Medak

News July 30, 2024

సంగారెడ్డి: గిఫ్ట్ వోచర్ పేరుతో సైబర్ మోసం

image

గిఫ్ట్ వోచర్ పేరుతో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రూ.లక్షలు పోగొట్టుకున్నాడు. అమీన్‌పూర్ పోలీసుల వివరాలు.. సాయి భగవాన్ కాలనీకి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి జులై 17న యాపిల్ ప్లే స్టోర్‌లో గిఫ్ట్ వోచర్లు కొనుగోలు చేస్తే నగదు రెట్టింపొస్తాయని మెసేజ్ వచ్చింది. నమ్మిన బాధితుడు రూ.2.50లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. అసలు, రెట్టింపు డబ్బు ఇవ్వాలని అడగ్గా అపరిచిత వ్యక్తి స్పందించ లేదు. పోలీసులను ఆశ్రయించాడు.

News July 30, 2024

మెదక్: రెండో విడతకు రెడీ

image

రెండో విడత రైతు రుణమాఫీకి ఉమ్మడి మెదక్ జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. నేడు రూ. లక్షన్నర వరకు ఉన్న రైతులకు సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయనున్నారు. కాగా మెదక్ జిల్లాలో 2వ విడతలో 18,540 మంది రైతులకు రూ.183.26 కోట్లు, సంగారెడ్డి జిల్లాకు చెందిన 25,191మంది రైతులకు రూ. 268.35 కోట్లు, సిద్దిపేట జిల్లాలో 27,875 మంది రైతులకు రూ. 277.21 కోట్లు రుణం మాఫీ కానుందని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు.

News July 30, 2024

సంగారెడ్డి: దిగొచ్చిన టమాటా.. సామాన్యులకు ఊరట

image

టమాట ధర ఎట్టకేలకు దిగి రావడంతో సామాన్యులకు కాస్త ఊరట లభించింది. సంగారెడ్డి, మెదక్, నారాయణఖేడ్, జహీరాబాద్, జోగిపేట, తదితర మార్కెట్లో కిలో టమాటా ధర రూ. 50 నుంచి రూ. 40 పలుకుతుంది. కిలో పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, బెండకాయ, ఆకు కూరగాయల ధరలు అలాగే ఉన్నాయి. ధరల పెరుగుదలను అరికట్టాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

News July 30, 2024

సంగారెడ్డి: దిగివచ్చిన టమాట ధర.. సామాన్యులకు ఊరట

image

సంగారెడ్డి: టమాట ధర ఎట్టకేలకు దిగి రావడంతో సామాన్యులకు కాస్త ఊరట లభించింది. సంగారెడ్డి, మెదక్, నారాయణఖేడ్, జహీరాబాద్, జోగిపేట, తదితర మార్కెట్లో కిలో టమాటా ధర రూ. 50 నుంచి రూ. 40 పలుకుతుంది. కిలో పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, బెండకాయ, ఆకు కూరగాయల ధరలు అలాగే ఉన్నాయి. ధరల పెరుగుదలను అరికట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

News July 30, 2024

MDK: ‘విజుబుల్ పోలీసింగ్‌తోనే శాంతి భద్రతలపై నమ్మకం’

image

హవేలిఘనపూర్ మండల కేంద్రంలోని పోలీసు స్టేషన్‌ను జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన పోలీసు స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించారు. నేరాలను నియంత్రించడంతో పాటు, శాంతి భద్రతలపై ప్రజలకు నమ్మకం కలగాలంటే విజుబుల్ పోలీసింగ్‌తోనే సాధ్యపడుతుందన్నారు. పోలీసు సిబ్బంది తరచూ గ్రామాలను పర్యటిస్తూ ప్రజల్లో భద్రత భావాన్ని పెంపొందించాలన్నారు. సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

