Mahbubnagar

News September 6, 2024

వీపనగండ్ల: చోరీ కేసులో తండ్రీకొడుక్కి జైలు శిక్ష

image

చోరీ కేసులో తండ్రీకొడుక్కి వనపర్తి జిల్లా కోర్టు జైలు శిక్ష విధించింది. SI నందికర్ వివరాలు.. పెద్దకొత్తపల్లి మం. కల్వకోలుకు చెందిన తండ్రీకొడుకులు వెంకటస్వామి, గోపాలకృష్ణ 2020లో వీపనగండ్ల మం. తూంకుంటకు చెందిన ఎల్లమ్మ పొలం పనులకు వెళ్తుండగా మెడలోంచి బంగారం గొలుసు ఎత్తుకెళ్లారు. ఘటనపై కేసు నమోదు కాగా నేరం రుజువు కావడంతో ఇద్దరికి 2 ఏళ్లు జైలు, రూ.200 చొప్పున జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. 

News September 6, 2024

ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్: చిన్నారెడ్డి

image

రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. ఇక.. ఇవాల్టి నుంచే విద్యాసంస్థలో ఉచిత విద్యుత్ అమలులోకి వస్తుందని, జీవో కూడా విడుదల చేశామని వెల్లడించారు. విద్యా సంస్థలకు ఉచితంగా ఇచ్చే విద్యుత్తు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. విద్యతో పాటు గురువులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.

News September 6, 2024

ఉపాధ్యాయులు సమాజ సంస్కర్తలు: మంత్రి జూపల్లి

image

ఉపాధ్యాయులు సమాజాన్ని సంస్కరించే వ్యక్తులు అని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నాగర్ కర్నూల్‌లో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవంలో మంత్రి మాట్లాడుతూ.. మనిషి తనకు తాను సంస్కరించుకొని సమాజపురోభివృద్ధికి పాటుపడే విధంగా వ్యక్తులను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని అన్నారు. విద్యార్థులలో నిత్యం ప్రేరణకలిగిస్తూ, వారి తల్లిదండ్రులలోనూ పరోక్షంగా ప్రేరణ కల్పించే విధంగా ఉపాధ్యాయుల బోధన ఉండాలని సూచించారు.

News September 6, 2024

మహిళలపై వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు: ఎస్పీ

image

మహిళల భద్రత కోసమే షీ టీమ్ పని చేస్తుందని, వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని SP గిరిధర్ హెచ్చరించారు. గురువారం సైబర్ సెక్యూరిటీ DSP రత్నం, షీ టీమ్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో జిల్లామెడికల్ కాలేజీలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి SP ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలు ఆపద సమయంలో డయల్ 100, షీ టీమ్ జిల్లా నెంబరును 6303923211 సంప్రదించాలన్నారు.

News September 5, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు!!

image

✒ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
✒కల్వకుర్తి: తండ్రి మందలించాడని ఉరేసుకున్న బాలుడు
✒దేవరకద్ర MLAకు పితృవియోగం
✒పలుచోట్ల భారీ వర్షాలు
✒GDWL:విద్యుత్ షాక్‌తో ఎద్దు మృతి
✒పండుగలను శాంతియుతంగా జరుపుకోండి:CIలు
✒ప్రతి పోలింగ్ బూత్‌కు 200 సభ్యత్వాలు చేర్పించాలి:BJP
✒సీజనల్ వ్యాధులపై అవగాహన
✒మట్టి గణపతి విగ్రహాల పంపిణీ
✒ఓటర్ల జాబితా పై ప్రత్యేక ఫోకస్

News September 5, 2024

ఉమ్మడి జిల్లా నేటి వర్షపాత వివరాలు ఇలా..

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా గురువారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా.. అత్యధికంగా నాగర్ కర్నూలు జిల్లా సిరిసనగండ్లలో 9.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. గద్వాల జిల్లా గట్టులో 7.5 మిల్లీమీటర్లు, మహబూబ్నగర్ జిల్లా మాచుపల్లిలో 7.5 మిల్లీమీటర్లు, వనపర్తి జిల్లా దగడలో 2.5 మిల్లీమీటర్లు, నారాయణపేట జిల్లా కేంద్రంలో 1.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News September 5, 2024

గోల్కొండ కోటను జయించిన వీరుడు పాపన్న గౌడ్: శ్రీనివాస్ గౌడ్

image

గోల్కొండ కోటను జయించిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని మాజీ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం హైదరాబాద్ అంబర్ పేటలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేదల కోసం పోరాడని వెల్లడించారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కాలేరు, వెంకటేష్ పాల్గొన్నారు.

News September 5, 2024

MBNR: మీ ఫేవరెట్ టీచర్ ఎవరు..? కామెంట్ చేయండి!

image

విద్యార్థుల్లో విజ్ఞాన వెలుగులు నింపుతూ, వారు ఉన్నత స్థాయికి చేరేలా నిరంతరం కృషి చేసే వారే గురువులు. నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా MBNR, NGKL, WNP, GDL, NRPT జిల్లాల్లోని అన్ని విద్యాలయాల్లో వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సీనియర్ విద్యార్థులు టీచర్లుగా మారి జూనియర్లకు పాఠాలు బోధిస్తూ సందడి చేస్తున్నారు. మరి.. మీ ఫేవరేట్ టీచర్ ఎవరో కామెంట్ చేయండి. SHARE IT

News September 5, 2024

MBNR: ఉమ్మడి జిల్లాలోనే గురువుల గ్రామం ‘వెన్నచేడ్’

image

మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలంలోని వెన్నచేడ్ గ్రామం ఉమ్మడి జిల్లాలోనే ప్రభుత్వ టీచర్లకు కేంద్రం. ఇక్కడ దాదాపు 210 మంది ఉపాధ్యాయులు ఉండగా.. వీరిలో 50కి పైగా మహిళలు ఉన్నారు. చాలా మంది ఉపాధ్యాయులు చదివిన పాఠశాలలోనే బోధిస్తున్నారు. 150 పైగా యువత DSCకి ప్రిపేర్ అవుతున్నారు. ఇక్కడ 1956లో పాఠశాల ప్రారంభం కాగా గ్రామంలో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. టీచర్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం..

News September 5, 2024

MBNR: నీటి తొట్టిలో పడి చిన్నారి మృతి

image

తొట్టిలో పడి చిన్నారి మృతి చెందింది. స్థానికుల సమాచారం.. గండీడ్ మం. రుసుంపల్లికి చెందిన హరి దంపతులకు ఇద్దరు పిల్లలు. బుధవారం పిల్లలను తాత వద్ద వదిలి వారు పొలానికి వెళ్లారు. కూతురు గౌతమి ఆడుకుంటూ వెళ్లి పశువులకు నీళ్లు తాగేందుకు నిర్మించిన తొట్టిలో పడింది. పాపను బయటకు తీసి జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. చిన్నారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.