India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లిక్కర్ విక్రయాలు పడిపోతున్నాయి. గత ఏడాది ఫిబ్రవరిలో రూ. 75 కోట్ల అమ్మకాలు జరగగా, ప్రస్తుత ఫిబ్రవరిలో రూ.65 కోట్ల సేల్స్ జరిగాయి. ఏపీలో కొత్త మద్యం పాలసీ రావడంతో సత్తుపల్లి, మధిర, వైరా, ఖమ్మం, అశ్వారావుపేట ఎక్సైజ్ సర్కిళ్లలో ప్రభావం పడింది. పెరిగిన బీర్ల ధరలతో అమ్మకాలు మరింత క్షీణించవచ్చనే అభిప్రాయాలున్నాయి.
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో 24 గంటలపాటు సైలెన్స్ పీరియడ్ అమలులో ఉంటుందని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. ఈ సమయంలో సభలు, సమావేశాలు, రాజకీయ పరమైన సంక్షిప్త సందేశాలు పంపడంపై నిషేధం విధించినట్లు చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చే సందేశాలను నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
∆} ఖమ్మం జిల్లాలో నేడు ఎమ్మెల్సీ ఎన్నికలు ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సెలవు ∆} మధిర నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన ∆} ఖమ్మం జిల్లాలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పర్యటన ∆} వైరా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} ఖమ్మం నగరంలో ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి పర్యటన ∆} ఏన్కూర్ వ్యవసాయ మార్కెట్ మార్కెట్కు సెలవు ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద పర్యటన.
నేడు జరగనున్న NLG, KMM, WGL టీచర్ MLC ఎన్నికల పోలింగ్కు ఖమ్మం, భద్రాద్రి జిల్లాల అధికార యంత్రాంగం సన్నద్ధమయ్యాయి. 6,111 మంది ఓటర్లకు 47 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా BNS యాక్ట్ అమలు చేస్తున్నారు. భద్రతా రీత్యా సమస్యలు ఉంటే 100కు ఫోన్ చేయాలని పోలీసులు సూచించారు. బరిలో 19 మంది ఉండగా.. ఎవరు విజేతగా నిలుస్తారో మార్చి 3వ తేదీ వరకు వేచి ఉండాల్సిందే.
సత్తుపల్లి కిష్టారం గ్రామంలో నిర్మించిన సైలో బంకర్ కారణంగా రెండేళ్ల మెయింటినెన్స్ పూర్తికాక ముందే గ్రామ ప్రజలు తీవ్ర అనారోగ్య కారణాలతో ఇబ్బందులు బాధపడుతున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి వివరించారు. అనంతరం అంబేద్కర్ నగర్ వాసుల ఇబ్బందులపై వినతిపత్రం అందించారు. భారీ బంకర్ నాణ్యత లోపించడంతో పగుళ్లు వచ్చాయని విచారణ చేయాలని కోరినట్లు ఆయన తెలిపారు.
రాత్రి పడుకునే ముందు ఇంటి ముందు పెట్టిన బైక్.. మరునాడు తెల్లవారుజామున గ్రామ శివారులో గుర్తు తెలియని దుండగులు దగ్ధం చేసిన ఘటన తిరుమాలయపాలెం మండలం బచ్చోడులో జరిగింది. పోలీసుల వివరాలిలా.. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఉల్లేపల్లికి చెందిన నవిల యాకస్వామి తన అమ్మమ్మ ఊరు బచ్చోడకు వచ్చాడు. మరునాడు ఉదయం బైక్ కాల్చివేసినట్లు ఫిర్యాదు చేయడంతో తిరుమలాయపాలెం ఎస్సై జగదీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
> జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి ఉత్సవాలు
> చింతకాని మండలం నేరడలో రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి కబడ్డీ పోటీలు
> ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎంపీ రామ సహాయం రఘురాంరెడ్డి పర్యటన
> వైరా మండలం స్నానాల లక్ష్మీపురానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాక
> కల్లూరులో సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పర్యటన
> ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు సెలవు
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చేగొమ్మ క్రాస్ రోడ్ వద్ద పోలీసులు భారీ ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సుమారు 90 లక్షల విలువైన 179 కేజీల గంజాయితో పాటు 41 గ్రాముల బంగారం కారులో తరలిస్తుండగా వాహన తనిఖీల్లో పట్టుబడింది. గంజాయిని తరలిస్తున్న కారు స్వాధీనం చేసుకొని ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు ఖమ్మం డీసీపీ ప్రసాదరావు తెలిపారు.
ఖమ్మం: తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువును మార్చి 10 వరకు పొడిగించామని జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన విద్యార్థులు http://telanganams.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఓసి విద్యార్థులకు రూ.200, ఎస్సీ, ఎస్టీ, బిసి, పిహెచ్సి, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు రూ.125 ఫీజు నిర్ధారించామని పేర్కొన్నారు.
ఖమ్మం జిల్లాలో LRS (లేఅవుట్ రెగ్యులరైజేషన్) దరఖాస్తులను మార్చి 31లోపు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మంగళవారం అధికారులను ఆదేశించారు. టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, నీటిపారుదల శాఖల సమన్వయంతో 14 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, పెండింగ్ దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని సూచించారు. ప్రభుత్వ భూములు, కోర్టు కేసులు, బఫర్ జోన్ సమస్యలు లేని దరఖాస్తులను తక్షణమే ఆమోదించాలన్నారు.
Sorry, no posts matched your criteria.