Medak

News August 14, 2024

మెదక్: ఇంటింట కొనసాగుతున్న జ్వర సర్వే..

image

సీజనల్ వ్యాధుల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని ఆస్పత్రులకు రోగుల తాకిడి పెరిగింది. దీంతో వ్యాధులను అరికట్టేందుకు వైద్యాశాఖ జ్వర సర్వేను ముమ్మరం చేసింది. జ్వరం వచ్చినట్లు గుర్తిస్తే వారి ఇంటికే వెళ్లి మందులిస్తున్నారు. మెదక్ జిల్లాలో 73రోజుల్లో 34,351 మందికి టెస్టులు చేస్తే 1,345 మంది జ్వరంలో బాధపడుతున్నట్లు తేలింది. మందులు వాడినా జ్వరం తగ్గకుంటే వెంటనే రక్త పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు.

News August 13, 2024

ఇసుక మడుగులో ఈతకు వెళ్లి యువకుడు మృతి

image

పెద్ద శంకరంపేట ఇందిరా కాలనీకి చెందిన మహమ్మద్ ఇలియాస్ (30) నీట మునిగి మృతి చెందినట్లు ఎస్సై శంకర్ తెలిపారు. లారీ డ్రైవర్‌గా పని చేస్తూ జీవనం సాగించే ఇలియాస్ స్నేహితులతో కలిసి నిన్న ఇసుక మడుగు వద్ద మద్యం సేవించాడు. ఇసుక మడుగులో ఈత కొట్టడానికి వెళ్లి నీట మునిగిపోయాడు. రాత్రి ఇంటికి రాకపోవడంతో ఈరోజు ఇసుక మడుగులో గాలింపు చేపట్టి శవాన్ని బయటకు తీశారు.

News August 13, 2024

మహిళ కడుపులో 4.50 కిలోల కణితి తొలగింపు

image

రామాయంపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మంగళవారం అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించారు. కామారెడ్డి జిల్లా ఉప్పరపల్లి గ్రామానికి చెందిన ఎల్లవ్వ అనే మహిళ కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతోంది. డాక్టర్ హేమ రాజ్ సింగ్ ఈరోజు ఆ మహిళకు ఆపరేషన్ నిర్వహించి కడుపులో ఉన్న నాలుగున్నర కిలోల గడ్డ తొలగించారు. దీంతో మహిళ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తూ డాక్టర్ హేమరాజ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

News August 13, 2024

మెదక్: సర్వేకు వచ్చిన అధికారులను బంధించిన రైతులు

image

నర్సాపూర్ మండలం చిన్నచింతకుంటలో గ్రామస్థులు నిరసన చేపట్టారు. కొండపోచమ్మ సాగర్ ద్వారా సంగారెడ్డి కెనాల్ నిర్మాణం కోసం అధికారులు గ్రామంలో సర్వే చేయడానికి వచ్చారు. దీంతో రైతులు వారిని అడ్డుకొని స్థానిక పంచాయతీ కార్యాలయంలో బంధించారు. కెనాల్ నిర్మాణానికి తమ భూములు ఇచ్చే ప్రసక్తి లేదని రైతులు తేల్చి చెప్పారు.

News August 13, 2024

విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోండి: మంత్రి పొన్నం

image

రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. వర్షాకాలం సీజనల్ వ్యాధులు అధికంగా వస్తున్న నేపథ్యంలో గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి గురుకుల పాఠశాలల్లో త్రాగునీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

News August 13, 2024

మెదక్: ‘అత్తారింటికి అని వెళ్లిన కొడుకు తిరిగి రాలేదు’

image

తన కొడుకును వెతికి పెట్టాలని మెదక్ మండలం మగ్దూంపూర్ గ్రామానికి చెందిన బండలకాడి పోచయ్య సోమవారం మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్సై మురళి వివరాల ప్రకారం.. పోచయ్య కొడుకు చిన్నకృష్ణ ఈనెల 8న అత్తవారింటికి వెళ్లొస్తానని చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. చుట్టుపక్కల, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ దొరకలేదని, తన కొడుకు ఆచూకీ వెతికి పెట్టాలని తండ్రి ఫిర్యాదుతో  దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News August 13, 2024

సంగారెడ్డి: విద్యార్థుల అస్వస్థత.. HMపై వేటు

image

కల్హేర్ మండలం బీబీపేట్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. పాఠశాల HM నర్సింగ్‌ను విధుల నుంచి తొలగించినట్లు DEO వెంకటేశ్వర్లు ఉత్తర్వులు ఇచ్చారు. పాడైన గుడ్లను పరిశీలించకుండా, నిర్లక్ష్యంగా, ఉడికించి వడ్డించడంతో తిన్న 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఖేడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు.

News August 13, 2024

MDK: ‘అర్హులందరికి రుణమాఫీ చేయండి’

image

రూ.2లక్షల రుణమాఫీకి అర్హత ఉన్నా తమకు మాఫీ కాలేదని ఉమ్మడి మెదక్ జిల్లాలో పలువురు రైతులు బ్యాంకులు, అధికారుల చూట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో జిల్లాలో అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ వర్తింపజేయాలని మెదక్ కలెక్టర్ రాహుల్‌రాజ్‌ను రైతు రక్షణ సమితి నేతలు కోరారు. ప్రభుత్వం చేపట్టిన రెండు విడతల రుణమాఫీలో సగం మంది రైతులకు లబ్ధి చేకూరలేదని అన్నారు. మూడో విడతలోలైనా అర్హులకు రుణమాఫీ అయ్యేలా చూడాలని కోరారు.

News August 13, 2024

సిద్దిపేట: ‘స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలి’

image

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్లు గరీమ అగ్రవాల్, శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహణపై జిల్లా అధికారులతో చర్చించి తగు ఆదేశాలు జారీ చేశారు.

News August 12, 2024

‘వెయ్యి లైబ్రరీ పోస్టులకు తగ్గకుండా నోటిఫికేషన్ ఇవ్వండి’

image

గ్రేడ్-1, 2, 3లో 1000 లైబ్రరీ పోస్టులకు తగ్గకుండా త్వరలో నోటిఫికేషన్లు వచ్చేలా చూడాలని రాష్ట్ర పబ్లిక్ లైబ్రరీ ఛైర్మన్ డా. రియాజ్‌ను లైబ్రేరియన్ విద్యార్థులు కోరారు. డా.రియాజ్ ఆధ్వర్యంలో తెలంగాణ పబ్లిక్ లైబ్రరీ డెవలప్‌మెట్ ఫోరం HYDలో నిర్వహించిన వన్ డే వర్క షాప్‌లో పాల్గొన్న విద్యార్థులు ఈమేరకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి త్వరలో నోటిఫికేషన్ ఇచ్చేలా చూస్తామన్నారన్నారు.