India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఖమ్మం జిల్లా చెట్టంత గొప్ప మనిషిని కోల్పోయింది. పర్యావరణ పరిరక్షణ కోసం పద్మశ్రీ వనజీవి రామయ్య చేసిన కృషి వెలకట్టలేనిది. దాదాపు కోటిన్నర మొక్కలు నాటారు రామయ్య-జానకమ్మ దంపతులు. ఆయన పర్యావరణ సేవలకు గాను 3వేల ప్రభుత్వ, ప్రైవేటు అవార్డులు వరించాయి. ఆయన మృతిపై దేశవ్యాప్తంగా ప్రముఖులు విచారం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. వనజీవి రామయ్యకు నివాళి అంటే కచ్చితంగా ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటడమే.. ఏమంటారు?..
రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. నేలకొండపల్లి మండల కేంద్రంలోని డిగ్రీ కళాశాల సమీపంలో హైవేపై ఆగి ఉన్న ట్రాక్టర్ ట్రాలీని బైక్ ఢీకొనడంతో బైక్పై ఉన్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
ఖమ్మం జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. చికెన్ (విత్ స్కిన్) కేజీ రూ.220 ఉండగా, స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.250 ధర పలుకుతుంది. అలాగే లైవ్ కోడి రూ.160- 170 మధ్య ఉంది. కాగా బడ్ ఫ్లూ ఎఫెక్ట్తో గత నెల క్రితం భారీగా అమ్మకాలు పడిపోగా.. ప్రస్తుతం అమ్మకాలతో పాటు ధర సైతం పెరిగిందని నిర్వాహకులు చెబుతున్నారు. మరి మీ ప్రాంతంలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయి?..
పద్మశ్రీ వనజీవి రామయ్య అంత్యక్రియలు ఆదివారం అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి. అంత్యక్రియలు ఆయన స్వగ్రామం ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లిలోని శ్మశానవాటికలో జరగనున్నాయి. అంతిమయాత్రకు జిల్లాలోని మంత్రులు, అధికారులతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి పర్యావరణ ప్రేమికులు పెద్దఎత్తున తరలిరానున్నారు.
ఆకాల వర్షాలు, ఈదురు గాలుల కారణంగా పంట నష్టాలను ఎదుర్కొన్న రైతులకు ఎకరానికి రూ.10వేల చొప్పున పరిహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మొత్తాన్ని రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయించనున్నట్లు సమాచారం. గత నెలలో 8,408 ఎకరాల్లో పంట నష్టం సంభవించినట్లు వ్యవసాయ శాఖ నివేదికలు వెల్లడించారు. నష్టపోయిన రైతుల వివరాలను సర్వే చేసి నివేదిక సిద్ధం చేయాలని అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు.
1) ఖమ్మం: నేడు పద్మశ్రీ వనజీవి రామయ్య అంత్యక్రియలు 2) మధిరలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన 3) వల్లభిలో అంబేద్కర్ విగ్రహావిష్కరించనున్న మందకృష్ణ మాదిగ 4) కూసుమంచిలో మంత్రి పొంగులేటి పర్యటన 5) ఏన్కూరు వ్యవసాయ మార్కెట్కు సెలవు 6) ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం 7) ఖమ్మం జిల్లాలో ఎంపీ రఘురాం రెడ్డి పర్యటన 8) బేతుపల్లి అంకమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు.
ఖమ్మం జిల్లాలో శనివారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా ముదిగొండ మండలం బాణాపురంలో 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అటు ఎర్రుపాలెంలో 43.2, ఖమ్మం(U) ఖానాపురం PS, ఖమ్మం(R) పల్లెగూడెం, వైరాలో 43.0, మధిరలో 42.9, బచ్చోడులో (తిరుమలాయపాలెం) 42.6, తల్లాడలో 42.5, ఏన్కూరులో 42.1, కొణిజర్ల 42.0, రఘునాథపాలెం 41.5, కల్లూరు, పెనుబల్లిలో 39.9 నమోదైంది.
KMM: ప్రకృతి ప్రేమికుడిగా పేరుగాంచిన పద్మశ్రీ వనజీవి రామయ్య తుది శ్వాస విడిచారు. కాగా వనజీవి రామయ్యను ప్రకృతి తల్లి.. తన ఒడిలో చేర్చుకుంటున్న ఫొటో ఇప్పుడు వైరల్ అవుతుంది. కోటికి పైగా మొక్కలు నాటి అలసిపోయిన తన బిడ్డను తల్లి అక్కున చేర్చుకునే విధంగా ఉన్న ఈ ఫొటో.. ప్రతి ఒక్కరిని కలిచివేస్తుంది. రామయ్య సాధారణ వ్యక్తిగా జన్మించి ప్రకృతి ప్రేమికుడిగా చరిత్రలో నిలిచారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా TGSRTC డిప్యూటీ రీజినల్ మేనేజర్ మల్లయ్య శనివారం మధిర డిపోను తనిఖీ చేశారు. డిపోలో ఉన్న బస్సుల మెయింటెనెన్స్ విభాగంలో మెకానిక్స్, ఆపరేషన్స్ విభాగంలో డ్రైవర్స్, కండక్టర్లతో మాట్లాడారు. తీవ్ర ఉష్ణోగ్రతలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మధిర డిపోలో పనిచేస్తున్న సిబ్బందికి మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో DM శంకర్ రావు, ట్రాఫిక్&గ్యారేజ్ ఇన్ఛార్జిలు పాల్గొన్నారు.
రెండేళ్ల క్రితం తన ఇంటి ఎదుట బైక్పై రోడ్డు దాటుతుండగా రోడ్డు ప్రమాదం చేసిన వ్యక్తికి రామయ్య అరుదైన శిక్ష విధించారు. ప్రమాదం చేసిన వ్యక్తిపై కేసు నమోదుకు నిరాకరించడంతోపాటు బదులుగా 100 మొక్కలు నాటాలని అతనికి సూచించారు. రోడ్డు ప్రమాదం చేసిన వ్యక్తిని క్షమించి మొక్కలు నాటమని కోరడంతో పోలీసులు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీన్ని బట్టి చూస్తే రామయ్యకు పర్యావరణం అంటే ఎంత ప్రేమో అర్థం చేసుకోవచ్చు.
Sorry, no posts matched your criteria.