India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ జానకి అన్నారు. జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన కందూరు రామలింగేశ్వర స్వామి దేవాలయం, మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, వీరన్నపేట పెద్ద శివాలయం, పిల్లల మర్రి వద్దనున్న శివాలయం వద్ద పటిష్ఠ భద్రత ఆ చర్యలు చేపట్టినట్టు ఎస్పీ వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ స్పోర్ట్స్ గేమ్స్ మీట్లో పాల్గొనబోయే మహబూబ్ నగర్ జిల్లా క్రీడాకారులు మహబూబ్నగర్ జిల్లాకు, జోగులాంబ జోన్కు మంచి పేరు తీసుకురావాలని జిల్లా ఎస్పీ డి.జానకి ఆకాంక్షించారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు జిల్లా ఎస్పీ ఇవాళ స్పోర్ట్స్ కిట్లు, ట్రాక్ సూట్లు, స్పోర్ట్స్ షూస్ అందజేశారు. ఈనెల 17 నుంచి HYDలో జరిగే రాష్ట్ర స్థాయి టోర్నీలో పాల్గొననున్నారు.

పాలమూరు మేయర్ పీఠం దక్కించుకునేందుకు రాజకీయ చదరంగం మొదలైంది. గెలిచిన కార్పొరేటర్లు పట్టణంలో కాకుండా క్యాంపుల్లో ఉండటం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్లో మేయర్ రేసులో పలువురు నేతలు ఉన్నప్పటికీ, ఒకరి పేరు ప్రకటిస్తే మిగిలిన వారు తిరుగుబాటు చేస్తారనే భయంతో నేతలు మౌనం వహిస్తున్నారు. క్యాంపు రాజకీయాల నడుమ గ్రూపుల తలనొప్పి అధిష్ఠానానికి సవాల్గా మారింది.

పాలమూరు విశ్వవిద్యాలయంలో ఫిబ్రవరి 18న అమ్నీల్ ఫార్మా, ఆర్-సొల్యూషన్స్ సంస్థలతో క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ జరగనుంది. 2025-26 బ్యాచ్ ఫార్మసీ, ఎంబీఏ, ఎం.కామ్ విద్యార్థులు అసలు సర్టిఫికెట్లు, రెజ్యూమ్తో ఫార్మసీ కాలేజ్ ఆడిటోరియానికి రావాలని ప్లేస్మెంట్ ఆఫీసర్ డా. ఎస్.ఎన్. అర్జున్ కుమార్ తెలిపారు. QC, QA, ప్రొడక్షన్ విభాగాల్లో నియామకాలు ఉంటాయి.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ పెద్దగా ప్రభావం చూపించలేదు. MBNRలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు, కిషన్ రెడ్డి కూడా ప్రచారం చేసినా బీజేపీ జెండా ఎగరలేదు. ఎంపీ డీకే అరుణ సొంత నియోజకవర్గంలో 37 వార్డుల్లో కేవలం 7 మాత్రమే గెలిచాయి. దీంతో కాషాయ పార్టీ నేతల్లో, కార్యకర్తల్లో తీవ్ర నిరాశనే మిగిల్చాయి.

పాలమూరు కార్పొరేషన్, దేవరకద్ర, భూత్పూర్ మున్సిపాలిటీలలో నిర్వహించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ విజయవంతంగా పూర్తి అయిందని ఎస్పీ జానకి తెలిపారు. లెక్కింపు కేంద్రాల దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిందన్నారు. వారం రోజులుగా కొనసాగిన ఎన్నికల ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించిన జిల్లా పోలీస్ అధికారులు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

మహబూబ్నగర్ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో మహిళా అభ్యర్థులు ప్రభంజనం సృష్టించారు. జిల్లాలోని రెండు పురపాలికలు, ఒక నగరపాలికలో జరిగిన ఎన్నికల్లో 32 మందికి పైగా మహిళలు విజయం సాధించి తమ సత్తా చాటారు. దేవరకద్ర, భూత్పూర్, మహబూబ్నగర్లలో మహిళల అఖండ విజయాలు రాజకీయాల్లో మారుతున్న ట్రెండ్కు, వారి ఉత్తేజానికి నిదర్శనంగా నిలిచాయి.

మహబూబ్నగర్ మేయర్ పీఠం ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. మొత్తం 60 డివిజన్లకు గాను 59 డివిజన్లలో పోలింగ్ జరిగింది. 58వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి ఏకగ్రీవంగా విజయం సాధించారు. 59 స్థానాల్లో కాంగ్రెస్-29, BRS-15, BJP-7, ఇతరులు 8 మంది విజయం సాధించారు. అయితే 53వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి తన సమీప ప్రత్యర్థి అయిన బీఆర్ఎస్ అభ్యర్థిపై 29 ఓట్ల మెజార్టీ రాగా.. అక్కడ రీకౌంటింగ్ జరుగుతోంది.

మహబూబ్ నగర్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్లో చాలా ఆలస్యం అవుతుంది. దీంతో కౌంటింగ్ కేంద్రం బయట కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది. కౌంటింగ్ కేంద్రం లోపల ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికి 1-30 డివిజన్ల ఫలితాలు వెలువడ్డాయి. ఇంకా 31-60 డివిజన్ల ఫలితాలు రావాల్సి ఉంది. ఎవరు ఆలస్యం చేస్తున్నారో అర్థం కావడం లేదని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో కొనసాగుతుంది. మొత్తం 60 స్థానాలకు గాను 30 డివిజన్లకు లెక్కింపు పూర్తయింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ 14 స్థానాల్లో, బీఆర్ఎస్ 9 స్థానాల్లో, బీజేపీ 4 స్థానాల్లో విజయం సాధించాయి. ఎంఐఎం 1, ఇతరులు 2 స్థానాల్లో విజయం సాధించారు. మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్ స్పష్టమైన అధిక్యంలో కొనసాగుతుంది.
Sorry, no posts matched your criteria.