Khammam

News March 1, 2026

రూ.5 లక్షలకు జిల్లా కోర్టులో ఐపీ దాఖలు

image

ఖమ్మం రూరల్ మండలం MVపాలెంకు చెందిన బొందల రాజశేఖర్- కళ్యాణి దంపతులు జిల్లా కోర్టులో రూ.5 లక్షలకు ఐపీ దాఖలు చేశారు. కాగా వీరు కొంతమంది రుణదాతల వద్ద అవసరాల నిమిత్తం రూ.5 లక్షలు అప్పుతీసుకొని, ఆర్థిక ఇబ్బందుల కారణంగా వాటిని చెల్లించడం కష్టమైంది. దీంతో దంపతులు తమను దివాళా దారులుగా ప్రకటించాలని జిల్లా కోర్టులో తమ న్యాయవాది ద్వారా ఐపీ దాఖలు చేశారు.

News March 1, 2026

ఖమ్మం: కుక్కకాటుపై ఆందోళన వద్దు: డీఎంహెచ్‌ఓ

image

ఖమ్మం జిల్లాలో కుక్కకాటు ఘటనల నేపథ్యంలో ప్రజలు భయాందోళన చెందవద్దని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రామారావు స్పష్టం చేశారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరిపడా టీకాలు, మందులు అందుబాటులో ఉన్నాయని భరోసా ఇచ్చారు. ముజుగూడెం బాధితులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని, ఒకరిని ఖమ్మం ప్రధాన ఆస్పత్రికి తరలించామని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సమీప ఆస్పత్రిని సంప్రదించాలని సూచించారు.

News March 1, 2026

భూదాన్ భూముల అక్రమాలపై విచారణ కొనసాగుతుంది: తుమ్మల

image

ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల అక్రమాలపై విచారణ కొనసాగుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సామాజిక మాధ్యమాలలో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని విజ్ఞప్తి చేశారు. పేదలకు చేసిన మోసం బయటకు రాకుండా కొందరు ప్రతిపక్ష పార్టీలతో కలిసి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. విచారణ పూర్తయ్యాక అన్ని విషయాలు బయటకు వస్తాయని, అప్పుడు తప్పుడు ప్రచారం చేసే జర్నలిస్టులు పశ్చాత్తాపపడతారన్నారు.

News March 1, 2026

రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఖమ్మం జిల్లా

image

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఫార్మర్‌ ఐడీ’ (రైతు గుర్తింపు కార్డు) నమోదులో ఖమ్మం జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. జిల్లాలో ఇప్పటివరకు 75.59 శాతం రిజిస్ట్రేషన్లు పూర్తయినట్లు జిల్లా వ్యవసాయాధికారి పుల్లయ్య వెల్లడించారు. జిల్లాలోని 3.39 లక్షల మంది రైతులకు గాను, ఇప్పటికే 2.33 లక్షల మంది 11 అంకెల ఐడీలను పొందారు. మిగిలిన రైతులు మార్చి 15లోగా ఏఈఓలను సంప్రదించి నమోదు చేసుకోవాలని కోరారు.

News February 28, 2026

వెలుగుమట్లలో బాధితులపై సర్వే కొనసాగుతోంది: కలెక్టర్

image

ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్లలో భూదాన్ భూముల ఆక్రమణల తొలగింపులో ఇళ్లు కోల్పోయిన వారి సామాజిక-ఆర్థిక సర్వే ముమ్మరంగా కొనసాగుతోందని అనుదీప్ దురిశెట్టి శనివారం తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాకు చెందిన 522 మంది, ఇతర జిల్లాలకు 107, ఇతర రాష్ట్రాలకు ముగ్గురిని గుర్తించారు. సర్వే పూర్తయ్యాక అర్హులకు నివాస స్థలం, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. సంబంధితులు సర్వేకు సహకరించాలని కోరారు.

