India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు గ్రామాల్లో రసవత్తరంగా మారాయి. పల్లెల్లో అన్నదమ్ముల్లాగా ఉన్న వారు ఎన్నికలు రాగానే ఆపోజిట్ అభ్యర్థులుగా మారుతున్నారు. ఎన్నడో గ్రామాలను వదిలి వెళ్లిన వారు సైతం గ్రామంలోకి వచ్చి నామినేషన్ వేస్తున్నారు. ఎన్నికల దావత్లతో పల్లెల్లో జోరు కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ గ్రామాల్లో సర్పంచ్ పీఠం ఎవరికి దక్కునో.. మరీ మీ ప్రాంతంలో!

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు గ్రామాల్లో రసవత్తరంగా మారాయి. పల్లెల్లో అన్నదమ్ముల్లాగా ఉన్న వారు ఎన్నికలు రాగానే ఆపోజిట్ అభ్యర్థులుగా మారుతున్నారు. ఎన్నడో గ్రామాలను వదిలి వెళ్లిన వారు సైతం గ్రామంలోకి వచ్చి నామినేషన్ వేస్తున్నారు. ఎన్నికల దావత్లతో పల్లెల్లో జోరు కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ గ్రామాల్లో సర్పంచ్ పీఠం ఎవరికి దక్కునో.. మరీ మీ ప్రాంతంలో!

మెదక్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ప్రచారం ఊపందుకుంది. అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా యువతను ప్రసన్నం చేసుకునేందుకు, మొదటి రెండు విడతల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, అభ్యర్థులు నేడు పెద్ద ఎత్తున విందులు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. దీంతో నేడు ఆదివారం అత్యంత కీలకంగా మారింది.

మెదక్ జిల్లాలో జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి(ఎన్నికల కోడ్) అమల్లోనే ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రకటించారు. మూడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నందున, చివరి దశ పూర్తయ్యే వరకూ కోడ్ కొనసాగుతుందని తెలిపారు. ఏకగ్రీవంగా నిలిచిన గ్రామపంచాయతీల్లోనూ ఎన్నికల కోడ్ యథాతథంగా అమల్లో ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు.

పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. కాళ్లు మొక్కుతా.. ఓటేసి మద్దతు ఇవ్వండి అంటూ ఓ అభ్యర్థి కాళ్లు పట్టి వేడుకున్నాడు. ఈ ఘటన శనివారం రాత్రి తూప్రాన్ ఐడీఓసీ భవనంలో గుర్తుల కేటాయింపు సమయంలో చోటుచేసుకుంది. ఇస్లాంపూర్(తూప్రాన్) సర్పంచ్ పదవికి బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసిన సంతోష్ రెడ్డి కాంగ్రెస్లో చేరిపోయారు. బీఆర్ఎస్లో చేరిన స్వతంత్ర అభ్యర్ధి బీములు కాంగ్రెస్ నాయకుడి కాళ్లు పట్టుకొని వేడుకున్నాడు.

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అధికారులు ఎన్నికల సంఘం నియమాలను తప్పనిసరిగా అమలు చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ ఆదేశించారు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఆయన రిటర్నింగ్ అధికారులు, ఆర్డీవోలు, ఎంపీడీవోలతో సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎక్కడా ఎలాంటి అలసత్వం వహించకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

మెదక్ జిల్లాలో మూడో (చివరి)విడత ఏడు మండలాల్లో గల 183 గ్రామపంచాయతీలలో చివరి రోజు 521 నామినేషన్లు దాఖలయ్యాయి. చిలిపిచేడ్-54, కౌడిపల్లి-101, కుల్చారం-69, మాసాయిపేట-33, నర్సాపూర్-92, శివంపేట-106, వెల్దుర్తి-66 చొప్పున మూడు రోజులై కలిపి 1028 నామినేషన్ పత్రాలు సమర్పించారు. 1528 వార్డు స్థానాలకు మొత్తం 3528 నామినేషన్లు దాఖలు అయ్యాయి.

మెదక్ జిల్లాలో రెండో విడత ఎన్నికలు జరగనున్న గ్రామ పంచాయతీలలో పోటీ చేసే అభ్యర్థులకు నేడు గుర్తులు కేటాయించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉండగా, అనంతరం తెలుగు అక్షరమాల పద్ధతిలో అభ్యర్థులకు గుర్తులను కేటాయించనున్నారు. మెదక్, చిన్న శంకరంపేట, రామాయంపేట, నిజాంపేట తూప్రాన్, మనోహరాబాద్, చేగుంట, నార్సింగి మండలాలలో రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి.

ఉమ్మడి మెదక్ జిల్లాలో గత 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలను వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లాలో కోహీర్ 10.0, మెదక్ జిల్లాలో పెద్ద నర్లాపూర్11.2, సిద్దిపేట జిల్లాలో అంగడి కిష్టాపూర్ 10.6 °C అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలితీవ్రత దృష్ట్యా పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, బాలింతలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

మెదక్ జిల్లా వ్యాప్తంగా ఈనెల 11, 14, 17వ తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ తేదీలు దగ్గర పడుతున్న కొద్ది జిల్లాల్లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. పలు పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా కాసుల వేట కొనసాగిస్తున్నారు. ఎక్కువ అభ్యర్థులు పోటీ చేసే జనరల్ స్థానాల్లో ఈ ధోరణి తారస్థాయిలో ఉంది. కొంతమంది అభ్యర్థులు అయితే తమ వద్ద డబ్బులు లేక అప్పులు చేసి మరి ఖర్చు పెడుతున్నారు.
Sorry, no posts matched your criteria.