India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మెదక్ జిల్లాల్లో రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతోంది. ప్రతి ఏడాది మార్చిలో కనింపించే ఎండ ప్రభావం ఈ ఏడాది ముందుగానే కనిపిస్తోంది. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సాధరణం కంటే ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండు, మూడు డిగ్రీల మేర ఉష్ణోగ్రత అధికంగా నమోదు అవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఏడుపాయల జాతరకు భారీగా ఆర్టీసీ బస్సులను అధికారులు నడపనున్నారు. ఈ నెల 26 నుంచి 28 తేదీ వరకు మూడు రోజుల పాటు ఏడుపాయల జాతర కొనసాగనుంది. హైదరాబాద్, సికింద్రాబాద్, జేబీఎస్ నుంచి 300 బస్సులు, పటాన్చెరు, నారాయణఖేడ్, జహీరాబాద్ డిపోల నుంచి మరో 50 చొప్పున మొత్తం 400 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ అధికారులు నడపనున్నారు. రద్దీని బట్టి మరిన్ని బస్సులు నడుపుతామని మెదక్ డీఎం సరేఖ పేర్కొన్నారు.
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్ట మైన పెద్దపట్నం కార్యక్రమాన్ని ఈనెల 26న వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్నారు. ఆలయ ఈవో కె.రామాంజనేయులు ఏర్పాట్లును పర్యవేక్షిస్తున్నారు.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ముస్సోరిలోని నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అకాడమిలో వివిధ దేశాల సివిల్ సర్వీస్ అధికారులకు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అతిధి ఉపన్యాసం ఇచ్చారు. ఈ సంద్భంగా మెదక్ జిల్లా కలెక్టర్ మన రాష్ట్రంలో అమలవుతున్న స్థానిక పాలనపై సుదీర్ఘంగా తన అనుభవాలను పంచుకున్నామని అన్నారు. వాళ్లందరికీ కొన్ని విలువైన సలహాలు సూచనలు చేశామని తెలిపారు.
ప్రయాగ్ రాజ్లో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారును లారీ ఢీ కొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం, మామిడిగి గ్రామానికి చెందిన వెంకట్ రెడ్డి (46) (ఇరిగేషన్ డీఈ), భార్య విలాసిని (40), మల్గి గ్రామానికి చెందిన మల్ రెడ్డి (40) మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా 3 రోజులు మద్యం అమ్మకాలు నిలిపేయాలని దుకాణదారులను పోలీసులు ఆదేశించారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం షాపులు బంద్ కానున్నాయి. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోని వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లలోని బార్లు, కల్లు దుకాణాలు మూసివేయనున్నారు.
సిద్దిపేట జిల్లాలో <<15557045>>నిప్పంటించుకుని<<>> ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డిన విషయం తెలిసిందే. వివరాలు.. ఈ ఘటనలో మహిళ అక్కడే మృతి చెందగా, పురుషుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. వారి ఆధార్ కార్డ్ల ద్వారా సిద్దిపేటకు చెందిన లక్ష్మి(65), భర్త పేరు చందుగా, రంగారెడ్డి జిల్లా ఘట్ కేసర్కు చెందిన శ్రీధర్(44), తండ్రి నర్సోజిగా పురుషుడి వివరాలు ఉన్నాయి. వీరిని గుర్తు పట్టిన వారు తొగుట పోలీసులను సంప్రదించాలని కోరారు.
బగ్గీల పోటీలను దక్షిణ భారతదేశంలో 2వ సారి నిర్వహించినందుకు గర్వంగా ఉందని BVRIT యాజమాన్యం తెలిపారు. నర్సాపూర్ సమీపంలోని BVRIT కళాశాల ఆవరణలో నిర్వహించిన బగ్గీల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులతో పాటు నగదు పురస్కారాలను ఆయా ప్రముఖుల చేత విజేతలకు అందజేశారు. ప్రముఖులు బగ్గీల విశిష్టత, పెరుగుతున్న టెక్నాలజీ ఉపయోగం తీరు, విలువలను వివరించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 24 సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి వినతులు హెల్ప్ డెస్క్ ద్వారా స్వీకరించనున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల విధులు కేటాయించిన వివిధ శాఖల అధికారులు అందుబాటులో ఉండనందున కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు హెల్ప్ డెస్క్ ద్వారా మాత్రమే దరఖాస్తులు సమర్పించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు.
విద్యుత్ కార్మిక సంఘం మెదక్ జిల్లా నూతన గౌరవ అధ్యక్షుడిగా అశోక్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా సెక్రటరీ ఓరం సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ.. తనను గౌరవాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు రాష్ట్ర నాయకత్వం, కంపెనీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.
Sorry, no posts matched your criteria.