Medak

News March 18, 2026

తునికి కృషి విజ్ఞాన కేంద్రంలో నేడు కిసాన్ మేళా

image

కౌడిపల్లి మండలం తునికి కృషి విజ్ఞాన కేంద్రంలో బుధవారం ‘కిసాన్ మేళా-2026’ నిర్వహిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి స్వప్న జాదవ్ తెలిపారు. సుమారు వెయ్యి మంది రైతులతో నిర్వహించే ఈ మేళాలో ఆధునిక యంత్రాల ప్రదర్శన, శాస్త్రవేత్తలతో ప్రత్యక్ష చర్చలు, సరికొత్త సాగు సాంకేతికతపై అవగాహన కల్పిస్తారు. ప్రభుత్వ పథకాలపై సమాచారం అందించనున్న ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News March 17, 2026

మెదక్: మెజిస్ట్రేట్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

మెదక్ జిల్లా కోర్టులో ఖాళీగా ఉన్న రెండు స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్(సెకండ్ క్లాస్) పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా న్యాయమూర్తి నీలిమ తెలిపారు. రిటైర్డ్ లేదా రాజీనామా చేసిన జ్యుడీషియల్ అధికారులు దీనికి అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఈనెల 31వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు జిల్లా కోర్టు కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

News March 17, 2026

మెదక్: పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

image

మెదక్ జిల్లా రేగోడ్ మండలంలో విద్యార్థినిపై లైంగిక దాడి చేసిన కేసులో ఫాస్ట్ ట్రాక్ పోక్సో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో పాఠశాలలో అటెండర్‌గా పనిచేసిన సారా జైపాల్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2019లో జరిగిన ఈ ఘటనలో నేరం రుజువు కావడంతో నిందితుడికి శిక్షతో పాటు బాధితురాలికి రూ.1 లక్ష పరిహారం చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.

News March 17, 2026

RMPT: ఖేలో ఇండియా ఉషు లీగ్‌లో గోల్డ్ మెడల్

image

నిర్మల్ జిల్లా బైంసాలో జరిగిన ‘అశ్మిత ఖేలో ఇండియా ఉషు లీగ్’ పోటీల్లో రామాయంపేటకు చెందిన జమాల్‌పూర్ హీనా మాధురి గోల్డ్ మెడల్ సాధించింది. సీనియర్ 75 కేజీల విభాగంలో ఆమె ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా ఉషు సంఘం ప్రతినిధులు, కోచ్ సాయికృష్ణ ఆమెను అభినందించారు. తన ప్రతిభను ప్రోత్సహించిన తల్లిదండ్రులు సుశీల-మల్లేశంకు మాధురి కృతజ్ఞతలు తెలిపారు.

News March 16, 2026

అంగన్‌వాడీల అరెస్టులు దుర్మార్గం: సీఐటీయూ

image

అంగన్‌వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం వారిని అక్రమ అరెస్టులకు పాల్పడటంపై సీఐటీయూ జిల్లా కార్యదర్శి మల్లేశం మండిపడ్డారు. సోమవారం ఇందిరా పార్కు వద్ద ధర్నాకు వెళ్తున్న అంగన్‌వాడీలను దారిలోనే అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీ వేదికగా సమస్యలపై చర్చించి, వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హక్కుల కోసం పోరాడుతుంటే అణచివేయడం సరికాదన్నారు.

News March 16, 2026

మెదక్: నేటి ‘ప్రజావాణి’ వాయిదా

image

మెదక్ జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. జనాభా గణన–2027 విధుల్లో అధికారులు నిమగ్నమైనందున నేడు కలెక్టరేట్‌తో పాటు మండల స్థాయి కార్యాలయాల్లోనూ ఈ కార్యక్రమం ఉండదు. జిల్లా ప్రజలు ఈ మార్పును గమనించి అధికారులకు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

News March 16, 2026

మెదక్: నేటి ‘ప్రజావాణి’ వాయిదా

image

మెదక్ జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. జనాభా గణన–2027 విధుల్లో అధికారులు నిమగ్నమైనందున నేడు కలెక్టరేట్‌తో పాటు మండల స్థాయి కార్యాలయాల్లోనూ ఈ కార్యక్రమం ఉండదు. జిల్లా ప్రజలు ఈ మార్పును గమనించి అధికారులకు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

News March 16, 2026

మెదక్: నేటి ‘ప్రజావాణి’ వాయిదా

image

మెదక్ జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. జనాభా గణన–2027 విధుల్లో అధికారులు నిమగ్నమైనందున నేడు కలెక్టరేట్‌తో పాటు మండల స్థాయి కార్యాలయాల్లోనూ ఈ కార్యక్రమం ఉండదు. జిల్లా ప్రజలు ఈ మార్పును గమనించి అధికారులకు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

News March 16, 2026

మెదక్: నేటి ‘ప్రజావాణి’ వాయిదా

image

మెదక్ జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. జనాభా గణన–2027 విధుల్లో అధికారులు నిమగ్నమైనందున నేడు కలెక్టరేట్‌తో పాటు మండల స్థాయి కార్యాలయాల్లోనూ ఈ కార్యక్రమం ఉండదు. జిల్లా ప్రజలు ఈ మార్పును గమనించి అధికారులకు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

News March 16, 2026

మెదక్: నేటి ‘ప్రజావాణి’ వాయిదా

image

మెదక్ జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. జనాభా గణన–2027 విధుల్లో అధికారులు నిమగ్నమైనందున నేడు కలెక్టరేట్‌తో పాటు మండల స్థాయి కార్యాలయాల్లోనూ ఈ కార్యక్రమం ఉండదు. జిల్లా ప్రజలు ఈ మార్పును గమనించి అధికారులకు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.