News February 28, 2026

ఖమ్మం: అదనపు కలెక్టర్‌కు తీన్మార్ మల్లన్న వినతి

image

భూదాన్ భూముల బాధిత కుటుంబాలకు అదే భూమిలో పునరావాసం కల్పించాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డిని కోరారు. శనివారం తీన్మార్ మల్లన్న అదనపు కలెక్టర్‌ను కలిసి సమస్యలతో కూడిన వినతిపత్రం అందించారు. తక్షణ సహాయం కింద ప్రతి బాధిత కుటుంబానికి రూ.1 లక్ష ఆర్థిక సాయం అందించాలని కోరారు. భూదాన్ భూముల విషయంలో పేదలపై మాత్రమే చర్యలు తీసుకోవడం అన్యాయమని లేఖలో ప్రస్తావించారు.

News February 28, 2026

ఖమ్మం: పేరుకు మాత్రమే పేదల పార్టీ: ఈటల

image

కనికరం లేకుండా పేదల ఆవాసాలను కూల్చివేసి తప్పు జరిగినందుకు ముఖ్యమంత్రి బేషరతుగా బాధితులకు క్షమాపణ చెప్పాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. పేదలు ఓట్లు వేస్తే గద్దెనెక్కిన ఈ పార్టీ పేరుకు మాత్రమే పేదల పార్టీ అని చేతల్లో మాత్రం రాక్షస పార్టీ అని విమర్శించారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి బాధితులకు సత్వర న్యాయం చేయాలని, కూల్చిన చోటే ఇళ్లు కట్టించి ఇవ్వాలన్నారు. లేకుంటే ప్రజా తిరుగుబాటు తప్పదన్నారు.

News February 28, 2026

రేపు ఖమ్మంకు నేషనల్ ఎస్టీ కమిషన్ సభ్యుడి రాక

image

నేషనల్ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ ఆదివారం ఖమ్మంలో పర్యటించనున్నట్లు జిల్లా బీజేపీ నాయకుడు జాటోత్ మధునాయక్ తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా సా.3 గంటలకు ఎస్టీ కమిషన్ సభ్యుడు వెలుగుమట్ల భూదాన్ భూముల బాధితులను పరామర్శిస్తారని చెప్పారు. అనంతరం భూదాన్ భూముల్లో కూల్చివేసిన ఇళ్లను పరిశీలిస్తారని అన్నారు. ఈ విషయాన్ని అధికారులు, ప్రజలు గమనించాలని పేర్కొన్నారు.

News February 28, 2026

ఖమ్మం: ముఖ్యమంత్రి గారూ మీ హృదయం ఎందుకు కరగదు?

image

ఖమ్మం భూదాన్ ఘటనలో ఓ ఎస్‌ఐ కూడా బాధితుల పరిస్థితి చూసి కంటతడి పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని MLC తీన్మార్ మల్లన్న గుర్తు చేశారు. పోలీసులే కరిగిపోయారు, మరి ముఖ్యమంత్రి గారూ మీ హృదయం ఎందుకు కరగదు? అని ప్రశ్నించారు. బీసీలపై వివక్ష కొనసాగితే తెలంగాణ రాజ్యాధికార పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ‘రేపు అసెంబ్లీలో ఇదే అంశంపై గళమెత్తుతాను. ఎవరు అడ్డుకుంటారో చూస్తాను’ అంటూ సవాల్ విసిరారు.

News February 28, 2026

ఖమ్మం: బీసీ భూముల మీద కక్ష సాధింపు ఎందుకు: తీన్మార్ మల్లన్న

image

రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్‌, ఖమ్మం జిల్లాల్లో మొత్తం 65 వేల ఎకరాల భూదాన్ భూములు అగ్రవర్ణాల ఖబ్జాలో ఉన్నప్పుడు, పేద బీసీ కుటుంబాల 62 ఎకరాల భూముల మీద కక్ష సాధింపు చర్యలు ఎందుకని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం భూదాన్ భూముల్లో ఇళ్లు కోల్పోయిన బాధితులతో ముఖాముఖిగా సమావేశమైన మల్లన్న ప్రభుత్వంపై అగ్గి రవ్వలు రువ్వారు.