India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మెదక్ పట్టణంలోని నీట్ పరీక్ష కేంద్రాలను మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. మెదక్ జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ ఏరియాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ధ్యాన్ చంద్ చౌరస్తా వద్ద ప్రభుత్వ డిగ్రీ ఆర్ట్స్ కళాశాల, స్టేడియం దగ్గర ఉన్న తెలంగాణ గురుకుల పాఠశాల అదనపు ఎస్పీ మహేందర్, డీఈవో రాధా కిషన్, ఎంఈఓ నీలకంఠం, సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ సందర్శించి పరిశీలించారు.
మెదక్ ఎంపీ రఘునందన్ రావు గజ్వేల్ మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవితపై ఫైర్ అయ్యారు. బీసీలకు అన్యాయం జరిగిందని కవితమ్మ మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుందన్నారు. కవిత నీకు చిత్తశుద్ధి ఉంటే మీ నాయన కేసీఅర్తో మాట్లాడి పార్టీ ప్రెసిడెంట్ మీ నాయన అగ్ర కులం అధ్యక్ష పదవి బీసీ వ్యక్తికి ఇప్పించాలని అన్నారు. శాసనసభ, శాసన మండలిలో పార్టీ ప్రతిపక్ష నాయకుడిగా బీసీలకు అవకాశం ఇవ్వాలని అన్నారు
కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే తమ లక్ష్యం అని హుస్నాబాద్ ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగులకు 2.5 డీఏ ప్రకటించామన్నారు. డీఏ పెంచడంతో ప్రభుత్వంపై 3.6కోట్ల భారం పడుతుందన్నారు. అంతే కాకుండా ఆడబిడ్డల అభివృద్ధికి ఇందిరా మహిళా శక్తి బస్సులను ప్రారంభిస్తున్నామన్నారు. మహిళా సాధికారత దిశగా ముందుకు వెళ్తామన్నారు.
TGలో ఎమ్మెల్యే కోటాలో ఐదు MLC ఎన్నికలకు రంగం సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికల్లో CPI హుస్నాబాద్ టికెట్ కావాలని పట్టుబట్టిన విషయం తెలిసిందే. MLC స్థానాల్లో Ex. MLA చాడ వెంకట్ రెడ్డికి అవకాశం దక్కుతుందా లేదా అన్న చర్చ జిల్లా వ్యాప్తంగా జరుగుతోంది. కాంగ్రెస్ పొత్తులో భాగంగా రెండు MLC స్థానాలు కేటాయిస్తామని సీపీఐతో ఒప్పందం కుదుర్చుకున్నారు. చాడకు ఎమ్మెల్సీ పదవి వస్తుందా లేదా అని వేచి చూడాలి.
ఈ వేసవిలో నీటి సరఫరాలో అంతరాయం లేకుండా, క్షేత్ర స్థాయిలో సమస్యలు తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. గురువారం మెదక్ కలెక్టరేట్ సమావేశ హాలులో సమ్మర్ యాక్షన్ ప్లాన్ పై అదనపు కలెక్టర్ నగేష్తో కలిసి సమీక్షించారు. తాగునీటి పంపిణీలో సమస్యలు ఏర్పడితే ప్రత్యామ్నాయ చర్యలు ద్వారా నీటిని సరఫరా చేసేందుకు నిర్దిష్టమైన కార్యాచరణ రూపొందించాలని అన్నారు.
విశ్వకర్మ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో పీఎం విశ్వకర్మ పథకంపై అధికారులు, అమలు కమిటీ సభ్యులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కులవృత్తిదారుల సంక్షేమం కోసం ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం ప్రారంభించిందన్నారు. టైలరింగ్, బార్బర్, భవన నిర్మాణ వృత్తుల్లో ఉన్నవారికి ఈ పథకం ఫలాలు అందాలన్నారు.
నర్సాపూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి మనవడు నర్సాపూర్ శివారులోని బీవీఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్డు పక్కన గుర్తుతెలియని మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు చిలుముల నారాయణరెడ్డి డెడ్ బాడీగా గుర్తించారు. మృతదేహాన్ని చిక్మద్దూర్ గ్రామానికి తరలించారు.
ఇంటర్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులు ఖాళీ కడుపుతో రాకుండా త్వరగా జీర్ణం అయ్యే ఆహారాలైన ఇడ్లీ లేదా చద్దన్నం లాంటివి తిని రావాలని మెదక్ జిల్లా వైద్యాధికారులు సూచిస్తున్నారు. అలాగే ఎక్కువగా నీరు తాగుతుండాలన్నారు. పరీక్షలు రాసే సమయంలో ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బంది అనిపిస్తే సెంటర్లో అందుబాటులో ఉండే హెల్త్ అసిస్టెంట్లను సంప్రదించవచ్చని తెలిపారు. ప్రతిరోజు కనీసం 8గంటల నిద్ర ఉండాలన్నారు.
కరీంనగర్ పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయిందని BRS ఎమ్మెల్సీ కవిత అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు బీసీయేతర అభ్యర్థులను బరిలోకి దింపాయని, పార్టీలపరంగా, సిద్ధాంతపరంగా ఓట్లు చీలాయన్నారు. కాబట్టి పోటీలో ఉన్న బీసీ అభ్యర్థి హరికృష్ణ గెలవలేదని ఆమె అన్నారు. బీసీ రిజర్వేషన్లు ఉంటే ఆ స్థానంలో కచ్చితంగా అన్ని పార్టీలు బీసీకే టికెట్ ఇచ్చేవని వ్యాఖ్యానించారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఉండాలన్నారు.
KNR-ADB-NZB-MDK పట్టభద్రుల MLC ఎన్నికల్లో BJP అభ్యర్థి అంజిరెడ్డి 5,106 ఓట్ల మెజార్టీతో గెలవగా ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. 2వ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి, 3వ స్థానంలో BSPఅభ్యర్థి ప్రసన్న హరికృష్ణ నిలిచారు. ఎలా ఓడిపోయామని అటు నరేందర్ రెడ్డి, ఇటు హరికృష్ణ శ్రేణులతో సమాలోచనలు చేస్తున్నారు. చెల్లని ఓట్లు 28,686 రాగా తమ ఓటమికి ఇదే ప్రధాన కారణమని ఆ పార్టీల నేతలు అంటున్నారు.
Sorry, no posts matched your criteria.