India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి ఖమ్మం జిల్లాపై MLC కల్వకుంట్ల కవిత ఫోకస్ పెట్టారనే మాటలు వినిపిస్తున్నాయి. ఇటీవల 2రోజులు జిల్లాలో ఆమె పర్యటించి, నేతలకు.. కేసీఆర్కు మధ్య వారధిగా ఉంటానని భరోసానిచ్చారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆమె ఖమ్మం నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. నిజామాబాద్లో గ్రూపు తగాదాలతో ఆమె సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఖమ్మంను ఎంచుకున్నట్లు ప్రచారం నడుస్తోంది.
రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. మండలంలోని అనంతనగర్ గ్రామ శివారులో ఆగి ఉన్న టిప్పర్ను ద్విచక్రవాహనం ఢీకొనడంతో బైక్పై ఉన్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నేలకొండపల్లి మండలంలో గల డీసీఎంఎస్ కేంద్రాన్ని, రాజేశ్వరపురంలోని అరుణచల రైస్ మిల్లును శుక్రవారం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సందర్శించారు. ధాన్యం, కొనుగోలు, ట్రాన్స్పోర్ట్, కాంటాలు, బిల్లులు తదితర అంశాలపై రైతులు, మిల్లర్లతో మాట్లాడారు. రైతులకు ఏలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని మిల్లర్లకు సూచించారు. సీపీ వెంట సీఐ సంజీవ్, ఎస్ఐ సంతోష్ పాల్గొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. టేకులపల్లి మండలం రేగులతండాలో పురుగు మందు తాగి దంపతులు దీపిక, శ్రీను ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ఈ ఘటనలో భార్య మృతి చెందగా, భర్త పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.
ఖమ్మం నగరంలో అక్రమంగా ఏర్పాటు చేసిన ఓ టీ స్టాల్ను మున్సిపల్ అధికారులు తొలగించారు. నగర పాలక సంస్థ పరిధిలోని శ్రీ శ్రీ సర్కిల్ వద్ద 35 అడుగుల రోడ్డుపై ఏర్పాటు చేసిన టీ స్టాల్ను టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, DRF సిబ్బందితో కలిసి తీసివేశారు. నగర శుభ్రత, వాహన రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడడమే ఈ చర్యల ఉద్దేశమని అధికారులు తెలిపారు.
నేలకొండపల్లి మండలంలో గల జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం కేంద్రాన్ని, రాజేశ్వరపురంలోని రైస్ మిల్లును శుక్రవారం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పరిశీలించారు. ధాన్యం కొనుగోళ్లు, రవాణా, కాంటాలు, బిల్లులు వంటి అంశాలపై రైతులు, మిల్లర్లతో మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని, మిల్లర్లకు, అధికారులకు సూచించారు.
వరకట్నం ఇచ్చే విషయమై ఒప్పంద పత్రం రాస్తేనే పెళ్లి జరుగుతుందని వరుడు తెగేసి చెప్పడంతో పీటలపైన పెళ్లి ఆగిపోయిన ఘటన కూసుమంచిలో జరిగింది. స్థానికుల వివరాలిలా.. మండలంలోని వేర్వేరు గ్రామాలకు చెందిన యువతీయువకుడు ఇష్టపడ్డారు. ఇరువర్గాలను ఒప్పించి పెళ్లికి సిద్ధమయ్యారు. జీలకర్ర బెల్లం పెట్టే సమయంలో వరుడు నగదు, ఎకరా భూమి ఎప్పుడు ఇస్తారో ఒప్పంద పత్రం రాసి ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పెళ్లి నిలిచిపోయింది.
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వారం రోజులుగా ఎండలు దంచి కొడుతున్నాయి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వారం వ్యవధిలో ఆరుగురు మృతిచెందగా.. ఇవాళ ఒకరు చనిపోయారు. పెనుబల్లి మండలం కొత్తకారాయిగూడెంకు చెందిన వడ్రంగి నెల్లూరి బోధనాచారి అలియాస్ చంటి (37) వడదెబ్బకు గురై మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కారేపల్లి మండలంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు కథనం ప్రకారం.. దుబ్బతండాకు చెందిన లావుడ్యా భద్రు(52) రెండు ఎకరాలలో మిర్చి, రెండు ఎకరాలలో పత్తి సాగు చేశాడు. పంట సరిగ్గా పండగ పోవడంతో చేసిన అప్పులు తీరవని బాధతో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.
∆} ఖమ్మంలో మంత్రి తుమ్మల పర్యటన ∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} నేలకొండపల్లిలో భూభారతిపై అవగాహన కార్యక్రమం ∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ∆} వేంసూరు మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} ఖమ్మంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} మధిర మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
Sorry, no posts matched your criteria.