Medak

News August 17, 2024

మెదక్: ప్రేమ వ్యవహారం.. యువకుడి సూసైడ్

image

ప్రేమ వ్యవహారంతో మనస్తాపానికి గురై యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. SI శ్రీనివాస్ రెడ్డి వివరాలు.. నిజాంపేటకు చెందిన భాను ప్రసాద్(26)కి వివాహం కాగా మరో అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడిపాడు. విషయం తెలియడంతో పుట్టింటికి వెళ్లిన భార్య నిన్న తిరిగి వచ్చింది. ఈ క్రమంలో ప్రియురాలి ఒత్తిడి చేయగా.. శుక్రవారం రాత్రి భాను ఇంట్లో సూసైడ్ చేసుకున్నాడు. ఈ మేరకు మృతుడి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు.

News August 17, 2024

వైద్యులు, నర్సుల భద్రతకు కట్టుబడి ఉన్నాం: మంత్రి దామోదర్

image

ప్రైవేటు ఆసుపత్రుల పిలుపు నేపథ్యంలో రాష్ట్రంలో ప్రజలకు వైద్య సేవల్లో అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు, నర్సులు, సిబ్బంది భద్రతపై శుక్రవారం ఉన్నతాధికారులు, ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ లో చర్చించారు.

News August 17, 2024

సంగారెడ్డి: ఐటీఐలో ప్రవేశాలకు నేడు ఆఖరు

image

ఐటీఐ కళాశాలల్లో ప్రవేశాల కోసం నేటితో గడువు ముగియనుందని కన్వీనర్ రాజేశ్వర్ రావు తెలిపారు. ఆసక్తిగల వారు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి మూడో ఫేజ్ అడ్మిషన్ల కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.

News August 16, 2024

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

image

నారాయణఖేడ్ మండలం రుద్రారం గ్రామ శివారులో సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. నలుగురు గాయపడ్డారు. మెదక్ జిల్లా రేగోడుకు చెందిన మహేష్ (20), నవీన్, సాయికిరణ్‌లతో కలిసి ద్విచక్ర వాహనంపై డిఫార్మసీ కోర్సుకు దరఖాస్తు చేసేందుకు వెళ్తున్నారు. టి. లింగంపల్లికి చెందిన సయ్యద్, రెహమాన్ ద్విచక్ర వాహనంపై ఎదురుగా వస్తుండగా ఢీకొన్నాయి. ఆసుపత్రికి తరలించగా మహేష్ మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు.

News August 16, 2024

HYD: డిగ్రీ ఫలితాల రివాల్యుయేషన్‌కు దరఖాస్తుల ఆహ్వానం

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ డిగ్రీ కోర్సుల పరీక్ష ఫలితాల రివాల్యుయేషన్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. డిగ్రీ కోర్సుల 2,4,6 సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్, వన్ టైం ఛాన్స్ పరీక్ష ఫలితాల రివాల్యుయేషన్‌కు ఒక్కో పేపర్‌కు రూ.500 చొప్పున చెల్లించి ఈనెల 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. వివరాలకు ఓయూ అధికారిక వెబ్‌సైట్ చూడాలన్నారు.

News August 16, 2024

మెదక్: ఎన్ఎంఎంఎస్ దరఖాస్తుకు సెప్టెంబర్-11 వరకు గడువు

image

పేద విద్యార్థులకు ప్రతిభా పరీక్ష ఎన్ఎంఎంఎస్ రాత పరీక్ష విధానంలో జాతీయ ఉపకార వేతనాలు అందిస్తోంది. ఉపకార వేతనాలు పొందడానికి 8వతరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. విద్యార్థులు bsc.telangana.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. నకలు ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా జిల్లా విద్యాశాఖ అధికారులకు పంపించాలి. ఎంపికైన విద్యార్థులకు 9-12వ తరగతి వరకు ఏటా12 వేల చొప్పున 48వేల ఉపకారవేతనం అందుతాయి.

News August 16, 2024

నూతన ఎమ్మెల్సీలకు మంత్రి పొన్నం అభినందనలు

image

శాసన మండలిలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆ కార్యక్రమంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఎమ్మెల్సీలు కోదండరాం, అమీర్ అలీఖాన్ లకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మంత్రి పొంగిలేటి, తదితరులు పాల్గొన్నారు.

News August 16, 2024

SRD: ఐఐటీహెచ్‌లో 18న ఫ్యూచర్ ఇన్వెంటరీ ఫెయిర్

image

కంది మండల కేంద్రంలోని ఐఐటీహెచ్‌లో 18న ఫ్యూచర్ ఇన్వెంటరీ ఫెయిర్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఐఐటీహెచ్ అధికారులు శనివారం తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో 8 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులు సాంకేతిక పురోగతి, సృజనాత్మకత వనరుల వంటి విభిన్న ప్రాజెక్టులను, సరికొత్త ఆలోచనలతో కూడిన ఆవిష్కరణలు ప్రదర్శించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

News August 16, 2024

BREAKING: MDK: హరీశ్‌రావుపై ఫ్లెక్సీల కలకలం

image

HYDలో హరీశ్ రావుపై ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. రాత్రికి రాత్రే మల్కాజిగిరి మాజీMLA మైనంపల్లి హనుమంతరావు అభిమానుల పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి హరీశ్‌రావు రాజీనామాకు డిమాండ్ చేశారు. ‘దమ్ముంటే రాజీనామ్ చెయ్.. రుణమాఫీ అయిపోయే..నీ రాజీనామా ఏడబోయే.. అగ్గిపెట్ట హరీశ్ రావు’ అని రాసి ఉన్న ఫ్లెక్సీలను సికింద్రాబాద్, ప్యాట్నీ, ప్యారడైజ్, రసూల్‌పుర, బేగంపేట్, పంజాగుట్ట సహా పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు.

News August 16, 2024

ఉమ్మడి మెదక్‌లో 53,479 మంది రైతులకు లబ్ధి

image

మూడో విడత రుణమాఫీ(రూ.1.5 నుంచి 2 లక్షలు)ని సీఎం రేవంత్ రెడ్డి గురువారం ప్రారంభించారు. దీంతో ఉమ్మడి జిల్లాలో  మెదక్ జిల్లాలో 53,479 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటికే 2 విడుతల రుణమాఫీ చేసిన ప్రభుత్వం తాజాగా 3వ విడత నిధులు విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాలో 53,479 మంది రైతులకు రూ. 710.22 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయినట్లు సమాచారం.