Khammam

News August 16, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్యంశాలు

image

* సహచరుడిని హతమార్చిన మావోయిస్టులు
*ఎస్పీకి రాఖీ కట్టిన మంత్రి సీతక్క
*రైతు రుణమాఫీ చేశామని సీఎం చెప్పడం పచ్చి అబద్ధం: ఎమ్మెల్సీ
*భద్రాద్రి రామాలయంలో వరలక్ష్మీ వ్రతం పూజలు
*మణుగూరులో కత్తితో మహిళపై దాడి
*గంజాయి అరికట్టడంలో జిల్లా పోలీసుల పనితీరు భేష్
*కేటీఆర్ తన నోటిని అదుపులో ఉంచుకోవాలి: ఎమ్మెల్యే రాగమయి

News August 16, 2024

డెంగ్యూ జ్వరంతో యువకుడు మృతి..!

image

డెంగ్యూ జ్వరంతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన శుక్రవారం ఖమ్మం రూరల్ మండలంలో చోటు చేసుకుంది. తీర్థాలకు చెందిన మాచర్ల మధు(30) గత మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. కాగా ఖమ్మంలోని ఓ ఆసుపత్రిలో చూపించగా వైద్య పరీక్షలు నిర్వహించడంతో డెంగ్యూ నిర్ధారణ అయింది. అటు అతని లివర్లకు కూడా ఇన్ఫెక్షన్ కావడంతో మెరుగైన చికిత్స కోసం వరంగల్ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో మరణించాడు.

News August 16, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు మూడు రోజులు సెలవు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు మూడు రోజులు సెలవు ప్రకటించినట్లు మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. శని, ఆదివారం వారాంతపు సెలవులు, సోమవారం రాఖీ పౌర్ణమి సందర్భంగా సెలవు ప్రకటించినట్లు తెలిపారు. తిరిగి మంగళవారం నుండి మార్కెట్లో పంట క్రయవిక్రయాలు జరుగుతాయని చెప్పారు. కావున జిల్లా రైతు సోదరులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

News August 16, 2024

ఖమ్మం: వన్యప్రాణుల చిత్రవిభాగంలో సంపత్‌కు పురస్కారం

image

ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆధ్వర్యంలో పలు విభాగాల్లో ఫొటోగ్రఫీ పోటీలను నిర్వహించారు. ఖమ్మంకి చెందిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ చావా సంపత్ కుమార్ తీసిన చిత్రాలకు నేచర్ వైల్డ్ లైఫ్ విభాగంలో అత్యుత్తమ ప్రతిభా పురస్కారం లభించింది. ఈ ఫొటోగ్రఫీ పోటీల్లో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు ఫొటోగ్రాఫర్స్ పాల్గొన్నారు. ఈనెల 19న అవార్డు అందుకోనున్నారు.

News August 16, 2024

ఖమ్మం: మూడో విడత ఎంత మందికి రుణమాఫీ అంటే

image

ఖమ్మం జిల్లాలో మూడో విడత రైతు రుణమాఫీ లిస్టును జిల్లా అధికారులు శుక్రవారం విడుదల చేశారు. మూడో విడతలో మొత్తం 23,828 మంది రైతులకు రూ.లక్షన్నర నుంచి 2 లక్షల వరకు ప్రభుత్వం రుణమాఫీ చేయనుంది. అటు మొదటి, రెండు విడతల్లో వివిధ కారణాలతో రుణమాఫీ కానీ రైతులు స్థానిక కలెక్టరేట్ నందు ఏర్పాటుచేసిన, రైతు రుణమాఫీ ప్రత్యేక కౌంటర్ నందు సంప్రదించాలని జిల్లా అధికారులు పేర్కొన్నారు.

News August 16, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి పత్తి, మిర్చి ధరలు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.19,500 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,275 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. (బుధవారం) కంటే ఈరోజు పత్తి ధర రూ.26 తగ్గగా, ఏసీ మిర్చి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుందని వ్యాపారస్థులు తెలిపారు.

News August 16, 2024

ఖమ్మం: CC కెమెరాలు, మహిళా గార్డులు

image

కోల్‌కతాలో ట్రైనీ వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అయితే విద్యార్థునుల భద్రతపై ఆందోళన నెలకొన్న వేళ ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీ అధికారులు మాత్రం అభయమిస్తున్నారు. విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాకుండా పర్యవేక్షిస్తున్నామని చెబుతున్నారు. మహిళా సెక్యూరిటీ గార్డులు, కేర్ టేకర్లు విద్యార్థినుల బాగోగులు చూస్తారని చెబుతున్నారు.

News August 16, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో TODAY HEADLINES

image

✓ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు
✓వివిధ శాఖల అధికారులతో ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
✓ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన
✓ఇల్లెందులో విద్యుత్ సరఫరాలో అంతరాయం
✓మణుగూరులో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటన
✓దమ్మపేటలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటన
✓ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం

News August 16, 2024

భద్రాద్రి జిల్లాలో మూడో విడత.. రూ.116.61 కోట్లు

image

మూడో విడతలో రూ.2 లక్షలలోపు రుణమాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం గురువారం ప్రకటించగా భద్రాద్రి జిల్లాలో 10,859 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఆయా రైతులకు సంబంధించి రూ.116,61,44,302 మాఫీ కానున్నాయి. మొదటి విడతలో రూ.లక్ష వరకు రుణమాఫీ జరగగా 28,018 మంది రైతులకు రూ.132.06 కోట్లు, రెండో విడతలో రూ.1.50 లక్షల రుణం మాఫీ చేయగా 16,377 మంది రైతులకు రూ.137.21 కోట్ల మేర లబ్ధి జరిగింది. 

News August 16, 2024

ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం

image

జిల్లాస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికకు ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో సోమశేఖరశర్మ తెలిపారు. దరఖాస్తులను ఈనెల 20లోగా ఖమ్మం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అందించాలని తెలిపారు. 2022-23,2023-24లో వివిధ అంశాలతో నిర్ణీత నమూనాలు నేరుగా డీఈవో కార్యాలయానికి అందించాలని, దరఖాస్తుదారులపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు పెండింగ్ లో లేవని, కోర్టు కేసులు పెండింగ్లో లేవని ధ్రువీకరణ పత్రాలు అందించాలని తెలిపారు.