India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఓ వ్యక్తిపై దాడి జరిగిన సంఘటన బాలానగర్ మండల కేంద్రంలో జరిగింది. సీఐ నాగార్జున వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన జహంగీర్, ఓ గిరిజన మహిళతో గత 10 ఏళ్లుగా అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. 3 రోజుల క్రితం ఆ మహిళ కుమారుడు జహంగీర్ అనే వ్యక్తిపై దాడి చేయగా గాయపడ్డాడు. మరుసటి రోజు మరణించాడు. కేసు నమోదు చేసి, సిద్ధార్థ అనే వ్యక్తిని రిమాండ్ తరలించినట్లు సీఐ తెలిపారు.
మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు ఎస్పీ జానకి ధరావత్ శనివారం ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. జీవితం తీపి, చేదుల సమ్మేళనం అయినప్పటికీ కూడా అవన్నీ మన అభ్యున్నతికి పునాదులుగా నిలవాలన్నారు. కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో సంతోషంగా పండగలు చేసుకోవాలని సూచించారు. రైతాంగానికి సంపూర్ణమైన ఫలితాలు దక్కి రాష్ట్రంలో వ్యవసాయం ఎంతో పురోగతి సాధించాలని కాంక్షిస్తున్నట్టు వెల్లడించారు.
❤అల్లా కటాక్షంతో ప్రజలు సుభిక్షంగా వర్ధిల్లాలి:CM రేవంత్ రెడ్డి❤మన్యంకొండ దేవస్థానానికి పోటెత్తిన భక్తులు❤ఇఫ్తార్ విందు.. పాల్గొన్న నేతలు❤కొడంగల్ ప్రజలు రాష్ట్రన్ని పాలించే శక్తిని ఇచ్చారు: సీఎం❤ఉగాది,రంజాన్ EFFECT.. రద్దీగా మారిన బస్టాండ్లు❤సింగపూర్ ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఎంపీ డీకే అరుణ❤రేపే ఉగాది వేడుకలు❤NGKL:మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం❤పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్
రంజాన్ మాసం ఎంతో పవిత్రమైందని రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలతో అల్లాను కొలుస్తారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం కొడంగల్ పట్టణంలో ప్రభుత్వ పరంగా నిర్వహించిన “రంజాన్ ఇఫ్తార్ విందు”లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అల్లా కటాక్షంతో ప్రజలు సుభిక్షంగా ఉండాలన్నారు. ప్రజా ప్రతినిధులు, మైనారిటీ సోదరులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ధాన్యం సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. శనివారం తన ఛాంబర్లో యాసంగి ధాన్య సేకరణపై సమీక్షించారు. యాసంగి వరి పంటకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ గ్రేడ్ రకానికి రూ.2,320, సాధారణ రకానికి రూ.2,300 చొప్పున మద్దతు ధర ప్రకటించిందన్నారు. అంతేకాకుండా సన్న ధాన్యాన్నికి క్వింటాల్ కు రూ.500 బోనస్ ప్రకటించిదన్నారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఉగాది పండగకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఉగాది అంటేనే గుర్తుకొచ్చేది పచ్చడి. ఉగాది పచ్చడి.. తీపి, కారం, చేదు, పులుపు, వగరు, ఉప్పు వంటి షడ్రుచుల సమ్మేళనం. ఉగాది పచ్చడి అనేది జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది అని పెద్దల నమ్మకం. ఉగాది/యుగాది, సంవత్సరాది అని పిలుస్తారు. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ఆలయాలు ముస్తాబు చేశారు.
పాలమూరు పరిధి MBNR, NGKL, WNP, GDWL, NRPT జిల్లాల్లో పోక్సో చట్టంపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. ఎవరైనా అమ్మాయిలను వేధించినా.. అసభ్యంగా ప్రవర్తించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇకపై రద్దీ ప్రాంతాల్లో మఫ్టీలో షీటీమ్ సభ్యుల నిఘా ఉంటుందన్నారు. ఆకతాయి పనులు చేసి జీవితాలు నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు. బాలికలు, యువతులు, మహిళలు వేధింపులకు గురైతే 100కు కాల్ చేయాలని సూచించారు. SHARE IT
మహబూబ్ నగర్ జిల్లా నుంచి 57వ సీనియర్ నేషనల్ ఖోఖో ఛాంపియన్ షిప్-2024-25కు మంగలి శ్రీలక్ష్మి, కే.శ్వేత, ఎరుకలి శశిరేఖ ఎంపికయ్యారు. వీరు తెలంగాణ రాష్ట్రం ఖోఖో మహిళా జట్టు నుంచి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఒడిశాలో ఈనెల 31 నుంచి వచ్చేనెల 4 వరకు ఈ టోర్నీ జరగనుంది. దీంతో ఎంపికైన క్రీడాకారులకు ఆయా పాఠశాల ఉపాధ్యాయులు, ఉమ్మడి జిల్లా నేతలు, తదితరులు అభినందించారు. CONGRATULATIONS❤
వెనుకబడిన తరగతులకు న్యాయమైన ప్రాతినిధ్యం, రాజకీయ రిజర్వేషన్ల కల్పించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం బెంగళూర్లోనీ ప్రెస్ క్లబ్ ఆఫ్ బెంగళూర్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జనాభా ఆధారంగా లోక్ సభ సీట్ల పెంపు, దేశ సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కల్పిస్తుందన్నారు. జనాభా ఆధారంగా లోక్సభ సీట్ల పెంపు అన్యాయం మాత్రమే కాదు, సమాన ప్రాతినిధ్యం ప్రధాన సూత్రాలను కూడా దెబ్బతీస్తుందన్నారు.
❤జడ్చర్ల:నీటి సంపులో మహిళ మృతదేహం
❤రేపు కొడంగల్కు సీఎం రేవంత్ రెడ్డి రాక
❤కొనసాగుతున్న టెన్త్ పరీక్షలు
❤ఇఫ్తార్ విందు.. పాల్గొన్న నేతలు
❤ఘనంగా “షబ్ -ఏ -ఖదర్” వేడుకలు
❤అందరికీ రుణమాఫీ చేయండి:BJP
❤గుడ్ న్యూస్ ఉగాదికి సన్నబియ్యం
❤పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్
❤రంజాన్ వేళ..ఈద్గా వద్ద ఏర్పాట్లు
❤GWL:కాల్వకు నీళ్లు రాకపోతే చావే శరణ్యం
❤అమ్రాబాద్: తండ్రి మృతి పుట్టెడు దు:ఖంలో టెన్త్ ‘పరీక్ష’
Sorry, no posts matched your criteria.