India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జూరాల జలాశయంలోకి వస్తున్న వరద తగ్గింది. జలాశయంలోకి 67వేల క్యూసెక్కుల వరద చేరుతోంది. దిగువకు 10 గేట్లు ఎత్తి 41 వేలు, జలవిద్యుదుత్పత్తి ద్వారా 37 వేలు మొత్తం 78 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. జలాశయంలో నీటి నిల్వ 9.132 టీఎంసీల మేర ఉంది. మరో నాలుగు వేల క్యూసెక్కులు జూరాల కాల్వలకు, ఎత్తిపోతల పథకాలకు వినియోగించుకున్నట్లు జూరాల అధికారులు తెలిపారు.
కోర్టు ద్వారా బైల్ పొంది సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించలేని నిరుపేద ఖైదీలకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం రాష్ట్ర, జిల్లాస్థాయి సాధికార కమిటీలను ఏర్పాటు చేసిందని MBNR జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి తెలిపారు. ఇవాళ మొదటిసారి జిల్లా సాధికార కమిటీ నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. జిల్లా సాధికార కమిటీ నోడల్ అధికారిగా ప్రొహిబిషన్ అధికారిని నియమించాలని తీర్మానించినట్లు తెలిపారు.
✔మల్లికార్జున ఖర్గేను కలిసిన మంత్రి జూపల్లి ✔NGKL:వనపట్ల సమీపంలో కారు బోల్తా ✔జూరాల ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తివేత ✔అంబేడ్కర్ వర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశాలకు చివరి తేదీ 31 ✔బాల పురస్కార్ అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం ✔MROకు రెవెన్యూ రికవరీ యాక్ట్ పై అవగాహన ✔WNPT:కలెక్టరేట్ ముందు రైస్ మిల్లర్ల ఆందోళన ✔భూ సమస్యల పరిష్కారానికి నూతన ఆర్ఓఆర్ చట్టం: చిన్నారెడ్డి
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను రాష్ట్ర టూరిజం, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు. వారిరువురి మధ్య రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయాల గురించి, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి చర్చ జరిగినట్లు జూపల్లి మీడియోతో పేర్కొన్నారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం ఢిల్లీలోని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర షకావత్ క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో టూరిజం అభివృద్ధికి కావాల్సిన వనరులు పుష్కలంగా ఉన్నాయని, పర్యాటక అభివృద్ధికి చేయూతనివ్వాలని కేంద్ర మంత్రిని కోరారు. మంత్రి వెంట తెలంగాణ పర్యాటక శాఖ ముఖ్యకాదర్శి వాణిప్రసాద్, తదితరులు ఉన్నారు.
ప్రధానమంత్రి బాల పురస్కార్ అవార్డు కోసం ప్రతిభ గల బాల, బాలికల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ (ICDS) అధికారులు తెలిపారు. ధైర్య సాహసాలు ,క్రీడలు, పర్యావరణం కళలు, సైన్స్ అండ్ టెక్నాలజీ సేవా రంగాలలో ప్రావీణ్యం కలిగిన 5 నుంచి 18 ఏళ్ల వయసు గల బాల, బాలికలు ఆగస్టు 31 తేదీ వరకు http.s://awrds.gov.in వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు.
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఈ రోజు విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ రానున్నారు. గత పది రోజుల క్రితం చైనా వెళ్లిన ఎమ్మెల్యే పలు అంశాలపై అధ్యయనం చేశారు. విదేశీ పర్యటన ముగించుకొని వస్తున్న ఎమ్మెల్యే వంశీకృష్ణకు స్వాగతం పలికేందుకు నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
జూరాలకు వరద భారీగా పెరుగుతోంది. జలాశయంలోకి 90వేల క్యూసెక్కుల వరద చేరుతోంది. జలాశయం నుంచి జల విద్యుదుత్పత్తి 35వేల క్యూసెక్కులు, 16గేట్లు ఎత్తి 66వేల క్యూసెక్కులు మొత్తం 1.01లక్షల క్యూసెక్కుల వరదను దిగువకు వదులుతున్నారు. కర్ణాటకలోని ఆల్మట్టి జలాశయంలోకి 43వేల క్యూసెక్కుల వరద చేరుతోంది. నారాయణ్ పూర్ జలాశయంలోకి 30వేల క్యూసెక్కుల వరద చేరుతోందని అధికారులు తెలిపారు.
బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తిపై కేసు నమోదు అయిన ఘటన మహమ్మదాబాద్ మండల కేంద్రంలో శుక్రవారం జరిగింది. ఎస్సై శేఖర్ రెడ్డి తెలిపిన కథనం ప్రకారం.. గత నెల మైనర్ బాలికపై మండల కేంద్రంలో నివాసం ఉంటున్న రమేశ్ రెడ్డి అనే వ్యక్తి అత్యాచారం చేశారని బాలిక తల్లిదండ్రులు శుక్రవారం ఫిర్యాదు చేశారు. దీంతో అత్యాచారం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
డా.బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 2024-25 సంవత్సరానికి డిగ్రీ, పీజీ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైనట్లు విశ్వవిద్యాలయ ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ ఆచార్య ఇ.సుధారాణి పేర్కొన్నారు. ఆయా కోర్సుల్లో ప్రవేశానికి ఈనెల 31 చివరి తేదీ అని, అదనపు సమాచారం కోసం సమీప అధ్యయన కేంద్రాల్లో సంప్రదించాలని, www.braouonline.in,/ www.braou.ac.in వెబ్ సైట్ లో చూడాలన్నారు.
Sorry, no posts matched your criteria.