Khammam

News March 1, 2025

ఖమ్మం: వేసవి జాగ్రత్తల పట్ల ప్రజలకు వైద్య శాఖ సూచనలు

image

ఖమ్మం: సీజన్ మారే సమయంలో జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి వంటి వ్యాధులు పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ ఎడ్యుకేటర్ అన్వర్ సూచించారు. వేడి గాలుల ప్రభావంతో వడదెబ్బ, అలసట, వికారం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నందున ఉదయం 11 గంటల తర్వాత బయటకు వెళ్లకుండా గోరువెచ్చని నీరు, తేలికపాటి ఆహారం తీసుకోవాలని తెలిపారు.  

News February 28, 2025

ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్యంశాలు

image

> ఖమ్మం:ఉద్యోగ విరమణ పొందిన పోలీసులకు సీపీ సన్మానం> సత్తుపల్లి: కార్యకర్తలపై ఎమ్మెల్యే అసహనం> ఖమ్మం: రూ.3 లక్షల మిర్చి పంట చోరీ> బోనకల్: 2 కార్లు డీ.. ఇద్దరికి గాయాలు> ముదిగొండ: బిల్డింగ్ పై నుంచి పడి కార్మికుడి మృతి> తిరుమలాయపాలెం:యువతిని మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు >సత్తుపల్లి: మంత్రి తుమ్మల అనుచరుడు గాదె సత్యం మృతి

News February 28, 2025

మంత్రి తుమ్మల అనుచరుడు గాదె సత్యం మృతి

image

సత్తుపల్లి మాజీ జడ్పీటీసీ సభ్యులు, సీనియర్ రాజకీయ నాయకులు గాదె సత్యనారాయణ (76) ఊపిరితిత్తుల వ్యాధితో శుక్రవారం హైదరాబాదులో చికిత్స పొందుతూ మృతి చెందారు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడిగా మూడున్నర దశాబ్దాల పాటు రాజకీయాలలో సేవలందించారు. ఆయన మృతిపట్ల మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే డా. రాగమయి దయానంద్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఆయా పార్టీల నాయకులు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

News February 28, 2025

భద్రాచలం గోదావరిలో ఇద్దరు యువకులు మృతి

image

భద్రాచలం గోదావరిలో స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. అయితే గల్లంతయిన ఇద్దరు యువకులు మృతి చెందారు. వారి మృతదేహాలను గజఈతగాళ్లు వెలికి తీశారు. మృతులు పవన్(20), హరి ప్రసాద్‌(18) గా పోలీసులు గుర్తించారు. ఈఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News February 28, 2025

ఖమ్మం: బర్డ్ ఫ్లూ భయం.. చికెన్ షాపులు వెలవెల!

image

బర్డ్ ఫ్లూ వైరస్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చికెన్ షాపుల నిర్వాహకులపై గుదిబండలా మారింది. కేజీ ధర రూ. 180 ఉన్నా వైరస్ భయంతో చికెన్ కొనుగోళ్లకు మొగ్గు చూపడం లేదు. ప్రత్యామ్నాయంగా మటన్, చేపలకు డిమాండ్ పెరిగింది. రూ. 800 ఉన్న మటన్ రూ. 1000, చేపలు రకాన్ని బట్టి కేజీకి రూ. 50-100 ఎక్కువ పెంచేస్తున్నారు. ధరల పెరుగుదలతో మాంసం ప్రియులు నోటికి తాళం వేస్తున్నారు.

News February 28, 2025

ఖమ్మం: బర్డ్ ఫ్లూ భయం.. చికెన్ షాపులు వెలవెల!

image

బర్డ్ ఫ్లూ వైరస్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చికెన్ షాపుల నిర్వాహకులపై గుదిబండలా మారింది. కేజీ ధర రూ. 180 ఉన్నా వైరస్ భయంతో చికెన్ కొనుగోళ్లకు మొగ్గు చూపడం లేదు. ప్రత్యామ్నాయంగా మటన్, చేపలకు డిమాండ్ పెరిగింది. రూ. 800 ఉన్న మటన్ రూ. 100, చేపలు రకాన్ని బట్టి కేజీకి రూ. 50-100 ఎక్కువ పెంచేస్తున్నారు. ధరల పెరుగుదలతో మాంసం ప్రియులు నోటికి తాళం వేస్తున్నారు.

News February 28, 2025

ఖమ్మం: ‘64 అక్రమ రిజిస్ట్రేషన్లు.. 9 మందిపై కేసు’

image

అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడిన 9 మందిపై కేసు నమోదు చేశామని ఖమ్మం జిల్లా కొనిజర్ల ఎస్ఐ సూరజ్ తెలిపారు. ఎస్ఐ వివరాలిలా.. ‘మండల పరిధిలోని ఓ వెంచర్‌లో గత డిసెంబర్ నెలలో వైరా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఒకే రోజు 64 రిజిస్ట్రేషన్లు అక్రమంగా జరిగాయి. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డికి ఫిర్యాదు చేయగా, సీఎంవో విచారణకు ఆదేశించింది. దీంతో 9 మందిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

News February 28, 2025

యువతిని హతమార్చిన కేసులో యువకుడికి జీవిత ఖైదు

image

యువతి హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.10వేల జరిమానా విధిస్తూ 6వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి మారగాని శ్రీనివాస్ తీర్పు ఇచ్చారు. 2020లో సత్తుపల్లికి చెందిన బోల్లేడు నితిన్ పెనుబల్లి మండలం కుప్పెనకుంట్లకు చెందిన ఓ యువతిని ప్రేమ పేరుతో లంకపల్లి గుట్టల్లోకి తీసుకెళ్లి హతమార్చాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారించిన కోర్టు పైవిధంగా శిక్ష విధిస్తూ  తీర్పు ఇచ్చారు.

News February 28, 2025

శివయ్య పూజల్లో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

image

ఖమ్మం జిల్లా కలెక్టర్‌ కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ గురువారం తీర్థాల సంగమేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివయ్య దర్శనానంతరం భక్తులతో మాట్లాడారు. జాతర సందర్భంగా చేసిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేశామన్నారు.

News February 27, 2025

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 93% పోలింగ్ నమోదు

image

ఖమ్మం జిల్లాలో MLC ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు 93% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఖమ్మం జిల్లాలో 4089 ఓటర్లు ఉండగా 3805 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

error: Content is protected !!