Medak

News August 7, 2024

హత్నూర: అటో బోల్తా పడి ఇద్దరి దుర్మరణం

image

ఆటో బోల్తాపడి ఇద్దరు మృతి చెందిన సంఘటన హత్నూర(M) తుర్కల ఖానాపూర్లో సోమవారం రాత్రి జరిగింది. పటాన్‌చెరు(M) పెద్దకంజర్లకు చెందిన బీ.మల్లేశం(45) కౌడిపల్లి(M) తిమ్మాపూర్లో బంధువు ఇంటికి దశదినకర్మ కార్యక్రమానికి ఆటోలో వెళ్లాడు. దౌల్తాబాద్ మీదుగా స్వగ్రామానికి వెళ్తున్న క్రమంలో దౌల్తాబాద్లో యూసుఫ్ ఆటో ఎక్కాడు. తుర్కలఖానాపూర్‌ శివారులో ఆటో అదుపుతప్పి బోల్తా పడగా యూసుఫ్, మల్లేశం స్పాట్‌లో చనిపోయారు.

News August 7, 2024

MDK: రైతు బీమా దరఖాస్తుకు నేడే లాస్ట్

image

రైతు బీమా దరఖాస్తు చేసుకునే గడువు బుధవారంతో ముగియనున్నదని ఏవోలు తెలిపారు. ఇప్పటి వరకు రైతుబీమా కోసం దరఖాస్తు చేసుకోని రైతులు ఆయా గ్రామాల్లో ఏఈవోలకు దరఖాస్తులను అందజేయాలని కోరారు. ఇప్పటికే ఒకసారి గడువు ముగిసిందని, రైతులకు బీమా కల్పించాలని వ్యవసాయశాఖ మరో అవకాశం కల్పించిందన్నారు.

News August 7, 2024

సంగారెడ్డి: 7నెలలు.. 1,77,395 కేసులు

image

ఉమ్మడి జిల్లాలో యువత ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. పోలీసులు పదేపదే హెచ్చరిస్తున్నా వారిలో మార్పు లేదు. అతివేగం, మద్యం మత్తులో డ్రైవ్ చేస్తూ ప్రమాదాలకు గురై భార్యాపిల్లలు, తల్లిదండ్రులను అనాథలు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో 7నెలల్లో 1,77,395 కేసులు నమోదు, రూ.4.79కోట్ల జరిమానాలు వసూళ్లు చేయడం గమనార్హం. ఇందులో విత్‌ఔట్ హెల్మెట్‌ కేసులు అత్యధికంగా 57,381 ఉన్నాయి.

News August 7, 2024

సిద్దిపేట జిల్లా ఇంటర్ విద్యాధికారిగా రవీందర్ రెడ్డి

image

సిద్దిపేట జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (డిఐఈఓ)గా రవీందర్ రెడ్డి నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో పలువురు ప్రిన్సిపాల్‌లను వివిధ కళాశాలలకు బదిలీ చేసింది. కరీంనగర్ బాలికల కళాశాల నుంచి కోహెడ కళాశాలకు బదిలీపై విచ్చేసిన సీనియర్ ప్రిన్సిపాల్ రవీందర్ రెడ్డిని నూతన డిఐఈఓగా నియమించారు. ఇక్కడ బాధ్యత నిర్వహించిన హిమబిందు బెజ్జంకి కళాశాల ప్రిన్సిపాల్‌గా బదిలీ అయ్యారు.

News August 6, 2024

ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ వర్షాలు

image

మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రానున్న మూడు రోజుల్లో స్థిరమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో పలుచోట్ల వీచే అవకాశం ఉందని తెలిపింది. గడిచిన 24 గంటల్లో మెదక్, సిద్దిపేట, సంగారెడ్డిలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

News August 6, 2024

బీజేపీ నేతలు కోతల రాయుళ్లు: జగ్గారెడ్డి

image

బీజేపీ నాయకులు కోతల రాయుళ్లు అని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. మంగళవారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రానికి ఐటీఐఆర్ తెప్పించి కిషన్ రెడ్డి, బండి సంజయ్ మాట్లాడాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అసెంబ్లీ హుందాగా నడిచిందని చెప్పారు. ప్రతిపక్ష నేతలకు కూడా మాట్లాడేందుకు అధిక సమయం కేటాయించినట్లు పేర్కొన్నారు.

News August 6, 2024

సంగారెడ్డి: భారీగా బంగారం స్వాధీనం, వ్యక్తి అరెస్ట్

image

సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్ జాతీయ రహదారిపై టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ముంబై నుంచి హైదరాబాద్ వెళుతున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో భారీగా బంగారం పట్టుకున్నారు. సరైన పత్రాలు లేని సుమారు 4.8 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. చంద్రేష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

News August 6, 2024

తెలంగాణలో విమాన సేవలు పెంచండి: కొత్త ప్రభాకర్ రెడ్డి

image

తెలంగాణలో విమాన సేవల పెంపుపై దృష్టి సారించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడిని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని వారి కార్యాలయంలో కలిసి పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడిని కలిశారు. తెలంగాణ లో విమాన సేవల పెంపుపై దృష్టిసారించాలని కోరారు.

News August 6, 2024

పటాన్‌చెరు బస్టాండులో పిల్లలను వదిలేశారు

image

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఆర్టీసీ బస్టాండులో ఇద్దరు చిన్నపిల్లలను గుర్తు తెలియని వ్యక్తులు వదిలిపెట్టి వెళ్లారు. సోమవారం సాయంత్రం బస్టాండ్ ప్రాంగణంలో 5ఏళ్ల లోపు ఇద్దరు పిల్లలను గమనించిన స్వీపర్ సాయంత్రం వరకు వేచి చూశారు. పిల్లల కోసం ఎవరూ రాకపోవడంతో స్వీపర్ పిల్లలను తన ఇంటికి తీసుకెళ్లారు. ఈరోజు ఉదయం వరకు ఎవరూ రాకపోవడంతో పోలీసులకు అప్పగించారు.

News August 6, 2024

రామాయణపేట: ముక్కిపోయి, గడ్డలు కట్టిన రేషన్ బియ్యం సరఫరా !

image

రామాయంపేట మండల వ్యాప్తంగా ప్రభుత్వం సరఫరా చేస్తున్న పౌర సరఫరాల రేషన్ బియ్యం నాణ్యత దిగజారింది. మండలం పరిధి కాట్రియాల గ్రామంలోని ఒక రేషన్ షాపులో ముక్కిన బియ్యం సరఫరా చేయడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముక్కిపోయి, గడ్డలు కట్టిన పురుగులు పట్టిన బియ్యం ఎలా తింటామంటూ నిలదీశారు. దీనిపై జిల్లా అధికారులు స్పందించి నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.