Medak

News August 18, 2024

KTRకు నాలెడ్జ్ లేదు.. హరీశ్‌రావువి చిల్లర మాటలు: కోదండరెడ్డి

image

రైతులకు రుణమాఫీ చేయడం KTR, హరీశ్‌‌రావుకు ఇష్టం లేదా? అని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు, ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి ప్రశ్నించారు. HYD గాంధీభవన్‌లో శనివారం ఆయన మాట్లాడారు. KTRకు రాజకీయ నాలెడ్జ్ లేక ప్రజలను రెచ్చగొడుతున్నారని, హరీశ్‌రావు సీనియరై కూడా చిల్లరగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రైతు రుణాలపై బ్యాంకుల నుంచి వివరాలు తెప్పించుకున్నామని, రుణమాఫీ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందన్నారు.

News August 18, 2024

మెదక్: ఎవరు నెగ్గుతారో..?

image

ఆగస్టు 15 లోపు రైతులకు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న హరీశ్ రావు మాట నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం రుణమాఫీ చేశాం హరీశ్ రావు రాజీనామా సవాల్ ఏమైందని గుర్తు చేశారు. మరోపక్క హరీశ్ రావు రూ.2 లక్షల దాకా రుణమాఫీ చేస్తే 22 లక్షల మంది రైతులే ఉంటారా. ? రూ.17,869 కోట్లే అవుతాయా? రుణమాఫీ అబద్ధమని తిప్పి కొట్టారు. ఇద్దరిలో ఎవరు నెగ్గుతారో ఎవరు తగ్గుతారో?

News August 18, 2024

MDK: హరీశ్‌రావు నాటకాలాడుతున్నారు: కాంగ్రెస్ ఎంపీ

image

‘ఆగస్టు 15లోగా రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్నాం.. సవాల్ విసిరిన హరీశ్‌రావు రాజీనామా చేయమంటే నాటకాలాడుతున్నారు’ అని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన HYD గాంధీభవన్‌లో మాట్లాడారు. గత BRS సర్కార్ రూ.లక్ష రుణాన్ని విడతల వారీగా మాఫీ చేస్తే బ్యాంకు వడ్డీలకూ సరిపోలేదని విమర్శించారు. ఇకనైనా హరీశ్ రావు నాటకాలు ఆపాలన్నారు.

News August 18, 2024

సిద్దిపేట: పిల్లలతో సహా తల్లి సూసైడ్?

image

చెరువులో తల్లీకూతుళ్ల మృతదేహాలు లభ్యమైన ఘటన మేడ్చల్ జిల్లాలో జరిగింది. సిద్దిపేట జిల్లా ములుగు(M)కి చెందిన భానుప్రియ కుటుంబ కలహాలతో శనివారం ఉదయం పిల్లలతో ఇంటి నుంచి బయటికి వెళ్లింది. కాగా, నిన్న రాత్రి శామీర్‌పేట చెరువులో వేదాంశ్(5), భానుప్రియ మృతదేహాలు లభ్యమయ్యాయి. కుమారుడి మృతదేహం కోసం గాలిస్తున్నారు. పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.

News August 18, 2024

మెదక్: కాంగ్రెస్ టార్గెట్ ఆ ఇద్దరేనా..?

image

తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్, హరీశ్‌ రావు అధికార కాంగ్రెస్‌కు కంట్లో నలుసులా మారారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైలెంట్‌గా ఉండిపోవడంతో కేటీఆర్, హరీశ్‌ రావును కట్టడి చేస్తే చాలు.. కాంగ్రెస్‌ పార్టీకి ఎదురే ఉండదని భావిస్తున్నారు. అందుకే మిగిలిన నేతలను పక్కనపెట్టి ఇద్దరిని టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్లడమే సర్కార్ వ్యూహంగా తెలుస్తోంది. ఇద్దరిని టార్గెట్ చేయాలని కేడర్‌కు సందేశం పంపారని టాక్ నడుస్తోంది.

News August 18, 2024

ఓయూలో పరీక్ష ఫీజు స్వీకరణ గడువు పొడిగింపు

image

ఓయూ పరిధిలోని వివిధ పీజీ కోర్సుల వన్ టైం ఛాన్స్ పరీక్ష ఫీజు స్వీకరణ గడువును పొడిగించినట్లు అధికారులు తెలిపారు. అన్ని పీజీ కోర్సుల బ్యాక్‌లాగ్ పరీక్షా ఫీజును ఈనెల 28వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని సూచించారు. రూ.500 అపరాధ రుసుముతో వచ్చే నెల 4వ తేదీలోగా చెల్లించవచ్చని చెప్పారు. ఈ పరీక్షలకు సాధారణ పరీక్ష ఫీజుతో పాటు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

News August 18, 2024

పోడు భూములపై జిల్లా కలెక్టర్‌లతో సమీక్ష

image

హైదరాబాదులోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ సచివాలయం నుంచి రాష్ట్ర అటవీ, పర్యావరణ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి అనసూయ సీతక్కతో కలిసి పోడు భూములపై జిల్లా కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

News August 17, 2024

ఓయూలో ఎమ్మెస్సీ డేటా సైన్స్ పరీక్షా తేదీల ఖరారు

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎమ్మెస్సీ డేటా సైన్స్ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సు రెండో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను వచ్చే నెల 4వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.

News August 17, 2024

సిద్దిపేటలో పొలిటికల్ వార్.. బీఆర్ఎస్ Vs కాంగ్రెస్

image

సిద్దిపేటలో రాజకీయం హీటెక్కింది. 2 రోజులుగా BRS, కాంగ్రెస్ మధ్య రాజకీయ రగడ సాగుతోంది. రూ.2లక్షల రుణమాఫీతో హరీశ్ రావు రాజీనామా చేయాలని పోస్టర్ల ఏర్పాటుతో శుక్రవారం రాత్రి హైడ్రామా సాగింది. MLA క్యాంప్ ఆఫీసుపై దాడిని నిరసిస్తూ నేడు BRS నేతలు నిరసన ర్యాలీ చేపట్టగా.. హరీశ్ రావు రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకులు ర్యాలీ తీశారు. దీంతో ఉద్రిత్త పరిస్థితి నెలకొంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

News August 17, 2024

మెదక్: రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలు ప్రారంభం

image

మెదక్‌లోని ఇందిరాగాంధీ స్టేడియంలో 10వ తెలంగాణ స్టేట్ అండర్-23 అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్- 2024ను రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి ప్రారంభించారు. రెండు రోజులపాటు మూడు విభాగాల్లో ఈ పోటీలు జరగన్నాయి. ఈ సందర్బంగా విజేతలకు పథకాలు అందజేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వెంకటరమణ, మధుసూదన్, శివశంకరరావు, అధ్యక్షులు జుబేర్, మహేందర్ రెడ్డి పాల్గొన్నారు