Khammam

News March 14, 2026

తండ్రి మరణించినా.. కన్నీళ్లను దిగమింగి పరీక్ష రాసిన విద్యార్థి

image

కల్లూరు మండలంలోని బత్తులపల్లిలో విషాదం చోటుచేసుకుంది. పదో తరగతి విద్యార్థి గండేపల్లి మణికంఠ తండ్రి కొండలరావు శనివారం ఉదయం ఖమ్మం ఆస్పత్రిలో కన్నుమూశారు. మరికొద్ది గంటల్లో పరీక్ష ఉండగా తండ్రి మరణించడంతో మణికంఠ కుప్పకూలిపోయాడు. అయినా, తండ్రి ఆశయం కోసం గుండె నిబ్బరం చేసుకుని, కన్నీళ్లను దిగమింగి పరీక్షకు హాజరయ్యాడు. బాధ్యతను గుర్తించి మణికంఠ చూపిన ధైర్యం తోటి విద్యార్థులను, స్థానికులను కలచివేసింది.

News March 14, 2026

గ్యాస్ అక్రమాలపై కఠిన చర్యలు: DSO చందన్ కుమార్

image

ఖమ్మం జిల్లాలో గృహావసరాల గ్యాస్ సిలిండర్ల పంపిణీలో అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని DSO చందన్ కుమార్ హెచ్చరించారు. కృత్రిమ కొరత సృష్టించడం, అక్రమంగా నిల్వ ఉంచడం సహించబోమన్నారు. జిల్లాలో సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయని వినియోగదారులు ఆందోళన చెందవద్దన్నారు. నిబంధనల ప్రకారం బుకింగ్ చేసిన వారికి సక్రమంగా సిలిండర్లు పంపిణీ చేయాలని డీలర్లకు ఆదేశించారు.

News March 14, 2026

గ్యాస్ అక్రమాలపై కఠిన చర్యలు: DSO చందన్ కుమార్

image

ఖమ్మం జిల్లాలో గృహావసరాల గ్యాస్ సిలిండర్ల పంపిణీలో అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని DSO చందన్ కుమార్ హెచ్చరించారు. కృత్రిమ కొరత సృష్టించడం, అక్రమంగా నిల్వ ఉంచడం సహించబోమన్నారు. జిల్లాలో సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయని వినియోగదారులు ఆందోళన చెందవద్దన్నారు. నిబంధనల ప్రకారం బుకింగ్ చేసిన వారికి సక్రమంగా సిలిండర్లు పంపిణీ చేయాలని డీలర్లకు ఆదేశించారు.

News March 14, 2026

ఖమ్మం: ఎస్సీ సబ్సిడీ పథకాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఖమ్మం జిల్లాలో 2025–26 ఎస్సీ యాక్షన్ ప్లాన్ కింద సబ్సిడీ పథకాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఈ నెల 17 నుంచి 24 వరకు tsobmms.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ పంపుల పంపిణీలో గిగ్ కార్మికులకు ప్రాధాన్యత ఉంటుందని, అర్హులైన ఎస్సీ యువత అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

News March 14, 2026

ఖమ్మంలో ఆర్టీసీ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ దరఖాస్తులు

image

టీజీఎస్ ఆర్టీసీ ఖమ్మం రీజియన్‌లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆర్ఎం సరీరామ్ తెలిపారు. బీఎస్సీ, బీకాం, బిబిఏ, బీసీఏ, బీఏతో పాటు ఇంజనీరింగ్ డిప్లమా పూర్తి చేసిన అభ్యర్థులు అప్రెంటిషిప్‌కు అర్హులని చెప్పారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.

News March 14, 2026

వలస కార్మికుల వివరాలపై కేంద్రాన్ని కోరిన ఎంపీ రఘురాంరెడ్డి

image

విదేశాల్లో ఉపాధి పొందుతున్న తెలంగాణ వలస కార్మికుల గణాంకాలను వెల్లడించాలని ఎంపీ రఘురాంరెడ్డి లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రం నుంచి వెళ్లిన పురుష, మహిళా కార్మికుల వివరాలతో కూడిన సమగ్ర డేటాబేస్ అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు. దీనికి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గరిటా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. వలస కార్మికుల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలను వివరించారు.

News March 14, 2026

వలస కార్మికుల వివరాలపై కేంద్రాన్ని కోరిన ఎంపీ రఘురాంరెడ్డి

image

విదేశాల్లో ఉపాధి పొందుతున్న తెలంగాణ వలస కార్మికుల గణాంకాలను వెల్లడించాలని ఎంపీ రఘురాంరెడ్డి లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రం నుంచి వెళ్లిన పురుష, మహిళా కార్మికుల వివరాలతో కూడిన సమగ్ర డేటాబేస్ అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు. దీనికి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గరిటా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. వలస కార్మికుల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలను వివరించారు.

News March 14, 2026

వలస కార్మికుల వివరాలపై కేంద్రాన్ని కోరిన ఎంపీ రఘురాంరెడ్డి

image

విదేశాల్లో ఉపాధి పొందుతున్న తెలంగాణ వలస కార్మికుల గణాంకాలను వెల్లడించాలని ఎంపీ రఘురాంరెడ్డి లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రం నుంచి వెళ్లిన పురుష, మహిళా కార్మికుల వివరాలతో కూడిన సమగ్ర డేటాబేస్ అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు. దీనికి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గరిటా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. వలస కార్మికుల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలను వివరించారు.

News March 13, 2026

ఖమ్మం: ఎస్సీ యాక్షన్ ప్లాన్‌ దరఖాస్తుల ఆహ్వానం

image

ఖమ్మం జిల్లాలో ఎస్సీ యాక్షన్ ప్లాన్–2025-26ను కలెక్టర్ అనుదీప్ శుక్రవారం విడుదల చేశారు. బ్యాంకు అనుసంధానంతో ఈవీ ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, సోలార్ పంప్ కంట్రోల్ పథకాలకు దరఖాస్తులు కోరారు. అర్హులైన ఎస్సీ అభ్యర్థులు ఈ నెల 17 నుంచి 24 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఇతర వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేయాలన్నారు.

News March 13, 2026

వంట గ్యాస్‌కు కొరత లేదు: కలెక్టర్ అనుదీప్

image

జిల్లాలో గృహావసరాల వంట గ్యాస్‌కు ఎలాంటి కొరత లేదని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌లో గ్యాస్ డీలర్లు, పౌర సరఫరాల అధికారులతో ఆయన సమీక్షించారు. కొరతపై వస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని, ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. గృహ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు మళ్లిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ నిల్వలు, అధిక ధరలపై నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు.