Khammam

News April 16, 2025

ఖమ్మం: విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలలో చేరాలి: అ.కలెక్టర్

image

పదో తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో చేరేలా అధికారులు కార్యాచరణ రూపొందించాలని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీజ అన్నారు. జిల్లాలో 14 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, వీటితోపాటు ప్రభుత్వ కేజీబీవీ, రెసిడెన్షియల్ కళాశాలలు ఉన్నాయని చెప్పారు. వీటిలో 100 శాతం అడ్మిషన్లు జరిగేలా చూడాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు.

News April 16, 2025

కొత్తగూడెం: యువతి చదువుకు బాబుమోహన్ భరోసా

image

కొత్తగూడెం(D) అశ్వారావుపేటకు చెందిన యువతి చదువుకు ప్రముఖ నటుడు బాబు మోహన్ భరోసానిస్తూ ముందుకు వచ్చారు. మండలంలోని బండారిగుంపునకు చెందిన బైట గోపాలరావు రెండో కుమార్తె సమీప బీటెక్ పూర్తి చేసింది. ఎంటెక్ చదవడానికి బాబుమోహన్ ముందుకు వచ్చి తన కుమారుడి ట్రస్ట్ పేరు మీద చదువు పూర్తి చేయిస్తానని హామీనిచ్చారు. చదువు పూర్తిచేసి ఫారెస్ట్ రేంజ్ అధికారిణి అవుతానని సమీప ఆయనకు తెలిపింది.

News April 16, 2025

భవిత కేంద్రాలను ఆధునీకరించాలి: అ.కలెక్టర్

image

ఖమ్మం: మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలవాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ పి.శ్రీజ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో అధికారులతో భవిత కేంద్రాల ఆధునీకరణపై ఇన్‌ఛార్జ్ కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. భవిత కేంద్రాల ఆధునీకరణ పనులను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.

News April 15, 2025

KMM: నియోజకవర్గాలకు ప్రత్యేకాధికారుల నియామకం

image

ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం పథకాల పటిష్ట అమలుకు నియోజకవర్గ ప్రత్యేక అధికారులను నియమించినట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ డా.శ్రీజ తెలిపారు. ఖమ్మంకు జడ్పీ సీఈఓ దీక్షా రైనా, పాలేరుకు ఎస్డీసీ రాజేశ్వరి, మధిరకు జిల్లా పంచాయతీ అధికారిణి ఆశాలత, వైరాకు డివిజనల్ పంచాయతీ అధికారి రాంబాబు, సత్తుపల్లికి ఎల్.రాజేంద్ర గౌడ్‌ ప్రత్యేక అధికారులుగా నియమించినట్లు పేర్కొన్నారు.

News April 15, 2025

నేలకొండపల్లి: చెట్టుకు ఉరేసుకుని విద్యార్థి సూసైడ్

image

నేలకొండపల్లిలో ఇంటర్మీడియట్ చదువుతున్న యశ్వంత్ ఓ వెంచర్‌లో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండల కేంద్రంలోని స్థానిక ఓ ప్రైవేట్ కాలేజీలో ఇటీవల ఇంటర్ పరీక్షలు రాశాడు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలం చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

News April 15, 2025

ఖమ్మం జిల్లాలో రాజీవ్ యువ వికాసానికి భారీగా దరఖాస్తులు

image

రాజీవ్‌ యువ వికాసం పథకానికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ గడువు సోమవారం అర్ధరాత్రి ముగిసింది. ఈ పథకం కోసం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 91,816 దరఖాస్తులు వచ్చినట్టు అధికారవర్గాలు వెల్లడించాయి. మీసేవ సెంటర్ల వద్ద దరఖాస్తు ప్రక్రియలో ఇబ్బందులతో పాటుగా వరుసగా వచ్చిన సెలవులతోఅభ్యర్థులు చాలావరకు సమస్యలు ఎదుర్కొన్నారు.

News April 15, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..! 

image

∆} ఖమ్మంలో మంత్రి తుమ్మల పర్యటన ∆} ఏన్కూర్ వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం ∆} నేలకొండపల్లి మండలంలో కాంగ్రెస్ నేతల ర్యాలీ ∆} వివిధ శాఖల అధికారులతో ఇన్‌ఛార్జ్ కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} మధిర ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} వైరాలో రాందాస్ నాయక్ పర్యటన

News April 15, 2025

ఖమ్మం : బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి

image

బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి చెందిన ఘటన ఖమ్మం రూరల్ మండలంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుదిమళ్లకి చెందిన చెరుకుపల్లి నర్సింహారావు (47) గ్రామ పరిధిలో ఓ ఇటుక బట్టీలో పని చేస్తున్నాడు. రోజూలాగే సోమవారం పనికి వెళ్లి బైక్ పై ఇంటికి వెళ్తుండగా.. అదుపుతప్పి కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో నర్సింహారావు తలకి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

News April 15, 2025

పైలెట్ ప్రాజెక్టుగా నేలకొండపల్లి ఎంపిక

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూభారతి పోర్టల్ అమలుకు చర్యలు చేపట్టింది. కాగా పైలెట్ ప్రాజెక్ట్ గా ఖమ్మం జిల్లా నుంచి ప్రభుత్వం నేలకొండపల్లిని ఎంపిక చేసింది. నేలకొండపల్లి మండలంలో భూభారతి పోర్టల్ ద్వారానే భూముల రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. పైలెట్ ప్రాజెక్ట్ గా నేలకొండపల్లిని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేయడం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News April 15, 2025

ప్రియుడిని హత్య చేసిన ప్రియురాలు అరెస్ట్: సీఐ

image

ప్రియుడిని గొంతునులిమి హత్య చేసిన ప్రియురాలిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఖమ్మం ఖానాపురం సీఐ భానుప్రసాద్ తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. ఖమ్మంకు చెందిన లావణ్య(35) తన భర్తతో విడిపోయి సత్తుపల్లిలో రవిప్రసాద్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తూ నివాసముంటుంది. కాగా తరచూ రవి ప్రసాద్ లావణ్యతో మద్యం తాగి గొడవపడేవాడు. ఏప్రిల్ 6న మద్యం మత్తులో ఉన్న ప్రసాద్‌ను గొంతునులిమి హత్య చేసిందని పేర్కొన్నారు.