India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జోన్ 4 పరిధిలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల పంచాయతీ కార్యదర్శుల బదిలీ లో ఈరోజు పూర్తయ్యాయి. హైదరాబాద్ లోని పంచాయతీ రాజ్ కమీషనర్ కార్యాలయంలో జరిగిన కౌన్సెలింగ్ లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఖమ్మం జిల్లాకు 10 మంది, మహబూబాబాద్ జిల్లాకు ఒకరు బదిలీపై వెళ్తున్నారు. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు బదిలీ లో ఎవరు రావడం లేదని అధికారులు తెలియజేసారు.
గోదావరిలో చేపలు పట్టేందుకు వెళ్లి ఓ వ్యక్తి గల్లంతైన ఘటన వెంకటాపురం మండలంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటాపురం మండలం ఆలుబాకకి చెందిన బానారి రాజు (45) ఈరోజు మధ్యాహ్నం చేపల వేటకు వెళ్లి గల్లంతయ్యాడు. స్థానికులు ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఖమ్మం జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు. జలాశయాలు, చెరువులు, వాగులు వంకలన్నీ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పిల్లలు ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలన్నారు. అత్యవసర సమయాల్లో సహకారం అందించేందుకు పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబరు 87126 59111 అందుబాటులో వుంటుందని, సద్వినియోగం చేసుకోవాలని సీపీ సూచించారు.
రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రహదారులన్ని జలమయమయ్యాయి. వాహనదారులు ప్రయాణాలు చేసేటప్పుడు రోడ్లపై ఉన్న గుంతలు నీటితో నిండి ఉండటం వల్ల రోడ్డు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని, అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దని భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. రాబోయే రెండు రోజుల్లో కూడా భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
బీసీ జనగణన తర్వాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నాలుగు గోడల మధ్య తాము నిర్ణయాలు తీసుకోవడం లేదన్నారు. తమది ప్రజా ప్రభుత్వమని ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా పాలన చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం కేంద్రంతో భేషజాలకు పోయి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బ తీసిందన్నారు. ఫోన్ ట్యాపింగ్, సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతి చేసిందని ఆరోపించారు.
జ్వరంతో ఆర్మీ జవాన్ మృతి చెందిన ఘటన కారేపల్లి మండలంలో జరిగింది. కుటుంబసభ్యుల వివరాలు.. భాగ్యనగర్ తండాకి చెందిన టీ.బాలాజీ 10 సంవత్సరాలుగా ఆర్మీ జవాన్గా విధులు నిర్వహిస్తున్నారు. 10 రోజుల క్రితం జ్వరం వస్తుందని ఉత్తరప్రదేశ్ నుంచి స్వగ్రామమైన భాగ్యనగర్ తండాకు వచ్చాడు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాదుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 13 ఎస్హెచ్ఓ స్టేషన్లు ఉన్నాయి. అన్నీ ఖమ్మంలో ఉన్న ఉప కమిషనర్ కార్యాలయం పర్యవేక్షణలో పని చేస్తున్నాయి. ఆరేళ్లలో ఒక్క ఎన్ఫోర్స్మెంట్ విభాగం 9,008 కిలోల గంజాయిని పట్టుకొంది. ఎన్ఫోర్స్మెంట్, రెండు జిల్లాల్లోని జిల్లా టాస్క్ ఫోర్స్ బృందాలు కేసులను ఆయా పరిధి స్టేషన్లలో నమోదు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే స్టేషన్లలో మూలుగుతున్న గంజాయి కలిసి స్టేషన్లలో కుప్పలు పేరుకుపోతున్నాయి.
కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. గురువారం సాయంత్రం 22 అడుగులు ఉన్న నీటిమట్టం శుక్రవారం ఉదయానికి 24 అడుగులకు చేరుకుంది. ఎగువున భారీ వర్షాలు కురుస్తుండడంతో గోదావరి మరింత పెరిగే సూచనలు ఉన్నాయని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
కూసుమంచి మండలంలోని మునిగేపల్లి వ్యవసాయ క్షేత్రాల్లో రైతులు గుర్తించిన పాద ముద్రలు చిరుత పులివి కావని అటవీ రేంజి అధికారి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఓ వ్యవసాయ క్షేత్రంలో పాదముద్రలను గుర్తించిన కౌలు రైతు గ్రామ కార్యదర్శికి సమాచారం ఇచ్చాడు. గ్రామ కార్యదర్శి నరేశ్ ద్వారా సమాచారం అందుకున్న రేంజర్ ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ఈసందర్భంగా తీసిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
జిల్లాలో చేపడుతున్న వివిధ ప్రాజెక్ట్ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా అధికారులు చర్యలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో వివిధ ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. నేషనల్ హైవే ప్రాజెక్టుల భూ సేకరణ పనులు పూర్తి చేయాలన్నారు. ధంసలాపురం వద్ద ఎంట్రీ, ఎగ్జిట్ కి కావాల్సిన భూ సేకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.
Sorry, no posts matched your criteria.