India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహబూబ్ నగర్ టీఎస్ఆర్టీసీ ‘గమ్యం యాప్’ తో మీ ప్రయాణ సమయం ఎంతో ఆదా అవుతుందని ఆర్టీసీ డిపో మేనేజర్ సుజాత మంగళవారం తెలిపారు. పట్టణంలోని గణేష్ మండపాల దగ్గర మహబూబ్ నగర్ ఆర్టీసీ విలేజ్ బస్ ఆఫీసర్స్ మార్కెటింగ్ అయిన సీజన్ టికెట్, తిరుపతి దర్శనం, వివాహ శుభ కార్యాలు, విహారయాత్రల ప్రత్యేక బస్సులు తదితర విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.
✔మాజీమంత్రి లక్ష్మారెడ్డి సతీమణి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి,KCR, MLAలు దిగ్భ్రాంతి ✔ముమ్మరంగా ప్రత్యేక పారిశుద్ధ్య పనులు ✔ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి ✔జూరాల ప్రాజెక్టు 26 గేట్లు ఎత్తివేత ✔భారీగా తగ్గిన చికెన్ ధరలు ✔శ్వేతారెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్న నాయకులు ✔GDWL:12న జాబ్ మేళా,జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు ✔ఘనపూర్: క్లినిక్ సీజ్ చేసిన వైద్యాధికారి ✔విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు
నాగర్ కర్నూల్ జిల్లా అవంచలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతారెడ్డి అంత్యక్రియలు జరిగాయి. వారి వ్యవసాయ పొలంలో శ్వేతారెడ్డి చితికి కుమారుడు స్వరూన్ రెడ్డి నిప్పు అంటించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి కన్నీటి పర్యాంతమయ్యారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. లక్ష్మారెడ్డిని పాలమూరు ప్రజాపతినిధులతోపాటు బీఆర్అస్ నాయుకలు పరామర్శించారు.
వనపర్తికి చెందిన ఎస్వీ రమేష్(నవీన ఫోటో పార్లర్) ప్రతిభ చాటారు. సౌత్ ఆఫ్రికాలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫోటోగ్రఫీ185 ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా 15 రోజు నిర్వహించిన వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ వర్క్షాప్లో ఆయన పాల్గొన్నారు. అక్కడ చిత్రాలను ఆకర్షణీయంగా చిత్రీకరించిన ఆయన ఫోటోగ్రఫీ వర్క్షాప్లో చిత్రాలను ప్రదర్శించి ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలు ఆయనకు అభినందనలు తెలిపారు.
అలంపూర్ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి నియమించే పాలక మండలిలో నేనంటే నేనంటూ రాజకీయ నిరుద్యోగులు ఎవరి ప్రయత్నాల్లో వారు తెరచాటు ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. గత పాలక మండలి నుంచి కొందరు ప్రయత్నాలు చేస్తుండగా.. మరికొందరు సంపత్ కుమార్ వర్గం నుంచి ప్రయత్నిస్తుండగా.. మరికొందరు సీఎం సోదరుల ద్వారా ప్రయత్నిస్తున్నారు. ఇలా ఎవరి ప్రయత్నాల్లో వారు పోటీ పడుతున్నారు.
జడ్చర్ల మాజీ మంత్రి చర్లకోల లక్ష్మారెడ్డి సతీమణి గత రాత్రి అనారోగ్యంతో చెన్నైలో మరణించింది. ఆమె భౌతిక దేహాన్నినాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండలం ఆవంచ గ్రామానికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఉమ్మడి MBNR జిల్లా ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, జనంపల్లి అనిరుద్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి వాకటి శ్రీహరి, కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.
మాజీ మంత్రి, BRS మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతా లక్ష్మారెడ్డి(60) సోమవారం రాత్రి మృతిచెందారు. కాగా శ్వేతా మృతి పట్ల మాజీ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేశారు. లక్ష్మారెడ్డికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంత్యక్రియలకు బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు తదితరులు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు వెల్లడించారు.
షాద్నగర్ సమీపంలోని ఎలికట్ట శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. కొందర్గు మండలానికి చెందిన కరుణాకర్, శేఖర్ ప్రాణ స్నేహితులు. వీరు ఎక్కడికి వెళ్లినా కలిసి వెళ్లేవారు. ఆదివారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు షాద్నగర్లో కలుసుకున్నారు. మద్యం సేవించి బైక్పై ఇంటికి బయల్దేరారు. మార్గమధ్యలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు.
పాలమూరు జిల్లాలో చికెన్ ధరలు భారీగా తగ్గాయి. గతవారం కిలో రూ. 200లకు పైగానే విక్రయించారు. గణేశ్ నవరాత్రులు మొదలుకావడంతో మాంసం విక్రయాలు క్రమంగా తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. మంగళవారం చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. విత్ స్కిన్ కిలో రూ. 161, స్కిన్ లెస్ రూ. 183, ఫాంరేటు రూ. 89, రిటైల్ రూ. 111 చొప్పున విక్రయిస్తున్నారు.
SHARE IT
మాజీ మంత్రి చర్లకోల లక్ష్మారెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. లక్ష్మారెడ్డి భార్య శ్వేతారెడ్డి సోమవారం రాత్రి మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. NGKL జిల్లా తిమ్మాజీపేట మండలం ఆవంచలో నేడు మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు జరగనున్నాయి. ఆమె మరణంతో నియోజకవర్గంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Sorry, no posts matched your criteria.