Medak

News February 22, 2025

రామాయంపేటలో చిరుత సంచారం.. ఆందోళనలో రైతులు

image

రామాయంపేట శివారులోని జాతీయ రహదారి సమీపంలో చిరుత పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. జాతీయ రహదారి పక్కన ఉన్న 1421 సర్వే నంబర్‌లోని వ్యవసాయ పొలం వద్ద గత రాత్రి లేగ దూడపై చిరుత దాడి చేసి చంపేసింది. ఉదయం లేగదూడను చూసిన స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలం చేరుకున్న ఫారెస్ట్ అధికారులు విచారణ చేపట్టారు.

News February 22, 2025

ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

image

ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. మెదక్- నిజామాబాద్-ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గం సంబంధించిన ఏర్పాట్లపై మాట్లాడారు. డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలు ఏర్పాటు, పోలింగ్ స్లిప్పులు పంపిణీ పూర్తి చేయాలన్నారు. పోలింగ్ ఈనెల 27న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పటిష్టంగా ఉండాలన్నారు.

News February 22, 2025

మెదక్: అనుమానాస్పదంగా వ్యక్తి మృతి

image

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం కామారెడ్డి జిల్లా బిక్కనూర్‌లో జరిగింది. హవేలిఘనపూర్ మండలం గంగాపురానికి చెందిన శ్రీనివాస్ ఓ శుభకార్యం నిమిత్తం బిక్కనూరులోని అత్తగారింటికి వచ్చాడు. శుక్రవారం మద్యం తాగి ఆరు బయట పడుకున్న శ్రీనివాస్ తెల్లవారుజామున భార్య సరిత వచ్చి నిద్రలేపగా లేవలేదు. స్థానికులు వచ్చి చూడగా అప్పటికే మృతిచెంది ఉన్నాడు. కాగా మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

News February 22, 2025

సిద్దిపేట: హోమో సెక్స్‌కు అడ్డు చెప్పాడని హత్య

image

సిద్దిపేటలో వ్యక్తి<<15521843>> హత్య కేసు<<>>ను పోలీసులు ఛేదించారు. హోమో సెక్స్‌కు అడ్డు చెప్పడంతో హత్య చేసిన వ్యక్తిని గుర్తించి రిమాండ్‌కు తరలించినట్లు ACP మధు తెలిపారు. సిద్దిపేటకు చెందిన శ్రీనుకు కరీంనగర్ జిల్లాకు చెందిన పర్వతం రాజు(40)తో పరిచయం ఉంది. భార్య పిల్లకు దూరంగా ఉంటున్న రాజు.. బుధవారం శ్రీనుకు మద్యం తాగించి హోమో సెక్స్ చేస్తుండగా ప్రతిఘటించాడు. దీంతో తలపై కర్రతో కొట్టడంతో శ్రీను చనిపోయాడు.

News February 22, 2025

అంద‌రికీ రుణ‌మాఫీ.. అదో అంద‌మైన క‌ట్టుక‌థ: హ‌రీశ్‌రావు

image

సీఎం రేవంత్‌పై హ‌రీశ్‌రావు నిప్పులు చెరిగారు. ఇప్ప‌టికీ చాలా మంది రైతుల‌కు రుణ‌మాఫీ కాలేద‌ని, రైతుల నుంచి తీవ్ర నిర‌స‌న‌లు వ్య‌క్త‌మవుతున్నాయ‌ని ఆయన అన్నారు. గాంధీ భ‌వ‌న్ వ‌ద్ద ధ‌ర్నాకు దిగిన రైతు విష‌యంలో హ‌రీశ్‌రావు స్పందించారు. అందరికీ రుణమాఫీ చేసినట్లు అందమైన కట్టు కథను ప్రచారం చేస్తున్న మిమ్మల్ని నిలదీసేందుకు గాంధీభవన్ దాకా వచ్చిన రైతుకు ఏం సమాధానం చెబుతారు అని హ‌రీశ్ నిల‌దీశారు.

News February 21, 2025

మెదక్‌లో గ్రాడ్యుయేట్స్ 12,472, టీచర్స్ 1,347 ఓటర్లు

image

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సమీపిస్తోంది. ఈనెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మెదక్ జిల్లాలో గ్రాడ్యుయేట్ ఓటర్లు 12,472 ఉన్నారు. ఇందులో 8,879 మంది పురుషులు, 3,593 మహిళలున్నారు. ఉపాధ్యాయ ఓటర్లు మొత్తం 1,347 ఉన్నారు. ఇందులో పురుషులు 7,99 మంది, మహిళలు 5,48 మంది ఉన్నారు. ఎమ్మెల్సీ పోలింగ్ కోసం మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

News February 21, 2025

మెదక్: భర్తను హత్య చేసిన భార్య.. UPDATE

image

<<15507715>>భర్తను హత్య చేసిన<<>> భార్య శివమ్మ, అల్లుడు రమేశ్‌లను గురువారం రిమాండ్‌కు తరలించినట్లు మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి, పాపన్న పేటకు చెందిన ఆశయ్య ఈ నెల 15న పొలం వద్ద జారి పడగా కాలు విరిగింది. ఆపరేషన్‌కు అయ్యే ఖర్చు భరించలేక, ఆపరేషన్ చేసినా నడిచి పొలం పనులు చేయలేడనే అనుమానంతో భార్య, అల్లుడు ఆశయ్యను ఉరేసి హత్య చేశారు. కేసులో భాగంగా ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు వివరించారు.

News February 21, 2025

MDK: వన దుర్గామాతను దర్శించుకున్న సినీహీరో

image

మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గాభవాని మాతను ప్రముఖ సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు, నటుడు పూరీ ఆకాశ్ గురువారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, సిబ్బంది స్వాగతం పలికారు. అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.

News February 21, 2025

మెదక్: మైనర్ బాలికపై లైంగిక దాడి

image

మైనర్ బాలికపై ఇద్దరు లైంగిక దాడికి పాల్పడిన ఘటన సంగారెడ్డి మండలం ఫసల్వాది పరిధిలోని రెండు పడక గదుల ఇళ్ల సమీపంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఎనిమిది సంవత్సరాల పాపను ఇద్దరు పక్కనే ఉన్న ముళ్లపొదల్లోకి తీసుకెళ్లారు. బాలికపై లైంగిక దాడికి పాల్పడడంతో తీవ్ర రక్తస్రావమైంది. వారిలో ఒకరిని స్థానికులు పట్టుకొని చితకబాదారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

News February 21, 2025

రామాయంపేట: విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి

image

ఇంట్లో ఫ్యాన్ రిపేర్ చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన రామాయంపేట మండలంలో గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన పొట్టినోళ్ల నర్సింలు(55) అనే వ్యక్తి బుధవారం రాత్రి తన ఇంట్లో ఫ్యాన్ రిపేర్ చేస్తున్న క్రమంలో విద్యుత్ షాక్ తగిలి కింద పడిపోయాడు. ఆస్పత్రికి తరలించేలోపు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.