India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పంట పొలాల్లో నీరు నిలుస్తోంది. ఇలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో వర్షాధార పంటలైన మొక్కజొన్న, కంది, పత్తి, జొన్న, పెసర, మినుముతో పాటు వరి, మిరప, ఉద్యాన పంటలు పండిస్తున్న రైతులు జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. వర్షం నీరు నిలవకుండా మురుగుకాల్వలు ఏర్పాటుచేసుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.
అంగన్వాడీలను బలోపేతం చేసేందుకు
చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య బోధించాలని నిర్ణయించి టీచర్లకు శిక్షణ ఇస్తున్నారు. జిల్లాలో 1,849 అంగన్వాడీ కేంద్రాల్లోని 1,835 మంది టీచర్లను 49 బృందాలుగా విభజించి ఇస్తున్న శిక్షణ నేటితో ముగుస్తుంది. రోజుకు 2 సార్లు టీ, స్నాక్స్, భోజనానికి రూ.120 కేటాయిస్తూ ప్రభుత్వం ఆర్డర్స్ ఇచ్చింది. కానీ శిక్షణ పూర్తవుతున్నా నగదు అందకపోవడంతో అంగన్వాడీలు నిరాశ చెందుతున్నారు.
✓వరదలపై భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
✓ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
✓వివిధ శాఖల అధికారులతో ఖమ్మం జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
✓ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సెలవు
✓ఇల్లెందు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటన
✓అశ్వారావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటన
✓మణుగూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ ఆధారంగా ఖాతాల్లో నగదు జమ అయిన రైతుల్లో ఆనందం వ్యక్తమవుతుండగా.. అందని వారిలో అయోమయం నెలకొంది. జాబితాలో పేర్లు లేవని గుర్తించిన పలువురు పీఏసీఎస్, బ్యాంకుల వద్దకు వెళ్లి ఆరా తీస్తున్నా ఫలితం కానరావడం లేదు. మాఫీ నిబంధనలు, ప్రక్రియ గందరగోళంగా ఉండడంతోనే ఇలా జరిగిందని రైతులు ఆరోపిస్తిున్నారు.
పంట రుణమాఫీపై రైతుల సందేహాలు, ఇబ్బందులు పరిష్కరించేందుకు కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయంలో ప్రత్యేకంగా ‘పరిష్కార విభాగాన్ని’ ఏర్పాటు చేసినట్లు డీఏఓ విజయనిర్మల శుక్రవారం తెలిపారు. రైతులు తమ సమస్యలను టోల్ఫ్రీ నం.1950 లేదా 90632 11298ను సంప్రదించాలని సూచించారు. పనిదినాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు టోల్ఫ్రీ నంబర్ల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు.
త్వరలో ఉద్యోగ ఖాళీలపై జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఓవర్ ల్యాపింగ్ లేకుండానే పోటీ పరీక్షలను నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. అలాగే త్వరలో ప్రతి అసెంబ్లీ స్థానంలో అంబేడ్కర్ నాలెడ్జ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. కాగా, నేడు డిప్యూటీ సీఎం సచివాలయంలో గ్రూప్-2 అభ్యర్థులతో పరీక్షల రద్దుపై చర్చించారు.
పోలవరం సమీపంలో ఉన్న పాల కాలువలో శుక్రవారం గిరిజనుడు గల్లంతయ్యాడు. వెలమలకోటకి చెందిన వెంకన్న దోర (40) చేపలు పడుతుండగా వాగులో ఒక్కసారిగా వరద ఉద్ధృతికి పెరగడంతో కొట్టుకు పోయాడని స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు 2 రోజులు సెలవులు రానున్నాయి. శనివారం వారాంతపు యార్డు బంద్, ఆదివారం సాధారణ సెలవు నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉండనుంది. దీంతో రైతులు గమనించి వ్యవసాయ మార్కెట్ కు సరుకులు తీసుకొని రావద్దని మార్కెట్ అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలియజేశారు. సోమవారం యథావిధిగా మార్కెట్ ఓపెన్ అవుతుందని తెలిపారు.
గార్ల మండలంలోని పాకాల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో లెవెల్ బ్రిడ్జి నుంచి వరద ప్రభావం ఎక్కువ ఉండటంతో రాంపురం, మద్దివంచ మరికొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉధృతి తగ్గుముఖం పట్టే వరకు వాగు సమీపంలోకి ఎవరూ రాకూడదని అధికారులు సూచించారు.
కారేపల్లి మండల పరిధిలోని భాగ్యనగర్ తండా గ్రామంలో పెన్షన్ డబ్బులు ఇవ్వడం లేదని ఇటీవల తల్లి సక్రిని కర్రతో కొట్టి హత్య చేసిన కుమారుడు భీముడు ను శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్ చేసినట్లు ఎస్సై రాజారాం తెలిపారు. ఈనెల 15న కన్నతల్లి అయిన సక్రిని గుగులోత్ భీముడు కర్రతో కొట్టి హత్య చేశాడు. విచారణలో తల్లిని చంపిన వ్యక్తి బీముడు ను అదుపులో తీసుకొని రిమాండ్ చేసినట్లు ఎస్ఐ చెప్పారు.
Sorry, no posts matched your criteria.