India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జిల్లా స్థాయి వాలీబాల్ బాల, బాలికల (అండర్-15) ఎంపికలు మెదక్ గుల్షన్ క్లబ్లో గురువారం నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన 8 మంది బాలురు, 8 మంది బాలికలతో కూడిన జట్టును ఎంపిక చేశారు. నిర్వాహకులు, ఏఎంసీ మాజీ ఛైర్మన్ మేడి మధుసూదన్ రావు, రిటైర్డ్ పీడీ డైరెక్టర్ ప్రభు, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి నాగరాజు, నరేశ్, మాధవరెడ్డి, వినోద్, తదితరులు పాల్గొన్నారు.

మెదక్-కామారెడ్డి జిల్లా సరిహద్దుల్లో గల పోచారం ప్రాజెక్టు నీటిమట్టం గురువారం 20 అడుగుల నీటి మట్టానికి చేరింది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా కామారెడ్డి, లింగంపేట, గాంధారి నుంచి వస్తున్న వాగులు పారడంతో ప్రాజెక్టులోకి నీరు చేరుతుంది. ఓవర్ ఫ్లో కావడానికి మరో అర అడుగు దూరంలో ఉంది. 20.5 అడుగుల నీరు వస్తే ప్రాజెక్టు ఓవర్ ఫ్లో కానుంది. దిగువ పంటలకు కాలువ ద్వారా నీరు వదిలారు.

భద్రతా చర్యలను ప్రామాణికంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ చీప్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారి నెహ్రూ తెలిపారు. బుధవారం చేగుంట మండలం శ్రీ వెంకటేశ్వర క్వాయర్ ప్రోడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్, చిన్న శివనూర్, డెల్ ఎక్స్ ఎల్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ కూచారం, శివంపేట మండలం లూయిస్ ఫార్మా సీయుటుకల్స్, ప్రైవేట్ లిమిటెడ్ నవాబ్ పేట సంబంధిత పరిశ్రమలను పరిశీలించారు.

FRS విధానం అమలుతో సమయపాలనలో క్రమశిక్షణ మరింత బలపడిందని డీఈవో రాధాకిషన్ తెలిపారు. టీచర్లు సమయానికి హాజరై, పాఠశాల సమయం ముగిసే వరకు నిబద్ధతతో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు. FRS యాప్లో తలెత్తిన సాంకేతిక సమస్యలను 3, 4 రోజుల్లో పూర్తిస్థాయిలో పరిష్కరించనున్నట్టు DEO వెల్లడించారు. ఈ విధానం ద్వారా పాఠశాలల్లో పనితీరు, విద్యా ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడుతున్నాయని తెలిపారు.

సిద్దిపేటలోని నాగసముద్రం చెరువు మధ్యలో తెగిపోయిన లైన్ను పునరుద్ధరించేందుకు లైన్మెన్ హైముద్దీన్ సాహసం చేశాడు. తాడు సాయంతో చెరువు మధ్యలోకి వెళ్లి స్తంభం ఎక్కి కనెక్షన్ ఇచ్చి విద్యుత్ని పునరుద్ధరించారు. హైముద్దీన్ ధైర్య సాహసాన్ని మెచ్చి స్థానిక ప్రజలు అభినందిస్తున్నారు.

మెదక్ జిల్లా కేంద్రంలో స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని యువజన క్రీడల నిర్వహణ శాఖ నిర్వహించిన క్రీడల్లో ఉద్యోగులు ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారని కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. క్రీడల్లో పాల్గొని క్రీడాకారులను ఉత్తేజపరిచారు. క్రీడల్లో 1090 మంది ఉద్యోగులు నమోదు చేసుకున్నట్లు వివరించారు. ఆర్డీవో రమాదేవి, యువజన క్రీడల నిర్వహణ అధికారి దామోదర్ రెడ్డి పాల్గొన్నారు.

మెదక్ జిల్లా కేంద్రంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామిని నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం సూచించింది. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో వేడుకల కార్యక్రమంలో జాతీయ పతాక ఆవిష్కరణ, గౌరవ వందనం, సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయన్నారు.

జనవరి 26, పంద్రాగస్టు 15కు ఇచ్చే అవార్డులలో అవకాశం కల్పించాలని నాల్గవ తరగతి పంచాయతీ రాజ్ ఉద్యోగుల సంఘం కలెక్టర్ రాహుల్ రాజ్ను కలిసి విజ్ఞప్తి చేశారు. పంచాయతీరాజ్ 4వ తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు సామ్యూల్, వెంకటేశం, మహమ్మద్ కురిషీద్, దుబా రాజమ్మ, సుజాతలు కలిసిన వారిలో ఉన్నారు. ప్రభుత్వ వివిధ శాఖలో పనిచేసే సిబ్బందికి సర్టిఫికెట్లు ఇచ్చినట్లు తమను గుర్తించాలని కోరారు.

మెదక్ను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని అదనపు కలెక్టర్ నగేశ్ పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్లో నషా ముక్త్ భారత్ అభియాన్ 5వ వార్షికోత్సవం పురస్కరించుకొని జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞను చేయించారు. విద్యాశాఖ అధికారి రాధా కిషన్, ఎస్సీ సంక్షేమ అధికారి విజయలక్ష్మి, బీసీ సంక్షేమ అధికారి జగదీశ్, జమల నాయక్, సీడీపీఓ హేమ భార్గవి ఉన్నారు.

మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో నషా ముక్త భారత్ అభియాన్ కార్యక్రమం ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. నషా ముక్త భారత్ అభియాన్ కార్యక్రమం పురస్కరించుకొని మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞను చేయించారు. అదనపు ఎస్పీ మహేందర్, పోలీస్ అధికారులు, DPO సిబ్బంది పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.