Medak

News September 25, 2024

సంగారెడ్డి: MBBS ఫస్ట్ ఇయర్‌లో 98.66% ఉత్తీర్ణత

image

సంగారెడ్డిలోని ప్రభుత్వం మెడికల్ కళాశాల ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరంలో 98.66% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మంగళవారం సాయంత్రం విడుదల చేసిన ఫలితాల్లో 145 మంది ఉత్తీర్ణత సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుధా మాధురి తెలిపారు. ఇందులో నలుగురు డిస్టింక్షన్‌లో సాధించగా, 108 మంది ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైనట్లు చెప్పారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను అభినందించారు.

News September 25, 2024

సాఫ్ట్ బాల్ పోటీలు.. మెదక్ జిల్లా బాలుర జట్టుకు గోల్డ్ మెడల్

image

సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన 10వ తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ సాఫ్ట్ బాల్ ఛాంపియన్ షిప్ పోటీల్లో మెదక్ జిల్లా బాలుర జట్టు పాల్గొన్నారు. కాగా, పోటీలో బంగారు పతకం సాధించినట్లు అసోసియేషన్ అధ్యక్షుడు కొడిప్యాక నారాయణగుప్తా పేర్కొన్నారు. పోటీల్లో ఆది నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన జట్టు ఫైనల్ పోటీల్లో నిజామాబాద్ జట్టుతో హోరాహోరీ తలపడి 5 – 3 స్కోర్‌తో విజయం సాధించినట్లు తెలిపారు.

News September 25, 2024

లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి: జిల్లా జడ్జి

image

జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ఈనెల 28న నిర్వహిస్తున్నట్లు సంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర మంగళవారం తెలిపారు. సివిల్, కుటుంబ తగాదాలు, క్రిమినల్ కాంపౌండబుల్, వాహన నష్టపరిహారం, చిట్ ఫండ్, ఆస్తి తగాదాలు, బ్యాంకు రికవరీ వంటి కేసులు పరిష్కరించుకోవచ్చని చెప్పారు. కేసులు రాజీ చేసుకొని సత్వర న్యాయం పొందాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.

News September 25, 2024

అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి: రాహుల్ రాజ్

image

ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందజేసేందుకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది సమయపాలన తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. ప్రతి శాఖకు సంబంధించిన ఫైలు ఈ- ఆఫీస్ ద్వారానే పరిష్కరించడం జరుగుతుందన్నారు. అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలంటే అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు.

News September 25, 2024

జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ చూపాలి: DEO

image

జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో విద్యార్థులు ప్రతిభ చూపాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు అన్నారు. పటాన్ చెరులోని మైత్రి మైదానంలో జిల్లా స్థాయి క్రీడా పోటీలను రెండో రోజు మంగళవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 28 వరకు జిల్లా స్థాయి క్రీడలు జరుగుతాయని చెప్పారు. కార్యక్రమంలో ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి అమూల్యమ్మ పాల్గొన్నారు.

News September 25, 2024

ఓటరు జాబితా పకడ్బందీగా ఉండాలి: కలెక్టర్

image

ఓటరు జాబితా సవరణ ప్రక్రియను కట్టుదిట్టంగా చేపడుతూ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. సంగారెడ్డి క్యాంపు కార్యాలయంలో అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఇంటింటి సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని చెప్పారు. పోలింగ్ కేంద్రం కొనసాగుతున్న ప్రదేశాన్ని తెలిపేలా ఫోటోలను యాప్ లో అప్ లోడ్ చేయాలని బీఎల్ఓలకు సూచించారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.

News September 25, 2024

తత్కాల్ ద్వారా ఓపెన్ పరీక్ష ఫీజు చెల్లింపునకు అవకాశం: డీఈవో

image

అక్టోబర్ 3 నుంచి జరిగే ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ పరీక్ష ఫీజు తత్కాల్ విధానంలో ఈనెల 25, 26న చెల్లించే అవకాశం కల్పించినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. ఒక్కో సబ్జెక్టుకు పరీక్ష ఫీజుతోపాటు పదవ తరగతికి అదనంగా 500, ఇంటర్ కు అదనంగా వెయ్యి రూపాయలు చెల్లించాలని చెప్పారు. పరీక్ష ఫీజు మీ సేవలో మాత్రమే చెల్లించాలని పేర్కొన్నారు.

News September 24, 2024

ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటు నమోదు చేసుకోండి: కలెక్టర్ క్రాంతి

image

ఉపాధ్యాయ, పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అర్హులైన వారు ఈనెల 30 నుంచి నవంబర్ 6వ తేదీ వరకు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మంగళవారం తెలిపారు. గతంలో ఓటు వేసిన వారు కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఆన్ లైన్, ఏఈఆర్ఓ నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. పట్టభద్రుల ఓటర్లు ఫారం నంబర్- 18, ఉపాధ్యాయ ఓటర్లు ఫారం నంబర్- 19లో దరఖాస్తు చేయాలని తెలిపారు.

News September 24, 2024

పారిశ్రామికవేత్తలు పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలి: మంత్రి పొన్నం

image

హుస్నాబాద్ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందేలా అక్కన్నపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేయనున్న TGIIC ఇండస్ట్రియల్ పార్కులో ఉత్సాహవంతులైన పారిశ్రామికవేత్తలు పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. మంగళవారం సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో TGIIC అధికారులు, పారిశ్రామికవేత్తలు, సంబంధిత శాఖల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు.

News September 24, 2024

మెదక్: ఫుట్ బాల్ జట్ల ఎంపిక

image

ఫుట్బాల్ జట్ల ఎంపికను మెదక్ వెస్లీ గ్రౌండ్ లో నిర్వహించారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి రమేష్ గంగాల ఆధ్వర్యంలో రామాయంపేట పిడి నాగరాజు, ఎంబి పూర్ పీడి రూపేందర్ ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్లు శ్రీనివాసరావు, మాధవరెడ్డి, వినోద్ కుమార్, సుజాత కుమారి పాల్గొన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి, సిద్దిపేట క్రీడాకారులు పాల్గొన్నారు.