Khammam

News August 25, 2024

భద్రాద్రి రామాలయంలో భక్తుల సందడి

image

ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం రామాలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆదివారం సెలవు దినం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో భద్రాచలం తరలివచ్చారు. అర్చకులు ఉదయం స్వామివారికి అభిషేకం, అర్చన, ఆరాధన, పుణ్యవచనం, సేవాకాలం తదితర పూజలు గావించారు భక్తులు క్యూలైన్‌లో బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రాక సందర్భంగా రామాలయం ప్రాంగణం సందడిగా కనిపించింది.

News August 25, 2024

ఖమ్మం: GREAT.. ఈ అబ్బాయికి రూ.కోటి స్కాలర్‌షిప్

image

ఖమ్మం జిల్లాకి చెందిన కొక్కిరేణి సాకేత్‌ సాగర్‌ ఏకంగా 4 అమెరికా విశ్వవిద్యాలయాలకు ఎంపికై అట్లాంటలోని జార్జియా యూనివర్సిటీలో రూ.కోటి స్కాలర్‌షిప్ సాధించాడు. తనకు ఇష్టమైన కంప్యూటర్‌ సైన్స్‌లో బీటెక్‌ చదివేందుకు ఈనెల 19న వెళ్లారు. అయితే అక్కడి యూనివర్సిటీలో నిర్వహించే పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిస్తే నిర్వాహకులే స్కాలర్‌షిప్‌లు ఇచ్చి ఉచితంగా చదువు చెబుతారు. అటువంటి అవకాశాన్ని సంపాదించుకున్నాడు.

News August 25, 2024

ఖమ్మం ఈసారి సర్పంచ్ పోటికి యువత ఉత్సాహం

image

ఖమ్మం జిల్లాలో రాజకీయాలంటే పెద్దగా ఆసక్తి చూపని యువత ధోరణిలో ప్రస్తుతం మార్పు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. రాజకీయాల్లోకి రావడానికి మక్కువ చూపుతున్నారు. అందుకు పంచాయతీ ఎన్నికలను అవకాశంగా మలుచుకోవాలని ఎంతో మంది యువకులు భావిస్తున్నారు. అటు రాజకీయ హోదాను అనుభవించేందుకు, అదే సమయంలో ఇటు ప్రజా సేవ చేయొచ్చన్న ఆలోచనతో చాలా మంది యువ నేతలు పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు.

News August 25, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} పలు శాఖల అధికారులతో ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ఓటర్ సర్వే
∆} ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన
∆} అశ్వాపురంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} భద్రాచలంలో ఎమ్మెల్యే వెంకట్రావు పర్యటన
∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన

News August 25, 2024

అశ్వారావుపేటలో తాచుపాము కలకలం

image

కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని జంగారెడ్డిగూడెం రహదారిలో మల్లికార్జునరావు ఇంట్లో తాచుపాము కలకలం సృష్టించింది. వంట గదిలో పాము ఉండటంతో ఇంట్లో వారు భయాందోళనకు గురయ్యారు. దాదాపు రెండు గంటల పాటు అది అక్కడే ఉండటంతో స్థానికులు అటవీశాఖ FBO సురేశ్‌కు సమాచారం ఇవ్వడంతో ఆయన పాములు పట్టే వ్యక్తి ప్రదీప్‌ను పిలిపించి దానిని బంధించి అటవీ ప్రాంతంలో వదిలేశారు.

News August 24, 2024

KMM: రైతులకు సక్రమంగా ఎరువులు అందించాలి: మంత్రి తుమ్మల

image

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎరువుల పరిస్థితిపై అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సమీక్షలో వానాకాలానికి అంచనా వేసిన ఎరువులు, అందుబాటులో ఉన్న ఎరువుల లభ్యతపై మంత్రికి అధికారులు వివరించారు. 10,41,000 టన్నుల యూరియా, 240 లక్షల టన్నుల DAP, 10 లక్షల టన్నుల కాంప్లెక్స్ 0.60 లక్షల టన్నుల MOP అవసరమవుతాయని అంచనా వేశారు. రైతులకు సక్రమంగా ఎరువులు అందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

News August 24, 2024

ఖమ్మం: గవర్నర్‌ను కలిసిన ఎంపీ రఘురామిరెడ్డి

image

రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి శనివారం హైదరాబాద్‌లోని రాజ్ భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. తన తండ్రి, మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి‌తో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా.. ఆధ్యాత్మికం, పర్యాటకంగా ప్రసిద్ధి చెందిందని తెలిపారు. ఇటు ఖమ్మం ఖిల్లా, దక్షిణ ఆసియాలోనే పెద్దదైన బౌద్ధ స్తూపం గురించి వివరించారు.

News August 24, 2024

ఖమ్మం: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కలిసిన డిప్యూటీ సీఎం

image

ఖమ్మం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ను ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్ర మంత్రితో డిప్యూటీ సీఎం చర్చించారు. అలాగే పలు అంశాలపై కేంద్రమంత్రితో డిప్యూటీ సీఎం సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని పేర్కొన్నారు.

News August 24, 2024

పాల్వంచ: లారీని ఢీకొన్న కారు.. పలువురికి తీవ్ర గాయాలు

image

పాల్వంచ నవభారత్ మైనింగ్ కళాశాల వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. ముందు వెళ్తున్న ఓ లారీ సడన్ బ్రేక్ వేయడంతో వెనుక నుంచి వస్తున్న ఓ లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు చికిత్స నిమిత్తం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News August 24, 2024

కొండ్రుగట్ల: ‘అంగన్వాడీ కేంద్రాల్లో దోపిడీ, నిర్లక్ష్యాన్ని ఉపేక్షించం’

image

అంగన్వాడి కేంద్రాల్లో దోపిడీ నిర్లక్ష్యం లాంటివి చేస్తే ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే మట్ట రాగమయి అన్నారు. శనివారం కొండ్రుగట్లలో అంగన్వాడి కేంద్రాన్ని, పల్లె దవాఖానను ఎమ్మెల్యే సందర్శించి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు అంగన్వాడీ సిబ్బంది పౌష్టికాహారం అందించాలని సూచించారు. అలాగే పల్లె దవాఖానాలు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని వైద్యులను ఆదేశించారు.