India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మెదక్ జిల్లా వ్యాప్తంగా పీసీపీఎన్ డీటీ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ శ్రీరామ్ తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఆడపిల్లల బ్రాణ హత్యలు, లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్ చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. జిల్లావ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ కోసం ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి వారికి శిక్షణ ఇచ్చారు.
ఈ నెలలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఈ నెల 6 నుంచి ప్రారంభమయ్యే ప్రి ఫైనల్ పరీక్షలో పదో తరగతి విద్యార్థులకు ఓఎంఆర్ పత్రాల్లో సమాచారంపై అవగాహన కల్పించాలని మెదక్ డీఈవో రాధా కిషన్ తెలిపారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. ఓఎంఆర్ పత్రాలను సంబంధిత మండల వనరుల కార్యాలయం నుంచి తీసుకోవాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులకు సూచించారు.
మెదక్ జిల్లా సమీకృత కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రంజాన్ మాసం పండుగ నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులు, శాంతి కమిటీ సభ్యులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, వైద్యారోగ్య, ఆర్&బీ, విద్యుత్, పౌరసరఫరాలు, తదితర శాఖల అధికారులతో పాటు పలువురు మత పెద్దలతో చర్చించారు.
హైదరాబాద్ డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో పంటలకు సమృద్ధిగా సాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా, సంక్షేమ హాస్టళ్లలో సౌకర్యాలు పరిశీలన, సింగల్ యూస్ ప్లాస్టిక్ వినియోగం తగ్గింపు తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్కు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, తదితరులు పాల్గొన్నారు.
KNR-ADB-NZB-MDK ఉపాధ్యాయ MLCగా విజయం సాధించిన మల్క కొమురయ్య 1959 OCT 1న పెద్దపల్లి జిల్లా బంధంపల్లిలో జన్మించారు. ఆయన OUలో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు.1983లో శాలివాహన గ్రూప్ డైరెక్టర్గా జాయిన్ అయ్యారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పల్లవి ఎడ్యుకేషన్ సొసైటీ ఛైర్మన్గా ఉన్నారు. గత MPఎన్నికల్లో ఆయన BJPతరఫున మల్కాజిగిరి టికెట్ ఆశించారు. కాగా TPUS అభ్యర్థిగా MLCకి పోటీ చేసిన ఆయనకు BJPమద్దతు ఇచ్చింది.
ప్రజావాణి కార్యక్రమానికి 24 దరఖాస్తులు వచ్చాయని అదనపు జిల్లా కలెక్టర్ నగేశ్ తెలిపారు. మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం పలు సమస్యలపై దరఖాస్తులు రాగా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ఎల్లయ్య సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు. భూ సమస్యలు ఉన్నవారు తమ తమ మండల కేంద్రంలోని తహశీల్దారులకు సోమవారం అర్జీలు పెట్టుకోవాలని కలెక్టర్ కోరారు.
వరల్డ్ రికార్డ్ సాధించిన కరాటే మాస్టర్ నగేష్కు సినీహీరో సుమన్ అభినందించారు. చెన్నైలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నిర్వహించారు. ఈ లార్జెస్ట్ గిన్నిస్ వరల్డ్ రికార్డులో 3 వేల మంది కరాటే మాస్టర్స్ మన దేశం నుంచి హాజరయ్యారు. తెలంగాణ నుంచి తెలంగాణ సీనియర్ కరాటే మాస్టర్ నగేష్ ప్రాతినిధ్యం వహించగా 40 మంది నగేష్ వద్ద శిక్షణ పొందుతున్న కరాటే మాస్టర్స్ పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన జరిగింది. తెల్లాపూర్లోని దివినో విల్లాస్లో తల్లి రాధిక(52)పై కొడుకు కార్తీక్ రెడ్డి కత్తితో దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాధిక చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ కలహాలే ఈ దాడికి కారణమని చెప్పారు.
ఉమ్మడి MDK, ADB, KNR, NZB పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభంకానుంది. అధికారులు కరీంనగర్లోని అంబేడ్కర్ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు చేశారు. పట్టభద్రుల ఓట్ల లెక్కింపునకు 21 టేబుళ్లు, ఉపాధ్యాయ ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లు సిద్ధం చేశారు. లెక్కింపునకు 2 నుంచి 3 రోజలు పట్టే అవకాశం ఉన్నందున షిఫ్టుల వారీగా సిబ్బందిని నియమించారు. ఆ ఇద్దరు విజేతలు ఎవరో చూడాలి.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నందున, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ వైద్యాధికారులను ఆదేశించారు. చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ఆయా విభాగాలను సందర్శించి, రోగులకు అందిస్తున్న వైద్య సేవల తీరును పరిశీలించారు.
Sorry, no posts matched your criteria.