India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లికి చెందిన వనజీవి రామయ్య తన 15వ ఏట కొణిజర్ల(M) తుమ్మలపల్లికి చెందిన జనమ్మను వివాహమాడారు. వీరికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మొదటి కుమారుడు సైదులు ఏడాది క్రితం గుండెపోటుతో మరణించగా, 2వ కుమారుడు సత్యనారాయణ అనారోగ్యంతో మరణించారు. చిన్న కుమారుడు కనకయ్య రెడ్డిపల్లిలోనే దుకాణం నిర్వహిస్తున్నారు.
ఖమ్మం రూరల్ రెడ్డిపల్లిలో రేపు వనజీవి రామయ్య అంత్యక్రియలు జరగనున్నట్లు తెలుస్తుంది. కాగా వనజీవి రామయ్యకి నివాళులు అర్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం రానున్నారని విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే వనజీవి రామయ్య మృతిపై సీఎం రేవంత్ రెడ్డి జిల్లా మంత్రులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనపై మరికొద్ది గంటల్లో స్పష్టత రానుంది.
చెట్లనే ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి వనజీవి రామయ్య మరణం ధరిత్రికి తీరని లోటని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వనజీవి రామయ్య మృతి పట్ల మంత్రి తుమ్మల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోటికి పైగా మొక్కలు నాటి, పద్మశ్రీ అవార్డు దక్కించుకున్న రామయ్య ఖమ్మం జిల్లా ఖ్యాతిని ఖండాంతరాలకు చాటారని మంత్రి తుమ్మల గుర్తు చేసుకున్నారు.
<<16071045>>వనజీవి రామయ్య<<>> అసలు పేరు దరిపల్లి రామయ్య. కోటి మొక్కలకు పైగా నాటడంతో వనజీవి రామయ్యగా మారిపోయారు. 50 ఏళ్లుగా విత్తనాలు చల్లుతూ మొక్కలు పెంచుతూ ఆయన ఎందరికో ఆదర్శంగా మారారు. అయితే ఆయనకు అరుదైన గౌరవం దక్కింది. వనజీవి గురించి పిల్లలకు తెలియాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆయన జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చింది. తెలంగాణ ప్రభుత్వం కూడా వనజీవి గురించి పిల్లలకు బోధిస్తోంది.
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సెలవు ∆} ఖమ్మంలో మంత్రి పొంగులేటి పర్యటన ∆} ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం ∆} వైరాలో ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ పర్యటన ∆} కల్లూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం
ఇంటి పేరునే వనజీవిగా మార్చుకున్న రామయ్య <<16071045>>మృతితో<<>> పర్యావరణ ప్రేమికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆయన ఇప్పటి వరకు కోటికి పైగా మొక్కలు నాటారు. అతని సేవలను గుర్తించిన కేంద్రం పద్మశ్రీతో సత్కరించింది. మొక్కలపై ఉన్న ప్రేమతో తన మనవరాళ్లకు కూడా వాటి పేర్లే పెట్టడం మరో ఆసక్తికర విషయం . వారికి చందనపుష్ప, హరిత లావణ్య. కబందపుష్ప అని పేర్లు పెట్టాడు. మరో మనవరాలికి వనశ్రీ అని నామకరణం చేశారు.
ఖమ్మం జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. శుక్రవారం అత్యధికంగా ఖమ్మం (రూ) పల్లెగూడెంలో 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అటు నేలకొండపల్లి, ఖమ్మం(U) ఖానాపురం PSలో 41.0, మధిర, ముదిగొండ, చింతకాని 40.9, రఘునాథపాలెంలో 40.7, వైరా, కొణిజర్లలో 40.3, లింగాల (కామేపల్లి), కాకరవాయి (తిరుమలాయపాలెం) 40.0, తల్లాడలో 39.7, సత్తుపల్లిలో 38.7, ఏన్కూరులో 38.6 నమోదైంది.
2025-26 నియామక సంవత్సరానికి అగ్నివీర్ ఎంపిక పరీక్ష కోసం జిల్లాలోని నిరుద్యోగ అవివాహిత యువకులు ఈనెల 25లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఉపాధి అధికారి మాధవి ఓ ప్రకటనలో తెలిపారు. మెరిట్ ప్రకారం ఎంపిక ఉంటుందని చెప్పారు. అభ్యర్థులు www.joinindianarmy.nic.in ను సందర్శించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 040-27740205కు సంప్రదించాలని పేర్కొన్నారు.
రైతన్నలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, చెడు అలవాట్లను మానుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శుక్రవారం ఖమ్మం రూరల్ (మం) కాచిరాజుగూడెంలో ఆంధ్రా బ్యాంక్ కర్షక సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో రైతులకు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖ రైతుల కోసం మాత్రమే ఉందని, రైతుల కష్టాలను తొలగింపుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
☆ సెక్టర్ ఆఫీసర్లు బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలి: ఖమ్మం సీపీ ☆ జిల్లాలో 25 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం: అ.కలెక్టర్ ☆ KMM: వాకింగ్ వెళ్తుండగా ప్రమాదం.. వృద్ధుడి మృతి ☆ జిల్లా వ్యాప్తంగా ఘనంగా ఫులే జయంతి ☆ రైస్ మిల్లర్లకు ముదిగొండ తహశీల్దార్ వార్నింగ్ ☆ ఖమ్మం: 20 మందికి రూ.10.7 లక్షల చెక్కులు పంపిణీ ☆ NKP: రైతుల కన్నీటి పర్యంతం (VIDEO) ☆ KMM: 5రోజుల పోరాటం.. అయినా దక్కని ప్రాణం.
Sorry, no posts matched your criteria.