Khammam

News August 7, 2025

ఖమ్మం: అథ్లెటిక్స్‌లో రాణించిన విద్యార్థులకు అభినందన

image

ఈ నెల 3, 4న హనుమకొండలో జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఖమ్మం జిల్లాకు చెందిన క్రీడాకారులు 45 పతకాలు సాధించారు. వీరిలో 23 బంగారు, 11 రజత, 11 కాంస్య పతకాలు ఉన్నాయి. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి బుధవారం విజేతలను అభినందించారు. కోచ్ ఎండి గౌస్‌ను ప్రత్యేకంగా సన్మానించారు. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని, ఒలింపిక్స్‌లో కూడా పాల్గొని జిల్లా పేరు నిలబెట్టాలన్నారు

News August 7, 2025

ఆ ఇద్దరిపై PD యాక్టు కొనసాగింపు: ఖమ్మం సీపీ

image

ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న రౌడీ షీటర్ పేరెల్లి ప్రవీణ్, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న పగడాల విజయ్‌పై 12 నెలల పాటు పీడీ యాక్ట్ కొనసాగిస్తున్నట్లు ఖమ్మం సీపీ సునీల్ దత్ తెలిపారు. నిందితులు భూకబ్జాలు, బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు డిమాండ్ వంటి వరుస నేరాలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేయడంతో చర్యలు తీసుకున్నామన్నారు. ఖానాపురం సీఐ భానుప్రసాద్ ఆధ్వర్యంలో నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించారు.

News August 7, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష
∆} పెనుబల్లి రాజసాయి మందిరంలో ప్రత్యేక పూజలు
∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} ఖమ్మం జిల్లాలో చేనేత దినోత్సవ వేడుకలు
∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} ఖమ్మం నగరంలో BRTU సంఘీభావ ర్యాలీ
∆} ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో సదరం క్యాంప్
∆} వైరా పర్ణశాలలో ప్రత్యేక పూజలు.

News August 7, 2025

ఫోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

image

ఆరేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.50 వేలు జరిమానా విధిస్తూ ఖమ్మం మొదటి అదనపు జిల్లా జడ్జి ఉమాదేవి తీర్పునిచ్చారు. సీఐ సాగర్ వివరాలిలా.. వైరా (M) గొల్లనపాడులో 2024లో లాలయ్య(70) ఆరేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో పోక్సో కేసు నమోదు చేశారు. బుధవారం నిందితుడిని కోర్టులో హాజరుపరిచాగా పై విధంగా తీర్పు వచ్చింది.

News August 7, 2025

నేడు కలెక్టరేట్‌లో టెస్కో స్టాల్ ఏర్పాటు

image

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేడు ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయంలో టెస్కో స్టాల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చేనేత డివిజనల్ మార్కెటింగ్ మేనేజర్ బొట్టు వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ విక్రయాల్లో అన్ని రకాల వస్త్రాలపై 30 శాతం, రాజ్కోట్ ఇక్కత్ సిల్క్ చీరలపై 40 శాతం, ఎంపిక చేసిన వస్త్రాలపై 50 శాతం ప్రత్యేక తగ్గింపు ఉంటుందని తెలిపారు. చేనేత పరిశ్రమను ప్రోత్సహించాలని ఆయన కోరారు.

News August 6, 2025

క్రూడ్ పామాయిల్ పై దిగుమతి సుంకాన్ని 44%కు పెంచాలి: తుమ్మల

image

క్రూడ్ పామాయిల్ పై దిగుమతి సుంకాన్ని 44 శాతానికి పెంచాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్‌ను కోరారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, నిర్మల సీతారామన్‌ను కలిసి పలు సమస్యలను వివరించారు. ఏప్రిల్ నుంచి జులై వరకు ఏర్పడిన లోటు యూరియాను ఈ నెల ఆగస్టు కేటాయింపులతో కలిపి వెంటనే సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు.

News August 6, 2025

ATC కోర్సులతో ఉపాధి భరోసా: కలెక్టర్

image

యువతకు ATC కోర్సులతో ఉద్యోగాలకు భరోసా లభిస్తుందని, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. బుధవారం ఖమ్మం టేకులపల్లిలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థను అప్ గ్రేడ్ చేసిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్‌ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మారుతున్న కాలంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు నిష్ణాతులైన ట్రైనర్ల పర్యవేక్షణలో శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు.

News August 6, 2025

‘ఇందిరమ్మ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు’

image

జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. అయితే లబ్దిదారులకు నిర్మాణ సామాగ్రి వ్యయం భారం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం మండల నిర్మిత కేంద్రాలను తిరిగి ప్రారంభించింది. వీటి ద్వారా ఫ్లైయాష్ బ్రిక్స్‌ను సరసమైన ధరకే అందించనుంది. తద్వారా లబ్దిదారులకు ఆర్థిక భారం కాకుండా తోడ్పాటు నందించనుంది. కాగా ఇప్పటికే చింతకానిలో విఘ్నేశ్వర ఫ్లైయాష్ బ్రిక్ యూనిట్‌ కేంద్రం ప్రారంభమైంది.

News August 6, 2025

పథకాలు సాధిస్తూ అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి: జిల్లా కలెక్టర్

image

హన్మకొండలో జరిగిన రాష్ట్రస్థాయి జూనియర్ సీనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో గెలుపొందిన విజేతలను జిల్లా కలెక్టర్ అనుదీప్ అభినందించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌కు వచ్చిన క్రీడాకారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. క్రీడాకారులు భవిష్యత్తులో జాతీయ స్థాయిలో అనేక పథకాలు సాధిస్తూ అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని, ఒలింపిక్స్ పోటీలలో పాల్గొని పథకాలు సాధించి దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలన్నారు.

News August 6, 2025

ఖమ్మం: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

గ్రూప్స్, RRB, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తదితర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న మైనార్టీ అభ్యర్థులకు రాష్ట్ర మైనార్టీ స్టడీ సర్కిల్ ద్వారా 4 నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఆసక్తి ఉన్న ముస్లిం, క్రిస్టియన్, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీ అభ్యర్థులు ఈనెల 21లోగా దరఖాస్తు చేసుకోవాలని ఖమ్మం జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి బి.పురంధర్ తెలిపారు. దరఖాస్తులను కలెక్టరేట్లోని తమ కార్యాలయంలో సమర్పించాలన్నారు.