ఈ కార్యక్రమం అమలు కానుంది. గిరిజనులకు అవసరమైన వసతులు కల్పించాలన్నారు.

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు. నీటిమునిగిన రోడ్లు, వంతెనలు దాటరాదని, వాగులు, చెరువుల వద్దకు వెళ్లకూడదని హెచ్చరించారు. అత్యవసర సమయాల్లో డయల్ 100, 1077 లేదా పోలీస్ కంట్రోల్ నెంబర్ 87126 59111, 90632 11298లకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.

ఖమ్మం జిల్లాలో నిన్న ఉదయం 8.30 గంటల నుంచి నేడు ఉదయం 6 గంటల వరకు 1201.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. కొనిజర్లలో 95.1, YRP 92, వేంసూరు, KMM(R) 84.8, వైరాలో 84.1, రఘునాథపాలెంలో 82.4 మి.మీ. వర్షం పడింది. చింతకాని 74.2, కల్లూరు, SPL 57, ENKR 56, సింగరేణి 54, ఖమ్మం అర్బన్లో 51.8 మి.మీ.గా నమోదైందని జిల్లా సగటు వర్షపాతం 57.2 మి.మీ.గా ఉందన్నారు.

సత్తుపల్లి మండలం పాకలగూడెంలో విషాదం నెలకొంది. తల్లికూతుర్లను పాము కాటు వేయగా చిన్నారి మౌనిక (5) మృతి చెందింది. ఆమె తల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఇంట్లో నేలపై పడుకుని ఉండగా రాత్రి 2 గంటల సమయంలో పాము కాటు వేసిందని చిన్నారి తండ్రి గోపి తెలిపాడు. పాప మృతితో విషాదం నెలకొంది.
Sorry, no posts matched your criteria.