India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
∆} ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల పర్యటన ∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ సమీక్ష ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} మధిర మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} వైరాలో ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ పర్యటన ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సెలవు ∆} ఖమ్మం మారెమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} నాచేపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరం.
ఖమ్మం జిల్లా ఎన్పీడీసీఎల్ పర్యవేక్షణ ఇంజినీర్ ఈ.శ్రీనివాసాచారి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఎస్ఈగా పనిచేస్తున్న సురేందర్ను వరంగల్ కార్పొరేషన్ కార్యాలయానికి బదిలీ చేశారు. శ్రీనివాసాచారి గతంలో ఖమ్మం జిల్లా వివిధ హోదాల్లో పనిచేశారు. ఖమ్మం ఎస్సీ కార్యాలయంలో శ్రీనివాసాచారి ఎస్ఈగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఈకి అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.
ప్రణాళికాబద్ధంగా పెండింగ్ ఎల్.ఆర్.ఎస్. దరఖాస్తులను మార్చి నెలాఖరులోగా స్క్రూటినీ పూర్తి చేసి పరిష్కరించేలా చూడాలని అదనపు కలెక్టర్ డా.పి. శ్రీజ, పి.శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా పి. శ్రీజ కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఎల్.ఆర్.ఎస్. పై సంబంధిత అధికారులతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు.
వారిద్దరు గురు శిష్యులు. మళ్లీ ఇద్దరి పేరూ ఒక్కటే. ఒకరినొకరు ఏడాదిగా కలుసుకున్నది లేదు. కానీ వాళ్లు పలకరించుకునేందుకు సందర్భంగా మారిన ఘటన శనివారం సత్తుపల్లి పట్టణంలో చోటుచేసుకుంది. అయితే వారిలో ఒకరు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే.. మరొకరు అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు. సీనియర్ నేత గాదె సత్యనారాయణ అంత్యక్రియలకు హాజరైన సందర్భంలో చిత్రమిది.
టాటా అల్ట్రా మారథాన్ 50 కిలోమీటర్ల రన్లో మెడల్ సాధించిన కానిస్టేబుల్ను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ శనివారం అభినందించారు. రాష్ట్రం, దేశంలో ఎక్కడ మారథాన్ నిర్వహించినా పాల్గొంటూ ప్రతిభ కనబరిచి పతకాలు సాధిస్తున్నట్లు ఖమ్మం ఏఆర్ కానిస్టేబుల్ పిల్లి రాజు తెలిపారు. గత నెల 23న పూణె సమీపంలోని లోనావాలా సయ్యాద్రి కొండలల్లో మారథాన్ రన్ 50 కిలోమీటర్లను 6గంటల 39 నిమిషాల్లో పూర్తి చేశారని చెప్పారు.
ఖమ్మం జిల్లాలోని ప్రతి దివ్యాంగుడికి యూనిక్ డిజేబిలిటీ ఐడీ నంబర్ జనరేట్ చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా.పి.శ్రీజ అన్నారు. మార్చి 1 నుంచి సదరం సర్టిఫికెట్ విధానాన్ని రద్దు చేసి, యూడీ ఐడీ. కార్డులు జారీ చేయనున్నారు. నూతన దివ్యాంగులు మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, సదరం ఉన్నవారికి డీఆర్డీవోల ద్వారా యూడీ ఐడీ కార్డు జారీ చేయాలని సూచించారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఉపయోగపడుతోందని తెలిపారు.
పురుగు మందు తాగి మరో రైతు బలవన్మరణానికి యత్నించిన ఘటన కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. ముత్తాపురం గ్రామానికి చెందిన పూసం నారాయణ తన పత్తి చేను వద్ద పురుగు మందు తాగి ఇంటికి వచ్చాడు. నోటి నుంచి నురుగు రావడంతో గమనించిన కుటుంబ సభ్యులు అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ రాష్ట్ర బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఖమ్మం జిల్లా 4వ మహాసభలు శనివారం ఖమ్మం నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ మహాసభలకు ముఖ్యఅతిథిగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. సంఘం జెండా ఆవిష్కరణ అనంతరం జరిగిన మహాసభలో వారు మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మికుల కోసం ఎన్నో పోరాటాలు చేసి తెచ్చిన సంక్షేమ బోర్డును ఈ ప్రభుత్వం ఎత్తివేయాలనే కుట్ర పన్నుతుందని ఆరోపించారు.
మార్చి 31లోపు పెండింగ్ LRS దరఖాస్తుల స్క్రూటినీ పూర్తి చేయాలని ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్లు డా.పి.శ్రీజ, పి.శ్రీనివాస్ రెడ్డి అధికారులకు ఈరోజు ఆదేశించారు. టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, నీటి పారుదల శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్రతి మండలంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని, భూ క్రమబద్ధీకరణలో అవకతవకలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
బాడీ పార్ట్స్ తాకనిస్తేనే ఇంటర్నల్ మార్కులు వేస్తానని ఇంటర్ విద్యార్థులను ఓ కాంట్రాక్ట్ లెక్చరర్ వేధించిన ఘటన ఖమ్మం నగరంలో జరిగింది. విద్యార్థులు తెలిపి వివరాలు.. ఖమ్మం వాసి కొండా హరిశంకర్ అనే వ్యక్తి స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో కాంట్రాక్ట్ లెక్చరర్గా పనిచేస్తున్నాడు. కొద్ది రోజులుగా విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని విద్యార్థి సంఘం నాయకులు ఈరోజు ధర్నా చేపట్టారు.
Sorry, no posts matched your criteria.