Medak

News March 4, 2026

మెదక్: ఈ మండలాల్లో రేపు, ఎల్లుండి నీటి సరఫరా బంద్

image

మెదక్ జిల్లాలో సమ్మర్ యాక్షన్ ప్లాన్ పనుల కారణంగా ఈనెల 5, 6న పలు ప్రాంతాలకు మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ నాగభూషణం తెలిపారు. మెదక్ నియోజకవర్గంలోని 275 గ్రామాలు, మెదక్, రామాయంపేట మున్సిపాలిటీలతో పాటు అల్లాదుర్గ్, టేక్మాల్ మండలాల్లోని 80 ఆవాసాలకు నీటి సరఫరా ఉండదన్నారు. ముందస్తు సమాచారాన్ని సర్పంచ్‌లకు చేరవేశామని, ప్రజలు పొదుపుగా వాడుకోవాలని ఆయన సూచించారు.

News March 4, 2026

మెదక్: ఇంటర్ పరీక్షలకు 98.21% హాజరు

image

మెదక్ జిల్లాలో ఆరో రోజు ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా విద్యాధికారి మాధవి తెలిపారు. బాటనీ, పొలిటికల్ సైన్స్, మ్యాథ్స్-IIA పరీక్షలకు మొత్తం 98.21 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. జనరల్ విభాగంలో 5,017 మందికి గాను 4,932 మంది, ఒకేషనల్ విభాగంలో 541 మందికి గాను 527 మంది పరీక్ష రాశారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని ఆమె పేర్కొన్నారు.

News March 4, 2026

మెదక్: కలెక్టర్‌ను కలిసిన అడిషనల్ ఎస్పీ

image

మెదక్ జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రతిమా సింగ్‌ను అడిషనల్ ఎస్పీ మహేందర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు అభివృద్ధి కార్యక్రమాల అమలులో జిల్లా యంత్రాంగం చేపడుతున్న చర్యల గురించి ఆమెకు వివరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

News March 3, 2026

మెదక్: సీఎం సమావేశంలో పాల్గొన్న కలెక్టర్

image

హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల సమావేశంలో మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పాల్గొన్నారు. ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు సాగే ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ అమలుపై సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా అభివృద్ధిపై కలెక్టర్ నివేదికను సమర్పించారు.

News March 3, 2026

మెదక్ జిల్లా ప్రజలకు కలెక్టర్ హోలీ శుభాకాంక్షలు

image

హోలీ పండుగను పురస్కరించుకుని మెదక్ జిల్లా ప్రజలకు కలెక్టర్ ప్రతిమా సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. రాగద్వేషాలకు అతీతంగా అందరినీ ఏకం చేసే ఈ రంగుల పండుగ, ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషపు వెలుగులు నింపాలని ఆమె ఆకాంక్షించారు. ప్రకృతి సిద్ధమైన రంగులను మాత్రమే వినియోగిస్తూ, సంప్రదాయబద్ధంగా వేడుకలను జరుపుకోవాలని జిల్లా ప్రజలకు కలెక్టర్ హితవు పలికారు. ఆనందోత్సాహాల మధ్య పండుగను ఆస్వాదించాలని ఆమె కోరారు.

News March 2, 2026

బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేయాలి: కలెక్టర్‌

image

బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని కలెక్టర్ ప్రతిమ సింగ్ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్‌లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, ప్లాన్ ఇండియా సంయుక్తంగా రూపొందించిన ‘బాల్య వివాహ ముక్త భారత్’ ప్రచార గోడపత్రికను ఆమె ఆవిష్కరించారు. జిల్లాను బాల్య వివాహ రహితంగా మార్చేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమాజంలో ఈ దురాచారంపై విస్తృత అవగాహన కల్పించాలని కోరారు

News March 2, 2026

MDK: ప్రశాంతంగా, కుటుంబ సమేతంగా హోలీ జరుపుకోవాలి: ఎస్పీ

image

హోలీ పండగ సందర్భంగా మెదక్ జిల్లా ప్రజలకు ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సమేతంగా ప్రశాంత వాతావరణంలో పండగ జరుపుకోవాలని కోరారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, చెరువులు–కుంటాల వద్ద ప్రమాదాలకు గురికావద్దని హెచ్చరించారు. మహిళల పట్ల గౌరవంగా ప్రవర్తించాలని సూచించారు. అల్లర్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పిల్లలపై తల్లిదండ్రులు పర్యవేక్షణ వహించాలని తెలిపారు.

News March 2, 2026

ఇంటర్మీడియట్ పరీక్షకు 95.55 శాతం హాజరు

image

జిల్లాలో ఐదవ రోజు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర బోటనీ I, పొలిటికల్ సైన్స్-1, మ్యాథ్స్ -1A పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా ముగిసాయి. 95.55 శాతంగా జనరల్ విభాగంలో 6706 గాను 6401 విద్యార్థులు హాజరైనారు. ఒకేషనల్ విభాగంలో 612 గాను 592 విద్యార్థులు పరీక్షకు హాజరైనారు. ఈ సంవత్సరం ఐదు నిమిషాలు నిబంధన అమలులో ఉండటంతో విద్యార్థులందరూ సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు.

News March 2, 2026

రాష్ట్రస్థాయి పోటీలకు కూచన్ పల్లి విద్యార్థిని

image

కూచన్ పల్లి ఉన్నత పాఠశాల విద్యార్థిని అభినయ రాష్ట్ర స్థాయి మోడల్ యునైటెడ్ నేషన్స్ పోటీలకు ఎంపికైనట్లు MEO నాచారం మధుమోహన్ తెలిపారు. రెండు రోజుల క్రితం మెదక్ కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో కూచన్ పల్లి పాఠశాల నుంచి అభినయ, సాత్విక, సహస్రలు పాల్గొన్నారు. వీరిలో ప్రతిభ కనబరిచిన 9వ తరగతి విద్యార్థిని అభినయ రాష్ట్ర స్థాయికి ఎంపికైంది.

News March 1, 2026

మెదక్: రేపు యథావిధిగా ‘ప్రజావాణి’

image

మెదక్ జిల్లా కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం లాగే రేపు ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా అధికారులందరూ సమయపాలన పాటిస్తూ విధిగా హాజరుకావాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు.