Khammam

News March 3, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం ∆} సత్తుపల్లిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ∆} ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల పర్యటన ∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} పైనంపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు ∆} వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన

News March 3, 2025

BRS నేత సుబ్బారావుకు KCR రూ.10 లక్షల ఆర్థిక సాయం

image

ఖమ్మం జిల్లాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఖమ్మం టౌన్ పార్టీ మాజీ అధ్యక్షుడు డోకుపర్తి సుబ్బారావు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సుబ్బారావును ఎర్రవెల్లిలోని ఫాంహౌస్‌కు ఆహ్వానించి ఆయన ఆరోగ్య పరిస్థితిని సమగ్రంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైద్య ఖర్చుల కోసం రూ.10లక్షల చెక్కును స్వయంగా సుబ్బారావుకు అందజేశారు.

News March 2, 2025

ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్య అంశాలు

image

✓: ఖమ్మం: ‘రాణా పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్యా యత్నం’✓: 8న లోక్ అదాలత్: కారేపల్లి ఎస్ఐ✓: నేలకొండపల్లి:పొంగులేటి చొరవతో షాదీఖానాకు రూ.50లక్షలు✓:ఖమ్మం: ‘ఆలయం ఎదుట అశ్లీల నృత్యాలు’✓ ఖానాపురం:తప్పుడు పత్రాల రిజిస్ట్రేషన్ల ముఠాపై కేసు నమోదు✓చింతకాని: కారులోనే లింగ నిర్ధారణ పరీక్షలు.. ఇద్దరు అరెస్ట్✓:ఖమ్మం: 20లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు: మంత్రి తుమ్మల

News March 2, 2025

కొత్తగూడెంకి ఎయిర్ పోర్ట్‌.. కేంద్రమంత్రి క్లారీటీ..!

image

కొత్తగూడెం ఎయిర్ పోర్ట్ నిర్మాణంపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. గతంలో ప్రభుత్వం ఓ స్థలం కేటాయించిందని.. కానీ ఆస్థలం ఫీజుబిలిటీ లేదని ప్రభుత్వానికి తెలపగా మరో స్థలం కేటాయించిందన్నారు. అక్కడ AAI ఫీజుబిలిటీ స్టడీ చేసిందన్నారు. కానీ ఆ స్థలానికి రిమార్క్స్ ఉన్నాయని ఆ ప్రాంతం డేటా కావాలని ప్రభుత్వానికి సూచించామన్నారు. ఆ డేటా వచ్చిన తరువాత పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

News March 2, 2025

కొత్తగూడెం ఎయిర్‌పోర్ట్‌పై కనిపించని పురోగతి

image

కొత్తగూడెం జిల్లాలో ఎయిర్‌పోర్టుపై ఉమ్మడి ఖమ్మం ప్రజల ఆశలు అడియాసలవుతున్నాయి. ఇటీవల ఎయిర్‌పోర్టు ఏర్పాటుపై ఫీజిబిలిటీ సర్వే పూర్తయిన విషయం తెలిసిందే. అయితే ప్రధాని మోదీ వరంగల్‌లో ఎయిర్‌పోర్టు అభివృద్ధికి అనుమతులు మంజూరు చేయగా వేగం పుంజుకుంది. కానీ కొత్తగూడెంలో మాత్రం ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ఈ విషయంపై జిల్లా మంత్రులు, రాష్ట్రంలోని కేంద్రమంత్రులు దృష్టిసారించాలని ప్రజలు కోరుతున్నారు.

News March 2, 2025

ఖమ్మం: ట్రాక్టర్‌ కిందపడి ఆరేళ్ల బాలుడి మృతి

image

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం ముజాహిద్‌పురంలో విషాదం నెలకొంది. నల్లగట్టు ఉపేందర్ దంపతుల కుమారుడు రోహిత్(6), ట్రాక్టర్ మీద ఆడుకుంటుండగా, ఇంజన్‌కు ఉన్న తాళం తిప్పడంతో సడన్‌గా ట్రాక్టర్ స్టార్ట్ అయి ముందుకు కదిలింది. దీంతో భయంతో ట్రాక్టర్ నుంచి కిందకు దూకడంతో ట్రాక్టర్ వెనుక చక్రాల కింద పడి తలకు బలమైన గాయం కావడంతో తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, వైద్యులు మృతి చెందినట్లు ధ్రువీకరించారు.

News March 2, 2025

ఖమ్మం: 20లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు: తుమ్మల

image

ఆయిల్‌పామ్ రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుభవార్త చెప్పారు. ప్రస్తుత సీజన్లో టన్ను గెల రూ.20,871 చేరినట్లు ప్రకటించారు. దీంతో ఈ సాగు చేసే రైతులు మంచి లాభాలు ఆర్జించనున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర అవసరాలకు సరిపడా ఆయిల్‌పామ్ ఉత్పత్తి లేకపోవడంతో మలేసియా నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దీనికి చెక్ పెట్టేలా, సుమారు 20 లక్షల ఎకరాల్లో ప్రభుత్వం ఆయిల్‌పామ్ సాగు చేయిస్తోంది.

News March 2, 2025

ఖమ్మం జిల్లాలో TODAY HEADLINES

image

∆} ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల పర్యటన ∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ సమీక్ష ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} మధిర మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} వైరాలో ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ పర్యటన ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు ∆} ఖమ్మం మారెమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} నాచేపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరం.

News March 2, 2025

ఖమ్మం జిల్లాకు కొత్త అధికారి

image

ఖమ్మం జిల్లా ఎన్పీడీసీఎల్ పర్యవేక్షణ ఇంజినీర్ ఈ.శ్రీనివాసాచారి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఎస్ఈగా పనిచేస్తున్న సురేందర్‌ను వరంగల్ కార్పొరేషన్ కార్యాలయానికి బదిలీ చేశారు. శ్రీనివాసాచారి గతంలో ఖమ్మం జిల్లా వివిధ హోదాల్లో పనిచేశారు. ఖమ్మం ఎస్సీ కార్యాలయంలో శ్రీనివాసాచారి ఎస్ఈగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఈకి అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

News March 2, 2025

ఖమ్మం: ‘పెండింగ్ LRS దరఖాస్తులను పరిష్కరించాలి’

image

ప్రణాళికాబద్ధంగా పెండింగ్ ఎల్.ఆర్.ఎస్. దరఖాస్తులను మార్చి నెలాఖరులోగా స్క్రూటినీ పూర్తి చేసి పరిష్కరించేలా చూడాలని అదనపు కలెక్టర్ డా.పి. శ్రీజ, పి.శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా పి. శ్రీజ కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఎల్.ఆర్.ఎస్. పై సంబంధిత అధికారులతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు.

error: Content is protected !!