Mahbubnagar

News August 14, 2025

మత్తుకు బానిసలు కావొద్దు: ఎస్పీ జానకి

image

విద్యార్థులు చెడు వ్యసనాలు, మత్తుకు అడిక్ట్ కావొద్దని MBNR ఎస్పీ డి.జానకి సూచించారు. ధర్మాపూర్‌లోని బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ. చదువుకునే క్రమంలో విద్యార్థులు చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు. చెడు స్నేహాలు, వ్యసనాలతో విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని అన్నారు. సీఐ శ్రీనివాస్, ఏఎస్ఐ జయరాణి పాల్గొన్నారు.

News August 13, 2025

MBNR: దివ్యాంగుల ప్రజావాణికి 19 ఫిర్యాదులు

image

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని అర్బన్ తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన వృద్ధులు, దివ్యాంగుల ప్రజావాణికి 19 ఫిర్యాదులు వచ్చినట్టు కలెక్టర్ విజయేందిర బోయి వెల్లడించారు. వృద్ధులు, దివ్యాంగుల నుంచి వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని, ఎలాంటి నిర్లక్ష్యం వహించొద్దని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని జరీనా బేగం, తదితరులు పాల్గొన్నారు.

News August 13, 2025

MBNR : మహమ్మదాబాద్‌లో అత్యధిక వర్షపాతం నమోదు

image

MBNR జిల్లాలో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా మహమ్మదాబాద్ 14.3మి.మీ. వర్షపాతం రికార్డు అయింది. మహబూబ్ నగర్ అర్బన్, భూత్పూర్ మండలం కొత్త మొల్గర 7.0, హన్వాడ 6.8, కోయిలకొండ మండలం పారుపల్లి 6.0, భూత్పూర్ 5.0, అడ్డాకుల 4.5, , మిడ్జిల్ 4.3, నవాబుపేట 4.0, చిన్న చింతకుంట మండలం వడ్డేమాన్, బాలానగర్ 3.8, కౌకుంట్ల 3.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.

News August 12, 2025

MBNR: పోలీసులు కాంగ్రెస్ కు వంత పాడుతున్నారు: MP

image

రాష్ట్రంలో అధికార కాంగ్రెస్‌కి పోలీసులు వంత పడుతున్నారని ఎంపీ డీకే అరుణ మండిపడ్డారు. బీజేపీ స్టేట్ చీఫ్ రామచందర్ రావును మంగళవారం పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంపై ఆమె స్పందించారు. అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని ఖండించారు. హర్ ఘర్ తిరంగా దేశభక్తి కార్యక్రమంలో భాగంగా పెద్దమ్మ గుడిలో పూజలకు వెళుతుంటే అడ్డుకుంటారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ దురాహంకారం, దౌర్జన్యానికి ప్రత్యక్ష ఉదాహరణ అన్నారు.

News August 12, 2025

MBNR: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

image

రాబోయే మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావొద్దని ఎస్పీ జానకి హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాలు, కాజ్‌వేలను దాటవద్దని, ఉద్ధృతంగా ప్రవహించే నదులు, వాగులు, వంకల వైపు వెళ్లవద్దని సూచించారు. సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నించకూడదని, చేపల వేటకు వెళ్లకూడదని చెప్పారు. జిల్లాలోని పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

News August 12, 2025

చిన్న చింత కుంటలో అత్యధిక వర్షపాతం

image

మహబూబ్ నగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా చిన్నచింతకుంటలో 34.3 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది. జడ్చర్ల 23.3, నవాబుపేట 20.8, కౌకుంట్ల 20.3, మహమ్మదాబాద్, దేవరకద్ర 18.5, మహబూబ్‌నగర్ అర్బన్18.3, అడ్డాకుల 17.8, మూసాపేట మండలం జానంపేట, హన్వాడ 16.8, భూత్పూర్ 16.5, బాలానగర్ 7.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

News August 12, 2025

MBNR: GOVT బడుల్లో.. FREE ప్రైమరీ..!

image

ప్రభుత్వం పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులు (ఫ్రీ ప్రైమరీ) ప్రారంభించనుంది. ఈ మేరకు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 94 ఫ్రీ ప్రైమరీ పాఠశాలలు ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, స్నాక్స్ అందజేయనున్నారు. వచ్చే ఏడాది తరగతులు ప్రారంభించనున్నారు. ఇప్పటికే మొదటి విడత నిధులు మంజూరయ్యాయి.

News August 11, 2025

MBNR: ఫ్రిజ్‌లోని భోజనం పెడతారా: కలెక్టర్ ఆగ్రహం

image

విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని వేడివేడిగా అందించాలని పదేపదే హెచ్చరిస్తున్న పట్టించుకోకుండా ఫ్రిడ్జ్‌లో పెట్టిన భోజనాన్ని అందిస్తారంటూ కలెక్టర్ విజయేంద్ర బోయి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మెట్టుగంటలో ఉన్న ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మిగిలిపోయిన భోజనాన్ని ఇంకొకసారి విద్యార్థులకు వడ్డించినట్లయితే సహించదిలేదని హెచ్చరించారు.

News August 11, 2025

గ్రీవెన్స్ డే..13 ఫిర్యాదులు-MBNR SP

image

మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో 13 ఫిర్యాదులు వచ్చాయని జిల్లా ఎస్పీ డి.జానకి అన్నారు. ప్రతి ఫిర్యాదును పరిశీలించి, సంబంధిత పోలీస్ అధికారులతో ప్రత్యక్షంగా ఫోన్ ద్వారా మాట్లాడి.. తక్షణమే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. గ్రీవెన్స్ డే వేదికలో ప్రజలు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని, వేగంగా పరిష్కరించేందుకు పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు.

News August 11, 2025

సైబర్ క్రైమ్..1.07 కోట్ల రికవరీ- SI శ్రావణ్ కుమార్

image

సైబర్ క్రైమ్ వచ్చిన కేసులలో మొత్తం రూ.1.07Cr రికవరీ చేసినట్లు మహబూబ్ నగర్ క్రైమ్ ఎస్సై శ్రావణ్ కుమార్ తెలిపారు. సోమవారం ఆయన Way2Newsతో మాట్లాడుతూ.. జనవరి 2025 నుంచి 31-7-2025 వరకు మొత్తం 812 సైబర్ క్రైమ్ కేసులు వచ్చాయని, వాటిలో ఫైనాన్సియల్-627, నాన్ ఫైనాన్షియల్-185 కేసులు నమోదు అయ్యాయన్నారు. బాధితులు మొత్తం-4.49కోట్లు నష్టపోయారని, సైబర్ నేరగాళ్ల నుంచి 1.07Cr రికవరీ చేసినట్లు వెల్లడించారు.