News July 29, 2024

సంగారెడ్డి: ఆర్టీసీలో 3.80 కోట్ల మంది మహిళల ప్రయాణం

image

ఆర్టీసీ మెదక్ రీజియన్ పరిధిలో ఇప్పటివరకు మహాలక్ష్మి పథకం కింద 3.80 కోట్ల మంది మహిళలు ప్రయాణించారని RM ప్రభులత సోమవారం తెలిపారు. ఈ పథకం తర్వాత 70% ఉన్న ఓఆర్ 98 శాతానికి చేరిందని చెప్పారు. రీజియన్ పరిధిలో 10 డీలక్స్, 35 పల్లె వెలుగు, 42 ఎక్స్ ప్రెస్ బస్సులను కొత్తగా తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు డ్రైవర్లు, కండక్టర్లకు శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు.

News July 29, 2024

రేవంత్ పీసీసీ అయినా.. సీఎం అయినా అది కేసీఆర్ పుణ్య‌మే: హరీష్ రావు

image

రేవంత్ రెడ్డి పీసీసీ అధ్య‌క్షుడు అయినా, ఇప్పుడు సీఎం అయినా అది కేసీఆర్ పుణ్య‌మే అని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు. అసెంబ్లీ ప్రాంగ‌ణంలో హ‌రీశ్‌రావు మీడియాతో చిట్ చాట్ చేశారు. తెలంగాణ ప్రకటన వెనక్కి పోతే మేము రాజీనామా చేశాం. రేవంత్ రెడ్డి కనీసం డూప్లికేట్ రాజీనామా కూడా చేయలేదు. రేవంత్ లాంటి వాళ్ళు రాజీనామా చేయలేదనే ఆనాడు బలిదానాలు జ‌రిగాయని అన్నారు.

News July 29, 2024

మెదక్: ఫైనాన్స్ రుణం ఇస్తామని.. డబ్బులు కాజేశారు

image

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం చెట్లగౌరారం గ్రామానికి చెందిన రావెల్లి నరసింహులుకు ఓ ఫైనాన్స్ నుంచి రుణం ఇస్తామని ఫోన్ చేసి రూ. 42,500 కాజేశారు. మీ సిబిల్ స్కోర్ బాగుందని రుణమిస్తామని ఫోన్ చేశారు. వారి మాటలు నమ్మి ఇన్సూరెన్స్ కోసం, డాక్యుమెంట్లు, ఆర్బీఐ అనుమతి కోసం అంటూ పలు దఫాలుగా డబ్బులు పంపారు. రుణం చెల్లించకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.

News July 29, 2024

మెదక్: జ్వరంతో ఇంటర్ విద్యార్థి మృతి

image

డెంగ్యూతో ఇంటర్ విద్యార్థి మృతి చెందిన ఘటన చిన్నశంకరంపేట మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. సూరారం గ్రామానికి చెందిన కుమ్మరి నిఖిల్(17) హైదరాబాద్‌లో ఇంటర్ చదువుతున్నారు. 5రోజులుగా జ్వరంతో బాధపడుతుంటగా బంధువులు ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించారు. ప్లేట్ లెట్స్ తగ్గిపోవడంతో తీవ్ర అస్వస్థకు గురై చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.

News July 29, 2024

MDK: చోరీ చేసిన GOVT ఉద్యోగి 

image

ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు అలవాటు పడిన ఓ ప్రభుత్వ ఉద్యోగి చోరీ చేసిన ఘటన మెదక్ జిల్లా రేగోడ్ మండలం మక్త వెంకటాపురంలో ఈరోజు వెలుగు చూసింది. సీఐ రేణుకారెడ్డి తెలిపిన వివరాలు.. మక్త వెంకటాపురానికి చెందిన రైతు సంగప్ప పంట పెట్టుబడి డబ్బును అప్పు చేసి ఇంట్లో పెట్టాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అదే గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి జ్ఞానేశ్వర్ ఆ డబ్బును చోరీ చేశాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.