Mahbubnagar

News September 25, 2024

అచ్చంపేట: రూ.1.5కోట్లు కాజేసిన బ్యాంక్ ఉద్యోగి అరెస్ట్

image

అచ్చంపేటలోని ఎస్బీఐ బ్యాంకులో ఉద్యోగి కిరణ్ కుమార్ రెడ్డి పలువురు ఖాతాదారుల నుంచి వారికి తెలియకుండా రూ.1,49,50,000, ఇతరులకు బదిలీ చేసి అక్రమాలకు పాల్పడ్డాడు. ఖాతాదారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఉద్యోగిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. అనంతరం న్యాయమూర్తి నిందితుడికి రిమాండ్ విధించినట్లు అచ్చంపేట సీఐ రవీందర్ తెలిపారు.

News September 25, 2024

కార్టూన్ సామాన్యులను ప్రభావితం చేయగల కళ: మంత్రి జూపల్లి

image

రవీంద్ర భారతిలో తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో స్పేస్ టోన్ పేరిట కార్టూన్ నెట్ మిషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. మూడు అక్షరాల కార్టూన్ 30 అర్థాలను తెలియజేస్తుందని చెప్పారు. కార్టూన్ సామాన్యులను ప్రభావితం చేయగల కళ అని పేర్కొన్నారు. ఇస్రో శాస్త్రవేత్త సోమనాథ్, హరికృష్ణ, కార్టూనిస్టులు వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

News September 25, 2024

ఉమ్మడి జిల్లాలో నేడు మంత్రుల పర్యటన

image

పాలమూరులోని సాగునీటి ప్రాజెక్టుల స్థితిగతులు, పనుల పురోగతిపై రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ ఈనెల 25న పరిశీలించనున్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నార్లపూర్, వట్టెం, ఉదండాపూర్ జలాశయాలను సందర్శించనున్నారు. అనంతరం నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులపై నీటి పారుదలశాఖతోపాటు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

News September 24, 2024

NGKL: ఉరేసుకొని యువకుడి సూసైడ్.. మృతిపై అనుమానాలు

image

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం సమీపంలోని నాగనూల్ రోడ్డులో ఉన్న బీసీ కాలనీలో చిరు వ్యాపారి పూసల సాయి(25) మంగళవారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే సాయి మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో చిరు వ్యాపారం నిర్వహించే సాయి ఆత్మహత్య పట్టణంలో కలకలం రేపింది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News September 24, 2024

పాలమూరు- రంగారెడ్డి పథకాన్ని పూర్తి చేయాలి: మాజీ మంత్రి

image

ప్రభుత్వం పంతాలు, పట్టింపులకు పోకుండా పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని వెంటనే పూర్తి చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 90 శాతం పనులు కేసీఆర్ హయాంలోని పూర్తి చేయడం జరిగిందని గుర్తు చేశారు. వలసల జిల్లా అయిన పాలమూరు పచ్చబడే విధంగా చేసిన ఘనత కేసిఆర్ కే దక్కుతుందని అన్నారు.

News September 24, 2024

MBNR: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదరుచూపులు !

image

ఇటీవల కురిసిన వర్షలకు పేద మధ్యతరగతి కుటుంబాల్లో గుబులు మొదలవుతుంది. ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ అధికారులు గుర్తించిన లెక్కల ప్రకారం 46,700పైగా శిథిలావస్థకు చేరిన గృహాలు, భవనాలు ఉన్నాయని, ఈ ప్రభుత్వం హయాంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం జిల్లా వ్యాప్తంగా 2.71లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకాన్ని త్వరగా అమలు చేసి, పేద మధ్యతరగతి వారిని ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

News September 24, 2024

మళ్లీ తెరుచుకున్న సరళసాగర్ సైఫర్లు

image

వనపర్తి జిల్లాలోని సరళ సాగర్ ప్రాజెక్టు గేట్లు మళ్లీ తెచ్చుకున్నాయి. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షానికి ప్రాజెక్టు నిండడంతో గాలి పీడనం ద్వారా.. 3 సైఫర్లు తెరుచుకున్నాయి. దీంతో ప్రాజెక్టులో ఉన్న వరద నీరు గేట్ల ద్వారా దిగువ ప్రాంతానికి వరద నీరు పారుతుంది. దీంతో ప్రయాణికుల సందడిగా మారింది. మదనాపూర్ రైల్వే గేట్ సమీపంలో మారేడు వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

News September 24, 2024

MBNR: విదేశాలకు పాలమూరు మామిడి..!

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో పండించే మామిడిని విదేశాలకు ఎగుమతి చేసేందుకు ఉద్యాన శాఖ కసరత్తు చేస్తోంది. ప్రయోగాత్మకంగా రానున్న వేసవిలో 50 నుంచి 100 టన్నుల మామిడిని విదేశాలకు పంపాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకు ప్రతి జిల్లాలో 1000 ఎకరాల్లో క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఎగుమతికి జాతీయ ఉద్యాన బోర్డు రూ.165 కోట్ల ఆర్ధిక సహాయాన్ని అందజేస్తుందని ఉద్యాన శాఖ సహాయ సంచాలకుడు నరసయ్య తెలిపారు.

News September 24, 2024

జిల్లా కేంద్రాల్లో డీసీసీ కార్యాలయాలకు స్థలాలు కేటాయింపు !

image

డిస్టిక్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయాల నిర్మాణం కోసం స్థలాలు కేటాయించాలని జిల్లాల వారీగా ఆయా జిల్లా కలెక్టర్లకు దరఖాస్తులు చేయాలని డీసీసీ కమిటీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. దీంతో జోగులాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట, నాగర్కర్నూల్ జిల్లాల్లో డీసీసీ అధ్యక్ష, కార్యదర్శులు.. కలెక్టర్లకు దరఖాస్తులు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీంతో త్వరలో సొంతంగా డీసీసీ కార్యాలయాలు ఉండనున్నాయి.

News September 24, 2024

అలంపూర్‌లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు.. డీజీపీకి ఆహ్వానం

image

రాష్ట్రంలో ఏకైక శక్తిపీఠమైన అలంపురం జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయంలో అక్టోబర్ 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరిగే దేవి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలకు డీజీపీ జితేందర్‌కు ఆహ్వానం అందించారు. మంగళవారం డీజీపీ కార్యాలయంలో డీజీపీకి ఆలయ ఈవో పురేందర్ కుమార్, ఆలయ ప్రధాన అర్చకులు ఆనంద్ శర్మ దేవస్థానం తరఫున ఆహ్వానం అందజేసినట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా డీజీపికి తీర్థ ప్రసాదాలు అందజేసి సన్మానించారు.