India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అంగన్వాడి కేంద్రాల్లో దోపిడీ నిర్లక్ష్యం లాంటివి చేస్తే ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే మట్ట రాగమయి అన్నారు. శనివారం కొండ్రుగట్లలో అంగన్వాడి కేంద్రాన్ని, పల్లె దవాఖానను ఎమ్మెల్యే సందర్శించి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు అంగన్వాడీ సిబ్బంది పౌష్టికాహారం అందించాలని సూచించారు. అలాగే పల్లె దవాఖానాలు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని వైద్యులను ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అందిస్తున్న ప్రగతి చక్ర అవార్డు కార్యక్రమంలో భాగంగా సత్తుపల్లి ఆర్టీసీ డిపోకి ఉత్తమ మొదటి డిపో అవార్డు దక్కింది. ఈరోజు హైదరాబాద్లో జరిగిన అవార్డ్స్ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ MD సజ్జనార్ చేతుల మీదుగా రూ.3 లక్షల క్యాష్ అవార్డును సత్తుపల్లి డిపో మేనేజర్ U.రాజ్యలక్ష్మీ ఈ అవార్డును అందుకున్నారు.
ఖమ్మం జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికలు వాయిదా పడతాయని భావిస్తున్న తరుణంలో పంచాయతీ ఓటర్ల ముసాయిదా షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించడంతో పల్లెల్లో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ మద్దతుదారులతో పాటు వనరుల సమీకరణలో నిమగ్నమయ్యారు. ఖమ్మం జిల్లాలో 589 గ్రామ పంచాయతీల్లోని 5389 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉంది.
రెండు లక్షల లోపు రుణం ఉండి అన్ని వివరాలు సక్రమంగా ఉన్నా రుణమాఫీకి నోచుకోని రైతుల కోసం త్వరలో ఒక మొబైల్ యాప్ తీసుకొస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. రెండు లక్షల వరకు రుణం తీసుకున్నప్పటికీ మాఫీ కానీ 4,24,873 మంది రైతుల ఖాతాల వివరాలను సేకరించనున్నామని వీటిని మొబైల్ యాప్ లో అప్లోడ్ చేయనున్నట్లు మంత్రి తెలిపారు . వ్యవసాయ అధికారులు రైతుల వద్దకు వెళ్లి వివరాలు సేకరిస్తారు.
‘చౌకదుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ’ హామీని జనవరి నుంచి అమలుచేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి వెల్లడించారు. ఈ పథకం అమలైతే.. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని 1,190 రేషన్ దుకాణాల పరిధిలో 7,04,615 మంది కార్డుదారులకు లబ్ధి చేకూరనుంది. రేషన్ బియ్యం పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, డీలర్ షిప్ కూడా తొలగిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఖమ్మంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీకి స్థలం కేటాయించిన నేపథ్యంతో నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. అలాగే, సీజనల్ వ్యాధులు ప్రబలుతుండడంతో వైద్యులు, నర్సులను పూర్తిస్థాయిలో నియమించి పీహెచ్సీలను బలోపేతం చేయాలని మంత్రి తుమ్మల కోరారు.
>ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన
>వివిధ శాఖల అధికారులతో ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష
>ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
>బూర్గంపాడులో ఎమ్మెల్యే పాయం పర్యటన
>నేలకొండపల్లిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
>ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సెలవు
>ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమం
చంద్రుగొండ మండలం ఇమ్మడి రామయ్య బంజర్లో గుప్తనిధుల తవ్వకాలు జరిపిన 9మందిని కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ మీడియా ముందు హాజరు పరిచారు. అయ్యన్నపాలెంకి చెందిన బేతి నీలయ్య జామాయిల్ తోటలో గుప్త నిధులు ఉన్నాయంటూ దామరచర్లకి చెందిన కర్రి రామకృష్ణ, నీలయ్యకు చెప్పాడు. పూజలు జరిపి తవ్వేందుకు ఖమ్మం జిల్లా కారేపల్లి, ఏపీలోని విస్సన్నపేటకు చెందిన వారిని తీసుకొచ్చాడని డీఎస్పీ చెప్పారు.
ఇప్పుడు ఎక్కడ చూసిన హైడ్రా గురించే మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే HYDలో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చి వేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఖమ్మం జిల్లాలో కూడా హైడ్రా ఏర్పాటు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వ భూములు, చెరువులు, కొలనులు, డ్రైనేజి కాలువలను ఆక్రమించి నిర్మాణం చేపట్టిన భవనాలపై చర్యలు తీసుకుంటుందని సమాచారం. దీంతో అక్రమార్కులు భయాందోళనకు గురవుతున్నారు.
☆ కేటీఆర్ కు మంత్రి పొంగులేటి సవాల్
☆ కొత్తగూడెంలో బాలికలపై ఉపాధ్యాయుడు అసభ్య ప్రవర్తన
☆ రుణమాఫీ కాని రైతుల దరఖాస్తులు అప్డేట్ చేశాం: భద్రాద్రి కలెక్టర్
☆ నిండు ప్రాణాల్ని మావోయిస్టులు బలి తీసుకున్నారు: ఎస్పీ
☆ చంద్రుగొండ లో కుక్కల దాడిలో దుప్పికి గాయలు
☆ ఖమ్మం జిల్లాలో పశుగణన పకడ్బందీగా చేపట్టాలి: అదనపు కలెక్టర్
☆ బాలికలతో అసభ్యంగా ప్రవర్తించిన తెలుగు టీచర్ సస్పెండ్
Sorry, no posts matched your criteria.