Mahbubnagar

News March 4, 2025

ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!!

image

✔రెండవ రోజు ముగిసిన రంజాన్ ఉపవాసం
✔సహార్: రేపు(మంగళవారం)-5:12
✔ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల డ్రంక్& డ్రైవ్
✔పెండింగ్ చలాన్లు చెల్లించండి: ఎస్సైలు
✔లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి:SPలు
✔ప్రజావాణి.. సమస్యలపై ఫోకస్
✔రేపు చలోమాల- చలో అలంపూర్
✔ఇంటర్మీడియట్ పరీక్షలపై ప్రత్యేకంగా నిఘా
✔పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యేలు
✔వీజీ ట్రోఫీకి ఎంపికైన పీయూ క్రీడాకారుడు

News March 4, 2025

మహబూబ్ నగర్ జిల్లా… నేటి ముఖ్యంశాలు

image

✓భర్త వేధింపులు భరించలేక దుందుభి వాగులో పడి మహిళా మృతి.
✓ఇసుక ట్రాక్టర్ పట్టివేత.. కేసు నమోదు
✓ప్రజావాణి దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి కలెక్టర్ విజయేంద్ర బోయి
✓మిడ్జిల్ మండలంలోని మంగళగడ్డ గ్రామ పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోకి వినతి పత్రం
✓జిల్లాలో మండుతున్న ఎండలు.. బయటికి రావాలంటే జంకుతున్న జనం.
✓అడ్డాకుల : కందూరు రామలింగేశ్వర స్వామి ఆవరణలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం.

News March 3, 2025

బాలానగర్: భార్యను అవమానపరిచిన భర్త.. చివరికి.!

image

ఓ మహిళ వాగులో దూకి మృతి చెందిన ఘటన బాలానగర్ మండలంలో సోమవారం జరిగింది. ఎస్ఐ లెనిన్ వివరాల ప్రకారం.. గుండెడ్ గ్రామానికి చెందిన లక్ష్మికి (38) ఫరూక్ నగర్ మండలం గంట్లవెల్లి గ్రామానికి చెందిన లింగమయ్యతో 17 ఏళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ఇద్దరు పిల్లలు. ఆదివారం పెద్ద మనుషుల సమక్షంలో భార్యను అవమానపరిచి నిందించాడు. అవమానం భరించలేక దుందుభి వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేశారు.

News March 3, 2025

MBNR: అరుణాచలానికి పాలమూరు నుంచి ప్రత్యేక బస్సులు.!

image

తమిళనాడు రాష్ట్రంలోని ప్రత్యేక పుణ్యక్షేత్రం అరుణాచలానికి మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం నుండి ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈనెల 12న మహబూబ్ నగర్ డిపో నుంచి బస్సు వెళ్లనున్నట్లు తెలిపారు. మార్చి 13 సా.6 గంటలకు అరుణాచలం చేరుకుంటుందన్నారు. మార్చి 14న అక్కడి నుంచి బయలుదేరి 15న ఉదయం మహబూబ్ నగర్ చేరుకుంటుందని అన్నారు. ప్రయాణికులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

News March 3, 2025

షాకింగ్: నల్లమలలో కార్చిచ్చు (PHOTO)

image

నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని రిజర్వు టైగర్ అటవీ ప్రాంతంలో కార్చిచ్చు సంభవించింది. దోమలపెంట సమీపంలో 10 కిలోమీటర్ల దూరంలో శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్లే రహదారి పక్కన వందలాది హెక్టార్లలో అడవి మొత్తం అగ్నికి ఆహుతైంది. ఎటు చూసినా మంటలు, పొగ కమ్మేసింది. ఈ ప్రమాదం ఎలా జరిగిందో వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

News March 2, 2025

వనపర్తిలో మిత్రుడు.. CMగా వచ్చాడు! (PHOTO)

image

CM అయ్యాక స్నేహితుడు మన మధ్యకు వస్తే గూస్‌బంప్స్ రావాల్సిందే. వనపర్తిలో అదే జరిగింది. 8th క్లాస్ నుంచి ఇంటర్ వరకు WNPలో చదివిన రేవంత్ రెడ్డి ఆదివారం CM హోదాలో జిల్లాకు వచ్చారు. ఆనాటి మిత్రులు గుర్తొచ్చి ఆదివారం ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. హంగు, ఆర్భాటం అన్నీ వదిలేసిన CM స్నేహితులతో కలిసిపోయారు. భోజనం చేశారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. స్నేహానికి మన CM ఇచ్చిన ప్రియారిటీకి హాట్సాఫ్.

News March 2, 2025

MBNR: చికిత్స పొందుతూ యువకుడి మృతి

image

రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్ప పొందుతూ ఓ యువకుడు మృతిచెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికులు వివరాలిలా.. కౌకుంట్ల మండలం రాజోలికి చెందిన శ్రీకాంత్(25), లింగేశ్‌లు స్కూటీపై వెళ్తూ టిప్పర్ ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీకాంత్ నిన్న మృతిచెందగా, లింగేశ్ పరిస్థితి విషమంగా ఉంది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News March 2, 2025

MBNR: ఫోన్ ఇవ్వలేదని మహిళ హత్య

image

గత నెల 26న జరిగిన మహిళహత్య కేసును పోలీసులు ఛేదించారు. వారు తెలిపిన వివరాలిలా.. మునిరంగస్వామి జాతర సందర్భంగా గతనెల 19న కొత్తమొల్గరకి చెందిన రంగమ్మకు భూత్పూర్‌కి చెందిన రాజుతో పరిచయమైంది. ఈక్రమంలో రాజు తన ఫోన్‌ను ఆమెకు ఇచ్చాడు. తిరిగి ఆ ఫోన్‌ని అడగటంతో ఆమె నిరాకరించింది. ఈనెల 26న ఆలయం వద్ద రాజు ఆమె తలపై బండరాళ్లతో దాడి చేసి పారిపోయాడు. ఫోన్ ఆధారంగా అతడిని పట్టుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు.

News March 2, 2025

మహబూబ్ నగర్ జిల్లా.. నేటి ముఖ్యంశాలు

image

✓మహబూబ్ నగర్ జిల్లాలో.. రంజాన్ నెల ఉపవాస దీక్షలు ప్రారంభం✓బాలానగర్ మండలం నందారంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం.✓దేవరకద్ర పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులకు గాయాలు. ✓మహబూబ్ నగర్ జిల్లాలో. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.✓ఈనెల 12 నుంచి 14 వరకు కందూర్ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. ✓మన్యంకొండలో పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి

News March 1, 2025

MBNR: యూడీఐడీ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోండి.!

image

సదరం గుర్తింపు కార్డు కోసం యుడీఐడీ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (SERP) సీఈఓ దివ్య దేవరాజన్ తెలిపారు. సదరం క్యాంపులు, ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డులు, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుపై జిల్లా కలెక్టర్లు, డిఆర్డిఓ, డిడబ్ల్యుఓ, డిసిహెచ్ఎస్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్లతో సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

error: Content is protected !!