India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రాగల రెండు రోజులు తుఫాను కారణంగా మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. శుక్రవారం ఆయన ఆర్డీవో, వివిధ మండలాల తహశీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వాగులు, వంకల వైపు ప్రజలు వెళ్లకూడదని హెచ్చరించారు. అలాగే విద్యుత్ నియంత్రికలు ఐరన్ విద్యుత్ స్తంభాలను ముట్టుకోకూడదన్నారు.

మహబూబ్నగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా హన్వాడలో 66.5 మిల్లీమీటర్ల వర్షం రికార్డయింది. మహమ్మదాబాద్ 53.8, మూసాపేట మండలం జానంపేట 40.5, బాలానగర్ 39.8, కౌకుంట్ల 39.5, భూత్పూర్ 38.0, జడ్చర్ల 37.5, రాజాపూర్ 35.5, నవాబుపేట మండలం కొల్లూరు 34.5, భూత్పూర్ 32.5, మిడ్జిల్ 31.5, చిన్నచింతకుంట 29,6 దేవరకద్ర 28.5 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది.

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా స్థానిక సంస్థల స్థానాల రిజర్వేషన్లపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఓటరు జాబితా సిద్ధమవడం, ఇప్పుడు రిజర్వేషన్లు కూడా ఖరారవడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. స్థానాల వారీగా గతంలో ఎవరికి రిజర్వు అయ్యాయి. ఈసారి ఏ కేటగిరీకి రిజర్వ్ అయ్యే అవకాశముందని బేరీజు వేసుకుంటున్నారు. తాము పోటీ చేయాలనుకునే స్థానం ఏ కేటగిరీలోకి వెళ్తుందో ఓ అంచనాకు వస్తూ.. మునిగి తేలుతున్నారు.

దసరా పండుగ సెలవుల్లో తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ డి.జానకి తెలిపారు.
✒సెలవు దినాల్లో ఆసక్తి ఉన్న రంగాల్లో శిక్షణ ఇవ్వాలి
✒ప్రత్యేకంగా నిఘా పెట్టాలి
✒ పిల్లలు మొబైల్ వాడేటప్పుడు..సైబర్ మోసాలు జరగవచ్చు జాగ్రత్తలు తీసుకోవాలి
✒వాహనాలు నడపనివ్వకూడదు
✒బైక్,కార్ల తాళాలు పిల్లల దృష్టికి అందుబాటులో ఉంచకూడదు
✒’PREVENTION IS BETTER THAN CURE’ అని గుర్తుంచుకోవాలన్నారు.

పాలమూరు యూనివర్సిటీలో రేపు బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ ఇవాళ ఓ సర్క్యులర్ విడుదల చేసింది. యూనివర్సిటీలోని పీజీ కాలేజ్ సమీపంలో రేపు సాయంత్రం 4:00 గంటలకు బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నామని, ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా యూనివర్సిటీ ఉపకులపతి(VC) ఆచార్య జీఎన్ శ్రీనివాస్, అతిధిగా రిజిస్ట్రార్ ఆచార్యపూస రమేష్ బాబు హాజరవుతున్నారని, యూనివర్సిటీ సిబ్బంది తదితరులు హాజరుకావాలని పేర్కొన్నారు.

విద్యార్థులు మన భవిష్యత్ భారతావనికి పునాదులని, వారిని కంటికి రెప్పలాగా కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి అన్నారు. ఆమె మాట్లాడుతూ.. దసరా వంటి పండుగ సెలవుల్లో నిర్లక్ష్యం వలన అమాయక విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారని, తల్లిదండ్రులు తమ పిల్లల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని శిశు గృహన్ని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి గురువారం తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పిల్లల ఆరోగ్య స్థితిగతులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. శిశు గృహ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. బరువు తక్కువ ఉన్న చిన్నారులకు స్పెషల్ డైట్ ఇవ్వాలన్నారు. వయస్సులవారీగా పిల్లలను వేరుచేసి వారి ఎదుగుదలపై మానిటరింగ్ చేయాలన్నారు.

జడ్చర్ల మండలంలోని మల్లెబోయినపల్లి, మాచారం గ్రామాలలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పనులను జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడి, ఇప్పటివరకు జరిగిన పనుల స్థితి, దశల వారీగా బిల్లుల చెల్లింపుల గురించి ఆరా తీశారు. కలెక్టర్ సంబంధిత అధికారులకు పనులను వేగంగా పూర్తి చేయాలని, లబ్ధిదారులు ఇళ్లు త్వరగా నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు .

అక్టోబర్ 22 నుండి శ్రీశ్రీశ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూధన్ రెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాల పోస్టర్ను మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ విజయేంద్ర బోయితో కలిసి ఆవిష్కరించారు. MLA మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం వివిధ శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలన్నారు.

పాలమూరు యూనివర్సిటీలో ఆర్చరి పురుషుల విభాగంలో సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లో పాల్గొనేందుకు బుధవారం ఎంపికలు నిర్వహించామని యూనివర్సిటీ పీడీ.వై.శ్రీనివాసులు తెలిపారు. యూనివర్సిటీ ఉపకులపతి(VC) జి ఎన్ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్ బాబు మాట్లాడుతూ.. క్రీడాకారులు మంచి ప్రతిభ కనబరచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పీడీ సత్య భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.