India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గడచిన 24 గంటల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. గద్వాల జిల్లా కేంద్రంలో 4.8 మిల్లీమీటర్లు, మహబూబ్నగర్ జిల్లాలోని చిన్న చింతకుంటలో 3.5 మి.మీ, నాగర్ కర్నూల్ జిల్లా జఠప్లోల్లో 2 మి.మీ, నారాయణపేట జిల్లా జక్లేర్లో 5.8 మి.మీ, వనపర్తి జిల్లా వెల్గొండలో 5.8 మి.మీల వర్షపాతం నమోదయింది.
పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని పీజీ సెమిస్టర్- 2 పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ మేరకు పీజీ కళాశాల పరీక్ష కేంద్రంలో పీయూ రిజిస్ట్రార్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరీక్షలు సజావుగా జరిగే విధంగా అధికారులు చూడాలని, చూచిరాతలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట కంట్రోలర్ రాజ్ కుమార్, ప్రిన్సిపాల్ చంద్రకిరణ్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్న వారికి నిర్ణీత గడువులోపు అనుమతులు ఇవ్వాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం నారాయణపేట కలెక్టరేట్లో పరిశ్రమలు, డిఆర్డిఏ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు అనుమతుల కొరకు 58 దరఖాస్తులు రాగా, 45 దరఖాస్తులకు అనుమతులు వచ్చాయని, మిగతావి ప్రాసేస్ లో వున్నాయని కలెక్టర్ కు వివరించారు. టి ప్రైడ్ కింద 79 దరఖాస్తులకు సబ్సిడీ మంజూరు చేశామన్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాల నేపథ్యంలో డెంగీ, చికెన్ గన్యా, మలేరియా, టైఫాయిడ్, ఇతర విష జ్వరాలతో పాటు, జలుబు,దగ్గు తదితర వాటితో బాధితులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. MBNR-30, NGKL-35, NRPT-15, WNPT-15, GDWL-12 చొప్పున ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి. వీటన్నిటికీ ఔషధాలు MBNRలోని కేంద్ర ఔషధ నిల్వ కేంద్రం నుంచి సరఫరా అవుతున్నాయి. కొన్ని రకాల ఔషధాలు రోగులకు అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.
✔ప్రజావాణి.. సమస్యలపై ఫోకస్ ✔సాహితీ సమరానికి నిలువెత్తు నిదర్శనం కాళోజి:మంత్రి జూపల్లి ✔ఉమ్మడి జిల్లాలో ఘనంగా కాలోజీ జయంతి వేడుకలు ✔రాష్ట్రంలో 80వేల ఎకరాల వక్ఫ్ భూములు:DK అరుణ ✔ఓటు హక్కు నమోదు చేసుకోండి:MROలు ✔అక్రమాలపై హైడ్రా ఫోకస్ ✔డీజేలకు అనుమతి లేదు:SIలు ✔పలుచోట్ల వినాయక నిమర్జనం ✔ప్రజలకు విజ్ఞలు తొలగి విజయం కలగాలి:DIG చౌహన్ ✔ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్గా ఎమ్మెల్యే శంకర్
జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం గంటగంటకు పెరుగుతోంది. కర్ణాటకలో భారీ వర్షాలు కురవడంతో ఆల్మట్టి డ్యాం పూర్తిస్థాయిలో నిండిపోవడంతో దిగువకు రెండు లక్షలకు పైగా వరద నీరు వదలడంతో జూరాల ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు డ్యాం 26 గేట్లు ఎత్తి 2 లక్షల వరద నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. నది తీర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
జాతీయ ఉత్తమ గ్రామ పంచాయతీల ఎంపికకు నివేదికలు పంపించాలని కలెక్టర్ సిక్త పట్నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం నారాయణపేట కలెక్టరేట్లో డిఆర్డిఏ అధికారులతో సమావేశం నిర్వహించారు. 9 అంశాల్లో నివేదికలు మంగళవారం సాయంత్రంలోగా పంపించాలని చెప్పారు. వాటిని పరిశీలించి జాతీయ పురస్కారాల కొరకు ఉన్నతాధికారులకు పంపించడం జరుగుతుందని సూచించారు. సంబంధిత అధికారులు పాలోన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు మొదలుపెట్టిన పనులలో ఎలాంటి విఘ్నాలు లేకుండా.. అన్నింటా విజయం సాధించాలని జోగులాంబ జోన్ -7 డిఐజి ఎల్ఎస్ చౌహాన్ అన్నారు. ఆయన స్థానిక జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలీసు సురక్షా వినాయక విగ్రహంకు జిల్లా ఎస్పీ జానకి, అదనపు ఎస్పీ రాములు లతో గణనాథునికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు పరిధిలో సుమారు 80వేల ఎకరాల భూములు ఉన్నాయని ఎంపీ డీకే అరుణ అన్నారు. మహబూబ్ నగర్లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నిరుపేదలకు లబ్ధి చేకూర్చేందుకే కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డులో సవరణలు చేపట్టిందన్నారు. ఈ విషయంలో కొందరు పనిగట్టుకొని కేంద్రంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. అభిప్రాయాలు తెలుసుకునేందుకు రాష్ట్రంలో నెలాఖరున జేపీసీ పర్యటన ఉంటుందన్నారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో హైడ్రా ప్రకంపనలు మొదలయ్యాయి. CM రేవంత్ రెడ్డి ఆదేశాలతో సర్వే, భూ దస్త్రాల శాఖ అప్రమత్తమైంది. పురపాలక సంఘాల్లో, గ్రామాల్లో చెరువులు, కుంటలు, వాగుల్లో అక్రమ నిర్మాణాలను గుర్తించి ఏ రోజుకు ఆ రోజు నివేదిక రూపంలో సాయంత్రం 4 గంటల వరకు కమిషనర్కు మెయిల్ పంపించాలని ఆదేశించారు. నివేదిక ఎలా ఇవ్వాలో నమూనాను కూడా పంపించారు. ఈ ప్రక్రియ ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగనుంది.
Sorry, no posts matched your criteria.