India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఖమ్మం: ఏప్రిల్ నెలాఖరు నాటికి మండల కార్యాలయాలను ప్లాస్టిక్ రహితం చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్, ప్లాస్టిక్ నియంత్రణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. మండలంలో కార్యాలయాల వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాల నిర్వహణను నిరంతరం పర్యవేక్షించాలని, ప్రతి రోజు త్రాగునీటి సరఫరా నాణ్యత తనిఖీ చేయాలని పేర్కొన్నారు.

ఆయిల్ పాం రైతులకు మంచిరోజులు వచ్చాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. టన్ను ఆయిల్ పాం గెలల ధర రూ.21,000కు చేరిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకనే ధర రూ. 8,500 మేర పెరిగిందని మంత్రి తెలిపారు. ధర పెరగడంతో రాష్ట్రంలోని 64,582 మంది ఆయిల్ పాం రైతులకు అదనపు లబ్ధి చేకూరనుందని, ఇంకా మరింతమంది రైతులు ముందుకు వచ్చి ఆయిల్ పామ్ సాగు చేపట్టాలని పిలుపునిచ్చారు.

ఖమ్మం ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్(VDO’Sకాలనీ)లో బుధవారం కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. కేజీ టమాటా రూ.20, వంకాయ 24, బెండకాయ 20, పచ్చిమిర్చి 24, కాకర 38, కంచకాకర 46, బీరకాయ 48, సొరకాయ 16, దొండకాయ 38, క్యాబేజీ 20, చిక్కుడు 80, ఆలుగడ్డ 30, చామగడ్డ 40, క్యారెట్ 38, బీట్రూట్ 26, బీన్స్ 50, క్యాప్సికం 54, ఉల్లిగడ్డలు 34, కోడిగుడ్లు(12) రూ.60గా ఉన్నాయని ఎస్టేట్ అధికారి శ్వేత పేర్కొన్నారు.

∆} వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం
∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
∆} కామేపల్లిలో ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటన
∆} వైరా పర్ణశాలలో ప్రత్యేక పూజలు
∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద పర్యటన
∆} బోనకల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం

సహకార ప్రగ్యా పథకం పురోగతి వివరాలు తెలపాలని.. దేశవ్యాప్తంగా ప్రాంతీయ శిక్షణ కేంద్రాల సంఖ్యను పెంచాలని ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి కోరారు. మంగళవారం లోక్ సభలో ఆయన మాట్లాడారు. ఆ పథకానికి సంబంధించిన వివరాలు చెప్పాలన్నారు. దీనికి కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.

HCU భూ అంశంపై విద్యార్థుల ముసుగులో BRS అరాచకం చేస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. జంతువులు చనిపోయినట్లు సోషల్ మీడియాలో చూపుతున్న ఫోటోలు పాతవని స్పష్టం చేశారు. అక్కడి బండరాళ్లు, చెరువులకు ఎలాంటి నష్టం జరగనివ్వమని స్పష్టం చేశారు. ఈ భూముల్లోని జంతువులు, పక్షులకు ఎలాంటి హాని జరగలేదని మంత్రి పొంగులేటి చెప్పారు.

రాజ్యసభ ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి మంగళవారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రాంమోహన్ నాయుడుతో భేటీ అయ్యారు. పార్లమెంట్ ప్రాంగణంలోని మంత్రి ఛాంబర్లో ఆయనతో సమావేశమై తెలంగాణలో విమానశ్రయాల ఏర్పాటుపై చర్చించారు. భద్రాద్రి కొత్తగూడెంలో విమానశ్రయం ఏర్పాటు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కోరారు. సీతారామచంద్రస్వామి ఆలయానికి వచ్చేపోయే భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు.

అర్హులైన యువత రాజీవ్ యువ వికాసం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ తెలిపారు. మంగళవారం మధిర మండలం దెందుకూరు గ్రామంలో రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల ప్రక్రియను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత దరఖాస్తు దారులతో అదనపు కలెక్టర్ ఇంటరాక్ట్ అయ్యారు.

రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 14 వరకు గడువు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. నిరుద్యోగ యువతపై పెద్ద మొత్తంలో ప్రభుత్వం నిధులు ఖర్చు చేస్తూ రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశ పెట్టిందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ యువకులకు సంబంధిత కార్పొరేషన్ల ద్వారా రుణాలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ బుధవారం పునః ప్రారంభం కానున్నదని మార్కెట్ శాఖ అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. వారాంతపు సెలవు, ఉగాది, రంజాన్ సెలవుల అనంతరం రేపటి నుంచి మార్కెట్లో క్రయవిక్రయాలు పునః ప్రారంభం అవుతాయని చెప్పారు. కావున ఈ విషయాన్ని జిల్లా రైతు సోదరులు గమనించి తమ పంటను వ్యవసాయ మార్కెట్ కు తీసుకొని అమ్మకాలు జరుపుకోవాలని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.