India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మహబూబ్నగర్ కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు కలెక్టర్ విజయేందిర బోయి సమావేశం ఏర్పాటు చేశారు. వార్డుల వారీగా, పంచాయితీ ఓటర్ల జాబితా షెడ్యూల్పై అవగాహన కల్పించారు. మండల స్థాయిలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించామన్నారు. ఇప్పటికే ముసాయిదా జాబితాను గ్రామ పంచాయతీలు, మండల పరిషత్ కార్యాలయాల్లో అంటించామని చెప్పారు.
సీఐటీయూ మహబూబ్నగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ఈరోజు ధర్నా నిర్వహించారు. జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ.. ఐటీ హబ్లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి, సంక్షేమానికి కృషి చేయాలన్నారు. భూములు కోల్పోయిన స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆర్భాటం చేసిన ప్రభుత్వం, యాజమాన్యాలు కుమ్మక్కై స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించలేదన్నారు. ఈ మేరకు కలెక్టర్ ఏవోకు విన్నవించారు.
మహబూబ్ నగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా మిడ్జిల్ మండలం కొత్తపల్లిలో 85.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మిడ్జిల్ 63.3, జడ్చర్ల 34.3 మహబూబ్ నగర్ అర్బన్ 21.5, భూత్పూర్ 19.5, చిన్నచింతకుంట 13.3, కౌకుంట్ల 10.5, కోయిలకొండ మండలం పారుపల్లి 10.0, బాలానగర్ 8.5, మూసాపేట 5.8, దేవరకద్ర, హన్వాడ 3.8, మిల్లీమీటర్ల వాన పడింది.
స్థానిక ఎన్నికల నిర్వహన పనుల్లో జిల్లా అధికారులు నిమగ్నమయ్యారు. జిల్లాలోని గ్రామీణ ఓటరు జాబితా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను అధికారులు విడుదల చేశారు. మొత్తం ఓటర్లు 4,99,572 మంది ఉండగా.. పురుషులు 2,38,217, మహిళలు 2,51,344, ఇతరులు 11 మంది ఉన్నారు. ఈ జాబితా ప్రకారం మహిళా ఓటర్లే పురుషుల కంటే 3,127 మంది అధికంగా ఉన్నారు. దీంతో జిల్లాలో ఈ ఎన్నికల్లో వారి ఓట్లే ప్రాధాన్యం కానున్నాయి.
MBNR(D) బాలానగర్(M)లో జనరల్ బాలికల గురుకుల పాఠశాల కళాశాలను 1982 సం.లో స్థాపించారు. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు సుమారు 650 టీచర్లు, 90 PETలుగా పనిచేస్తున్నారు. ఇక్కడి విద్యార్థులు ఇంటర్నేషనల్ స్థాయికి ఇద్దరు, రాష్ట్రస్థాయిలో 45 మంది విద్యార్థులు ఆడారు. క్రీడలకు పుట్టినిల్లుగా.. ఈ గురుకులం పేరు పొందింది. నేడు క్రీడా దినోత్సవా ఇలాంటి పాఠశాలలను మరింత అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
మహబూబ్ నగర్(D) హన్వాడ(M) చిన్నదర్ పల్లి చెరువు, మహబూబ్నగర్ రూరల్ పరిధిలోని పాలకొండ చెరువు, మయూరి పార్క్ ముందు గల గంగుసాయి చెరువు వద్ద భద్రతా ఏర్పాట్లను ఎస్పీ డి.జానకి పరిశీలించారు. విగ్రహాల తరలింపు మార్గాలు, ట్రాఫిక్ నియంత్రణ, చెరువుల వద్ద లైటింగ్, బారికేడింగ్, రెస్క్యూ బృందాల ఏర్పాట్లపై సమీక్షించారు. DSP వెంకటేశ్వర్లు, హన్వాడ SI వెంకటేశ్, రూరల్ SI విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్నగర్ జిల్లాలో రెవెన్యూ సదస్సుల సందర్భంగా అందిన భూ భారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో తహశీల్దార్లతో సమావేశమైన ఆమె, దరఖాస్తుల్లో ఉన్న మార్పులు, చేర్పులు, మ్యుటేషన్ వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ కూడా పాల్గొన్నారు.
NGKL జిల్లా పదర మండలానికి చెందిన బండి నందిని, మహిళల కబడ్డీ అండర్-18 విభాగంలో ఇండియా క్యాంపునకు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి యాదయ్య గౌడ్ Way2Newsతో తెలిపారు. జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో ప్రతిభ కనబరిచిన నందిని, గురువారం ఢిల్లీలోని సోనీపత్లో జరిగే ఇండియా క్యాంపునకు బయలుదేరి వెళ్లారు. ఆమె తల్లిదండ్రులు రమేశ్, రామాదేవి సంతోషం వ్యక్తం చేశారు.
మహబూబ్నగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాలలో వర్షం కురిసింది. అత్యధికంగా మూసాపేట మండలం జానంపేటలో 29.8 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదయింది. భూత్పూర్ మండలం కొత్త మొల్గర 24.5, అడ్డాకుల 23.5, కౌకుంట్ల 8.8, మహబూబ్నగర్ అర్బన్ 6.8, గండీడ్ మండలం సల్కర్ పేట 5.5, కోయిలకొండ 5.0, మిడ్జిల్ మండలం కొత్తపల్లి 4.5, బాలానగర్ 3.8 మిల్లీమీటర్ల వర్షం నమోదయింది.
మహబూబ్నగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా భూత్పూర్ మండలం కొత్త మొల్గరలో 91.3 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది. కోయిలకొండ మండలం పారుపల్లి 76.3, MBNR అర్బన్ 62.0, భూత్పూర్ 55.3, మహమ్మదాబాద్ 49.0, మిడ్జిల్ 48.8, జడ్చర్ల 45.0, రాజాపూర్ 43.8, నవాబుపేట 34.5, బాలానగర్ 31.3, మూసాపేట 28.0, కౌకుంట్ల 25.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
Sorry, no posts matched your criteria.