Khammam

News March 6, 2025

ఖమ్మం మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు

image

కాజీపేట–విజయవాడ మార్గంలో నిర్మిస్తున్న మూడో రైల్వే లైన్‌ పనులు నేపథ్యంలో ఖమ్మం మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేసినట్లు ఖమ్మం రైల్వే అధికారి ఎం.డీ.జాఫర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 7 నుంచి 13 వరకు 8 రైళ్లను రద్దు చేశామని వెల్లడించారు. ఈ విషయాన్ని గమనించి జిల్లా ప్రయాణికులు రాకపోకలు కొనసాగించాలని సూచించారు. ఎదైనా సమాచారం కోసం ఖమ్మం రైల్వే స్టేషన్‌‌లో సంప్రదించాలన్నారు.

News March 6, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన ∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలు ∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} పెనుబల్లి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ∆} నేలకొండపల్లిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన

News March 6, 2025

ఖమ్మం కలెక్టర్ GREAT.. దివ్యాంగులకు ఉచిత భోజనం

image

పాలనలో తనకంటూ మార్క్ క్రియేట్ చేసుకుంటున్నారు ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్. విద్యార్థులు, ప్రజలతో మమైకమవుతూ వినూత్న శైలిని అనుసరిస్తున్నారు. సమస్యలపై కలెక్టరేట్‌కు వచ్చే దివ్యాంగులు ఖాళీ కడుపుతో వెళ్లొద్దనే భావనతో ఉచితంగా మధ్యాహ్న భోజనాన్ని బుధవారం నుంచి ప్రారంభించారు. 40 శాతం వైకల్యంతో ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. దీంతో కలెక్టర్‌కు జిల్లావాసులు అభినందనలు తెలుపుతున్నారు.

News March 6, 2025

ఖమ్మంలో జిల్లాలో భగ్గుమంటున్న భానుడు!

image

వేసవి కాలం ప్రారంభంలోనే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. బుధవారం రికార్డు స్థాయిలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సింగరేణి ప్రాంతంలో తీవ్రత మరింతగా ఉంది. ఉదయం 8 గంటల నుంచే బయటకు వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు. తీవ్రమైన ఎండ, వేడిగాలులు, ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. మరో 3-4 రోజుల్లో ఎండ, వేడి గాలుల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావారణ శాఖ అంచనా వేస్తుంది.

News March 6, 2025

KMM: మద్యానికి డబ్బు ఇవ్వలేదని ఆత్మహత్య

image

ఖమ్మం నగరంలోని రామన్నపేటకు చెందిన షేక్ ఖాసీం(38) ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షేక్ ఖాసీం సెంట్రింగ్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిసైన అతను మంగళవారం రాత్రి డబ్బుకోసం భార్యతో గొడవపడ్డాడు. ఆమె ఇవ్వకపోవడంతో ఇంట్లోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News March 6, 2025

ఖమ్మం కోర్టులో రూ.24 లక్షలకు ఐపీ దాఖలు

image

ఖమ్మం పట్టణానికి చెందిన లత అనే మహిళ రూ.24,10,000 లకు ఖమ్మం కోర్టులో దివాళా పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రైవేట్ హోటల్ వ్యాపారం చేస్తుండగా, వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి అధిక వడ్డీలకు అప్పులు చేశారు. వ్యాపారంలో తీవ్రంగా నష్టం రావడంతో, రుణదాతల నుంచి ఒత్తిడి తీవ్రం కావడంతో 12 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ తమ న్యాయవాది ద్వారా బుధవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

News March 6, 2025

ఖమ్మంలో నేడు జాబ్ మేళా

image

ఖమ్మం జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు గురువారం టేకులపల్లి మోడల్ కెరీర్ సెంటర్ (ప్రభుత్వ ఐటీఐ)లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఖమ్మం జిల్లా ఉపాధి అధికారి ఎన్.మాధవి ఒక ప్రకటనలో తెలిపారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వేతనం రూ.13వేలు ఉంటుందని, మొత్తం 500 ఉద్యోగ ఖాళీల భర్తీకి ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

News March 6, 2025

దివ్యాంగుల కోసం హెల్ప్ డెస్క్: ఖమ్మం కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో దివ్యాంగులకు హక్కులపై అవగాహన కల్పించి, ప్రభుత్వ పథకాల లబ్ధిచేకూరేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ బుధవారం తెలిపారు. యూ.డి.ఐ.డి కార్డు పొందే విధానంపై నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి మండల కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక ఎంప్లాయిమెంట్ ఎక్స్‌చేంజ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

News March 5, 2025

ఖమ్మం: ఇంటర్ పరీక్షలు.. మొదటి రోజు 669 గైర్హాజరు

image

ఖమ్మం జిల్లాలో మొదటిరోజు ఇంటర్ మొదటి సం.. పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవిబాబు తెలిపారు. జనరల్ కోర్సుల్లో 16,317 మందికి గాను 15,845 మంది, అలాగే ఒకేషనల్ కోర్సుల్లో 2,384 మంది విద్యార్థులకు గాను 2,187 మంది విద్యార్థులు హాజరయినట్లు చెప్పారు. రెండు కోర్సులకు గాను 669 మంది గైర్హాజరయ్యారన్నారు. అటు జిల్లాలో ఇవాళ ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని పేర్కొన్నారు.

News March 5, 2025

నిలువెల్లా రక్తం.. తల్లడిల్లిన తల్లి హృదయం..!

image

రోడ్డు ప్రమాదంలో ఆ తల్లికి తీవ్రగాయాలై నిలువెల్లా రక్తం కారుతోంది. అయినా సరే ఆ తల్లి హృదయం తన బిడ్డ కోసం తల్లడిల్లింది. తన బిడ్డకు ఏమైందోనని ఆమె పడిన ఆందోళన స్థానికులను కంటతడి పెట్టించింది. KMM జిల్లా <<15656275>>తనికెళ్ల వద్ద బస్సు బోల్తా<<>> పడిన ఘటనలో ఈ దృశ్యం కనిపించింది. బస్సులో ఉన్న తల్లాడ మండలం అన్నారుగూడెం వాసి బీరవెల్లి రాణికి రక్తం కారుతున్నా బిడ్డ కోసం వెతికింది. ఆమెను ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.

error: Content is protected !!