Mahbubnagar

News September 27, 2024

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు జీవో తెచ్చింది నేనే: డీకే అరుణ

image

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు జీవో తెచ్చింది తానేనని, జీవో వచ్చి ఎనిమిదేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఉదండాపూర్ భూ నిర్వాసితులకు న్యాయం జరగలేదని ఎంపీ డీకే అరుణ గురువారం అన్నారు. గత ప్రభుత్వం భూ నిర్వాసితు సరైన న్యాయం చేయలేదన్నారు. భూ నిర్వాసితులకు పూర్తిస్థాయి ప్యాకేజీ అందించాలని ఆమె అన్నారు. సిగ్నల్ గడ్డ వద్ద రోడ్డు అస్తవ్యస్తంగా తయారైందని ఆమె అన్నారు.

News September 26, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు

image

✒నవాబుపేట: మహిళపై లైంగిక దాడి.. కేసు నమోదు
✒MBNR: ఉమెన్స్ పోలీస్ స్టేషన్‌కు రాష్ట్రస్థాయిలో ఫస్ట్ ర్యాంక్ వేడుకలు
✒సత్తా చాటాలంటే సభ్యత్వాలు పెంచాలి:DK అరుణ
✒పలుచోట్ల వర్షాలు
✒GDWL: ప్రభుత్వ ఆఫీస్‌లోనే ఉద్యోగి సూసైడ్
✒లింగాల: గుండెపోటుతో జర్నలిస్ట్ మృతి
✒దామరగిద్ద: చిరుత దాడిలో లేగ దూడ మృతి
✒NRPT: రేపు KGBVలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన

News September 26, 2024

సీఎం నివాసంలో చాకలి ఐలమ్మ జయంతి

image

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో బొంరాస్ పేట కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఐలమ్మ చిత్ర పటానికి సీఎం రేవంత్ రెడ్డి పూల మాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే గణేష్, బొంరాస్ పేట కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

News September 26, 2024

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ‘దేవర’ సందడి

image

జూనియర్ ఎన్టీఆర్, జాన్వీకపూర్ హీరో హీరోయిన్లుగా నటించిన దేవర సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుండటంతో హీరో ప్లెక్సీలు, కటౌట్‌లతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని థియేటర్ల వద్ద సందడి నెలకొంది. దీనిలో భాగంగా అచ్చంపేటలో శ్రీ సాయిరాం టాకీస్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి హీరో పైన ఉన్న తమ అభిమానాన్ని చాటుకున్నారు.

News September 26, 2024

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ముఖ్య వార్తలు

image

✓ ఉమ్మడి జిల్లాలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి ✓ పెద్దకోత్తపల్లి, కొల్లాపూర్ పోలీసు స్టేషన్ తనిఖీ చేసిన డీఐజీ
✓మిడ్జిల్ మండలంలో పర్యటించిన ఎంపీ డేకే అరుణ
✓ గద్వాల జిల్లాలో జీవో 25కు వ్యతిరేకంగా టీచర్స్ నిరసన మెమో
✓వెల్దండలో దేవగన్నేరు కవిత పుస్తకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే
✓వంగూరు మండలంలో దాడులు నిర్వహించిన ఎక్సైజ్ సిబ్బంది మెమో
✓పలు మండలలో ఎంఇఓలను సన్మానించిన సిబ్బంది

News September 26, 2024

నవాబుపేట: బహిర్భూమికి వెళ్లిన మహిళపై లైంగిక దాడి

image

బహిర్భూమికి వెళ్లిన మహిళపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఈనెల 14న జరగగా గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై విక్రం వివరాలిలా.. నవాబుపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన బొంత శివ అనే వ్యక్తి ఓ మహిళ బహిర్భూమికి వెళ్లిన సమయంలో లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు అత్యాచారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

News September 26, 2024

ఉమెన్స్ పోలీస్ స్టేషన్‌కు రాష్ట్రస్థాయిలో ఫస్ట్ ర్యాంక్

image

మహబూబ్ నగర్‌లోని ఉమెన్స్ పోలీస్ స్టేషన్‌కు రిసెప్షన్ వర్టికల్ విధానంలో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు లభించిందని జిల్లా ఎస్పీ జానకి ధరావత్ వెల్లడించారు. ఉమెన్ పీసీ జయమ్మను ఎస్పీ ఘనంగా సత్కరించారు. జయమ్మని ఆదర్శంగా తీసుకొని వర్టికల్ విభాగంలో అన్ని పోలీస్ స్టేషన్లు ప్రథమ స్థానంలో నిలవాలని కాంక్షించారు.

News September 26, 2024

ఉమ్మడి జిల్లా నేటి వర్షపాత వివరాలు

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా గురువారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా.. నాగర్ కర్నూల్ జిల్లా ఎళ్లికలో 48.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మహబూబ్నగర్ జిల్లా మాచుపల్లిలో 41.3 మిల్లీమీటర్లు, వనపర్తి జిల్లా సోలిపూర్ లో 33.0 మిల్లీమీటర్లు, నారాయణపేట జిల్లా ఉట్కూరులో 20.5 మిల్లీమీటర్లు, గద్వాల జిల్లా కేంద్రంలో 14.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News September 26, 2024

గద్వాల: ప్రభుత్వ ఆఫీస్‌లోనే ఉద్యోగి సూసైడ్!

image

గద్వాల జిల్లాలో దారుణ ఘటన జరిగింది. పట్టణంలోని కేఎల్ఐ క్యాంప్‌లో ఉన్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ సబ్ డివిజన్ నెంబర్- 1 కార్యాలయంలో పని చేస్తున్న సీనియర్ అసిస్టెంట్ అశోక్ తన కార్యాలయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 26, 2024

దామరగిద్ద: చిరుత దాడిలో లేగ దూడ మృతి

image

చిరుత దాడిలో లేగదూడ మృతి చెందిన ఘటన దామరగిద్ద తండాలో జరిగింది. రైతు గోన్యనాయక్ రోజువారీగానే ఆవులను మేపుకొని వచ్చి పొలం వద్ద కట్టేయగా రాత్రి లేగ దూడపై చిరుత దాడి చేసి చంపేసింది. కాగా, వారం రోజులుగా చిరుత బాపన్‌పల్లి గ్రామ శివారులో సంచరిస్తూ పశువులపై దాడి చేస్తోంది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికే అటవీ అధికారులు చిరుతను బంధించేందుకు బాపన్‌పల్లి శివారు అడవిలో బోన్ ఏర్పాటు చేశారు.