India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో మంగళవారం బీసీ మహాధర్నాకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా రాష్ట్ర గిడ్డంగుల సంస్థ రాయల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్రం తక్షణమే ఆమోదించి చట్టంగా రూపొందించాలని డిమాండ్ చేశారు. బీసీల పట్ల కేంద్రం మొండి వైఖరి ప్రదర్శిస్తుందన్నారు.

ఖమ్మం జిల్లాలో అవసరమైన మేర నులిపురుగుల నివారణ మాత్రలను అందుబాటులో ఉన్నాయని DMHO డా. కళావతిబాయి తెలిపారు. 1339 మంది ఆశావర్కర్లు, 1750 అంగన్వాడీ టీచర్లు, 1260 వైద్య సిబ్బంది, 1618 పాఠశాల జూనియర్ కళాశాలల ప్రతినిధులు నులి పురుగుల నివారణ కార్యక్రమంలో పాల్గోంటున్నారని చెప్పారు. ఆగస్టు 11న నులి పురుగుల నివారణ మందులు వేయాలని, ఆగస్టు 11న వేయని వారికి ఆగస్టు 18న మాప్ అప్ డే సందర్భంగా వేయాలన్నారు.

∆} తిరుమలయపాలెంలో మంత్రి పొంగులేటి పర్యటన
∆} వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన
∆} నేలకొండపల్లి రైతు వేదికలో రైతులకు అవగాహన కార్యక్రమం
∆} వైరా పర్ణశాలలో ప్రత్యేక పూజలు
∆} బోనకల్ మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
∆} ఖమ్మం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక ప్రజలు

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డితో కలిసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ప్రతి శాఖ నుంచి ప్రశంసాపత్రాల పంపిణీ కోసం నిర్దిష్టమైన సంఖ్యలో మాత్రమే దరఖాస్తులు రావాలని సూచించారు. ప్రశంసా పత్రాలు నిజంగా పనిచేసే సిబ్బందికి దక్కేలా చూడాలన్నారు.

నులి పురుగుల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నులి పురుగుల నివారణకు చేపట్టే అల్బెండజోల్ మందుల పంపిణీ కార్యక్రమంపై జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఆగస్టు 11న జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం పురస్కరించుకొని జిల్లాలో 19 సం.రాల వయస్సు లోపు ఉన్న పిల్లలందరికి తప్పనిసరిగా మాత్రలు అందించాలన్నారు.

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరెట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. జిల్లాలో ఈ-ఆఫీస్ ద్వారా ఆన్ లైన్లో ఫైల్ మూమెంట్ జరగాలని అధికారులకు సూచించారు. అటు మంత్రుల పర్యటనకు జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు.

ఖమ్మం: రోడ్డు ప్రమాదాలను అరికట్టే దిశగా మరింత పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. సోమవారం సీపీ వీడియో కాన్ఫరెన్స్లో పోలీస్ అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. నేరాలు నియంత్రణ, చోరీ సొత్తు రికవరీల్లో వేగం మరింత పెంచాలని, ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మత్స్య రైతుల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి అన్నారు. అదనపు కలెక్టర్, జాతీయ మత్స్య రైతుల దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో జిల్లా మత్స్య శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. మత్స్య రైతులకు బీమా, కిసాన్ క్రెడిట్ కార్డుల మంజూరు, ఇతర సదుపాయాల కల్పనను కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు.

బైక్పై వెళుతూ ప్రమాదవశాత్తు డివైడర్ను ఢీకొట్టడంతో యువకుడు మృతి చెందగా, మరో యువకుడికి గాయాలైన ఘటన ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లిలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఇద్దరు యువకులు బైక్పై ఖమ్మం వైపు వెళుతూ డివైడర్ను ఢీకొట్టారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

జిల్లాలోని 66 మిల్లర్లు ప్రభుత్వానికి సకాలంలో సీఎంఆర్ బియ్యంను అందించడంలో విఫలమవుతున్నారు. 2024-25 యాసంగి సీజన్లో ఇప్పటివరకు ప్రభుత్వానికి 60% మాత్రమే అందించారు. ఈ సీజన్లో 4,55,981,360 మె.ట ధాన్యాన్ని మిల్లర్లకు ఇవ్వగా, 1,84,444,836 మె.ట బియ్యంను అప్పగించారు. మరో 1,21,298,515 మె.ట అందజేయాల్సి ఉండగా.. ఈ ఏడాది SEPతో గడువు ముగియనుంది. పెండింగ్ సీఎంఆర్పై అధికారులు ఏ విధంగా వ్యవహరిస్తారో చూడాలి.
Sorry, no posts matched your criteria.