Mahbubnagar

News April 12, 2026

MBNR: ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు.. ర్యాంక్ ఎంతంటే.!

image

ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదలయ్యాయి. మహబూబ్ నగర్ జిల్లాలో 8982 రెగ్యులర్ ఫస్టియర్ విద్యార్థులు పరీక్ష రాయగా 5586 మంది పాసయ్యారు. 62.19 శాతం రాగా, పాలమూరు జిల్లా స్టేట్‌లో 16వ స్థానంలో నిలిచింది. ఇక ఒకేషన్‌లో 1877 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 1244 మంది పాసయ్యారు. 66.28 శాతంతో స్టేట్‌లో 10వ స్థానంలో నిలిచింది.

News April 11, 2026

మహబూబ్‌నగర్: విద్యతోనే మహిళా సాధికారత: కలెక్టర్‌

image

సమాజంలో మహిళలు విద్య ద్వారానే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని కలెక్టర్‌ కుష్బూ గుప్తా పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో ఫూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఫూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. అణగారిన వర్గాల అభ్యున్నతికి, స్త్రీ విద్యకు ఫూలే చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు. కార్యక్రమంలో మేయర్‌ మమత, డి.మేయర్‌ సురేందర్‌, ముడా ఛైర్మన్‌ లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

News April 11, 2026

MBNR: భానుడి భగభగలు.. 41.1 డిగ్రీలు నమోదు

image

మహబూబ్‌నగర్ జిల్లాలో వేసవి ఎండలు ప్రచండ రూపం దాల్చుతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో జనం విలవిల్లాడుతున్నారు. గడిచిన 24 గంటల్లో చిన్నచింతకుంటలో అత్యధికంగా 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కోయిలకొండ (41.0), కౌకుంట్ల (40.9) ప్రాంతాల్లోనూ ఎండ తీవ్రత అధికంగా ఉంది. భూత్పూర్, మిడ్జిల్, మహమ్మదాబాద్ మండలాల్లో సగటున 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవడంతో రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి.

News April 10, 2026

మహబూబ్‌నగర్: రోడ్డు భద్రతపై వీడియో పోటీలు

image

రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు “Arrive Alive” పేరుతో వీడియో పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ జానకి తెలిపారు. గరిష్ఠంగా 3 నిమిషాల నిడివి గల వీడియోలను రూపొందించి, ఈ నెల 14లోపు ఎస్పీ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. ఉత్తమ వీడియోకు రూ.5,000 నగదు బహుమతి అందజేస్తామని, ప్రమాదాల నివారణే ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు.

News April 10, 2026

మహబూబ్‌నగర్: రోడ్డు భద్రతపై వీడియో పోటీలు

image

రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు “Arrive Alive” పేరుతో వీడియో పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ జానకి తెలిపారు. గరిష్ఠంగా 3 నిమిషాల నిడివి గల వీడియోలను రూపొందించి, ఈ నెల 14లోపు ఎస్పీ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. ఉత్తమ వీడియోకు రూ.5,000 నగదు బహుమతి అందజేస్తామని, ప్రమాదాల నివారణే ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు.

News April 10, 2026

MBNR: పెరుగుతున్న ఎండలు.. ప్రజల బెంబేలు

image

మహబూబ్ నగర్ జిల్లాలో వేసవి ఎండల తీవ్రత రోజుకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్‌లో 41.1 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. భూత్పూర్ మండలం కొత్త మొల్గర 40.7, కౌకుంట్ల 40.6, భూత్పూర్ 40.3, నవాబుపేట 45.2, చిన్న చింతకుంట 40.0, మూసాపేట మండలం జానంపేట 39.7, అడ్డాకుల, మహమ్మదాబాద్, దేవరకద్ర 39.6, మిడ్జిల్ మండలం దోనూరు, మహబూబ్ నగర్ గ్రామీణం 39.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.

News April 9, 2026

MBNR: రహదారి భద్రతపై రాష్ట్రస్థాయి సమీక్ష

image

రాష్ట్ర CS కె.రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి గురువారం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. “అర్రైవ్ అలైవ్” కార్యక్రమం అమలు, దాని సిద్ధతపై ఉన్నతాధికారులు దిశానిర్దేశం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి ఎస్పీ డి.జానకి ఈ సమావేశంలో పాల్గొన్నారు. రహదారి ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రజల్లో అవగాహన కల్పించే అంశాలపై చర్చించారు.

News April 9, 2026

సిరి వెంకటాపూర్‌లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

image

మహబూబ్‌నగర్ జిల్లాలో మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కోయిలకొండ మండలం సిరి వెంకటపూర్‌లో 41.1 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. నవాబుపేట 40.8, మహమ్మదాబాద్ 40.6, కౌకుంట్ల 40.5, చిన్న చింతకుంట 40.3, భూత్పూర్ 40.0, చిన్న చింతకుంట మండలం వడ్డేమాన్ 39.8, మిడ్జిల్ మండలం దోనూరు, మూసాపేట మండలం జానంపేట 39.6, మహబూబ్‌నగర్ అర్బన్ 39.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.

News April 8, 2026

MBNR: ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి: కలెక్టర్

image

విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా సూచించారు. మంగళవారం హన్వాడ, వేపూర్ గురుకుల బాలికల పాఠశాలలను ఆమె సందర్శించారు. పదో తరగతి పరీక్షలు జీవితంలో కీలకమైనవని, భయం వీడి ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని విద్యార్థినులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులకు పోషకాహారం అందించాలని, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు.

News April 8, 2026

MBNR: ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి: కలెక్టర్

image

విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా సూచించారు. మంగళవారం హన్వాడ, వేపూర్ గురుకుల బాలికల పాఠశాలలను ఆమె సందర్శించారు. పదో తరగతి పరీక్షలు జీవితంలో కీలకమైనవని, భయం వీడి ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని విద్యార్థినులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులకు పోషకాహారం అందించాలని, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు.