Medak

News August 1, 2024

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు హర్షణీయం: ప్రొఫెసర్ కాసీం

image

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని ప్రొఫెసర్ కాసీం అన్నారు. భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పొందుపర్చిన ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు, మాదిగ ఉప కులాలు అందుకోవడంలో నష్టపోయారని, సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన చారిత్రాత్మకమైన తీర్పు అన్నారు. ఎంఎస్‌పీ రాష్ట్ర నాయకులు మైస రాములు మాదిగ, ఎం‌ఆర్‌పీ‌ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు ముండ్రాతి కృష్ణ ఉన్నారు.

News August 1, 2024

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ: హరీశ్ రావు

image

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ అయిపోయిందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. గురువారం సీఎం ఛాంబర్ ముందు నిరసన తెలుపుతున్న హరీశ్ రావుతోపాటు పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అసెంబ్లీలో ఒక మహిళకు అన్యాయం జరిగితే మైక్ ఇవ్వకుండా ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతున్నారని హరీశ్ మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలోనూ ఇన్ని ఆంక్షలు లేవని, రాష్ట్రం మొత్తం పోలీస్ రాజ్యంగా మారిపోయిందని మండిపడ్డారు.

News August 1, 2024

సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకం: ఎంపీ

image

ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు అన్నారు. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నానన్నారు. అణగారిన వర్గాల దశాబ్దాల పోరాటానికి న్యాయం జరిగిందని, అలుపెరుగని పోరాటయోధుడు మంద కృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. వర్గీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.

News August 1, 2024

ఎస్సీ వర్గీకరణ స్వాగతిస్తున్నాం: మంత్రి

image

ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. సుప్రీం తీర్పుతో న్యాయం, ధర్మం గెలిచిందని పేర్కొన్నారు. 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం ఫలించిందని చెప్పారు. అనగారిన వర్గాలకు న్యాయం తిరుగుతుందని వివరించారు. ఉద్యమంలో ఎంతోమంది అమరులయ్యారని తెలిపారు.

News August 1, 2024

మెదక్: నకిలీ బంగారం బిస్కెట్‌తో మోసం

image

మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలో నకిలీ బంగారం రమణమ్మ లీలలు వెలుగులోకి వచ్చాయి. బాధితుల వివరాల ప్రకారం.. రెండు రోజుల క్రితం అమీన్పూర్‌లో మోసం చేసిన రమణమ్మ తూప్రాన్ మండలంలోని ఇమాంపూర్‌లో సైతం మోసం చేసినట్లు బాధితులు తెలిపారు. గ్రామానికి చెందిన ఒక వ్యాపారికి నకిలీ బంగారం అంటగట్టి రూ.4లక్షల ఎత్తుకెళ్లారని తెలిపారు. అయితే ఎవరికీ చెప్పుకోలేకపోయామని వాపోయారు. పోలీసులకు సైతం ఫిర్యాదు చేయలేదని చెప్పారు.

News August 1, 2024

మాసాయిపేట: తల్లిపై కుమారుడు అఘాయిత్యం

image

సభ్య సమాజం తలదించుకునే ఘటన మెదక్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మాసాయిపేట మండలంలో తల్లి పైనే కుమారుడు అఘాయిత్యానికి పాల్పడినట్లు చేగుంట ఎస్సై తెలిపారు. భార్యా పిల్లలు మహంకాళి జాతరకు వెళ్లగా.. తల్లితో ఇంటి వద్ద ఉన్న యువకుడు మద్యం మత్తులో 29న రాత్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా నిన్న వృద్ధురాలైన తల్లి పోలీసులను ఆశ్రయించింది.

News August 1, 2024

సీఎంని కలిసిన పటాన్‌చెరు ఎమ్మెల్యే

image

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పటాన్‌చెరు శాసనసభ్యుడు గూడెం మహిపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసంలో జరిగిన భేటీలో పాల్గొన్నారు. వారితో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ ఉన్నారు.

News August 1, 2024

UPDATE.. హృదయాలను కలిచివేసిన మెదక్ యాక్సిడెంట్

image

మెదక్ జిల్లా మనోహరాబాద్‌లో జరిగిన <<13746227>>రోడ్డు ప్రమాదం<<>>లో మృతి చెందిన గర్భిణి సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మల్లుపల్లికి చెందిన పనేటి రేణ(29)గా గుర్తించారు. ఎస్సై సుభాశ్ గౌడ్ తెలిపిన వివరాలు.. బైకుపై మరో వ్యక్తి, బాలుడితో కలిసి వెళ్తుండగా వెనుకగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గర్భిణి నుజ్జునుజ్జు కాగా కడుపు నుంచి పిండం రోడ్డుపై పడి పలువురి హృదయాలను కలిచివేసింది.

News August 1, 2024

సంగారెడ్డి: మాదకద్రవ్యాల నియంత్రణకు చర్యలు: కలెక్టర్

image

జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు చర్యలు చేసుకుంటున్నామని కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. ఎస్పీ రూపేష్ మాట్లాడుతూ జిల్లాలో నార్కోటిక్ అనాలిసిస్ బ్రాంచ్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News August 1, 2024

సంగారెడ్డి: నేటి నుంచి తల్లిపాల వారోత్సవాలు

image

జిల్లాలో ఆగస్టు 1 నుంచి 7 వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో సీడీపీవోలు వైద్యశాఖ అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. అంగన్వాడి కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద తల్లిపాల వారోత్సవాలపై అవగాహన కల్పించాలని చెప్పారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.