Medak

News July 28, 2024

పటాన్‌చెరు: ప్రేమ పెళ్లి.. 6 నెలలకే వివాహిత సూసైడ్

image

ప్రేమించి పెళ్లి చేసుకున్న 6నెలలకే వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన అమీన్పూర్‌లో జరిగింది. APలోని గుంటూరుకు చెందిన హర్షిత, ఎడ్లపాడు చెందిన మహేశ్ పేరెంట్స్ సమక్షంలో ఫిబ్రవరి 23న పెళ్లి చేశారు. అమీన్పూర్ పరిధిలో అద్దె ఇంట్లో ఉంటుండగా మహేశ్‌కు ఉద్యోగం లేకపోవడంతో హర్షిత తండ్రి నెలకు రూ.30వేలు పంపాడు. ఇటీవల IT జాబ్ వచ్చినా మహేశ్ వెళ్లకపోగా ఆస్తిలో వాటా కోసం భార్యను వేధించగా మనస్తాపంతో సూసైడ్ చేసుకుంది.

News July 28, 2024

పటాన్‌చెరు: ప్రేమ పెళ్లి.. 6 నెలలకే వివాహిత సూసైడ్

image

ప్రేమించి పెళ్లి చేసుకున్న 6నెలలకే వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన అమీన్పూర్‌లో జరిగింది. APలోని గుంటూరుకు చెందిన హర్షిత, ఎడ్లపాడు చెందిన మహేశ్ పేరెంట్స్ సమక్షంలో ఫిబ్రవరి 23న పెళ్లి చేశారు. అమీన్పూర్ పరిధిలో అద్దె ఇంట్లో ఉంటుండగా మహేశ్‌కు ఉద్యోగం లేకపోవడంతో హర్షిత తండ్రి నెలకు రూ.30వేలు పంపాడు. ఇటీవల IT జాబ్ వచ్చినా మహేశ్ వెళ్లకపోగా ఆస్తిలో వాటా కోసం భార్యను వేధించగా మనస్తాపంతో సూసైడ్ చేసుకుంది.

News July 28, 2024

మెదక్‌లో కారు బీభత్సం.. మున్సిపల్ కార్మికుడి మృతి

image

మెదక్ పట్టణంలోని వడ్డెర కాలనీ వద్ద కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చి రోడ్డుపై పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుడు మైసయ్య(50)ను ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ క్రమంలో కారును అక్కడే వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. ఈ ప్రమాదంలో పదేళ్ల చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ఉదయం రోడ్డుపై పనిచేసే కార్మికులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు.

News July 28, 2024

అనారోగ్యంతో భార్య.. రోడ్డు ప్రమాదంలో భర్త మృతి

image

తూప్రాన్‌ మం. వెంకటాయపల్లికి చెందిన అశోక్, కనకమ్మ దంపతులు 20ఏళ్ల క్రితం సిద్దిపేట జిల్లా ములుగుకు వచ్చారు. వారి కొడుకు సాయికుమార్‌కు కావ్యతో పెళ్లైంది. కాగా 4నెలల క్రితం కావ్య అనారోగ్యంతో మృతిచెందింది. శనివారం కొత్తూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సాయి అక్కడికక్కడే మృతిచెందాడు. 4నెలల క్రితం తల్లి, తాజాగా తండ్రి మృతితో వారి ఏడాదిలోపు చిన్నారి అనాథగా మారింది. ఘటనపై కేసు నమోదైందని పోలీసులు తెలిపారు.

News July 28, 2024

లిక్క‌ర్ ధ‌ర‌లు భారీగా పెంచబోతున్నారు: ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు

image

ఇటీవ‌లే కాంగ్రెస్ ప్ర‌వేశ‌పెట్టిన 2024-25 బ‌డ్జెట్‌పై చ‌ర్చ సంద‌ర్భంగా ఎక్సైజ్ అంశంపై మాజీ మంత్రి హ‌రీశ్‌రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీర్లు, లిక్క‌ర్ ధ‌ర‌లు రాబోయే రోజుల్లో భారీగా పెంచ‌బోతున్న‌ట్లు బ‌డ్జెట్ అంచ‌నాలు ప‌రిశీలిస్తే స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతుంద‌ని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. ఈ విష‌యంలో కాంగ్రెస్ నాయ‌కులు త‌లదించుకోవాల‌ని ఆయన విమ‌ర్శించారు.

News July 27, 2024

లిక్క‌ర్ ధ‌ర‌లు భారీగా పెంచబోతున్నారు: ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు

image

ఇటీవ‌లే కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన 2024-25 బ‌డ్జెట్‌పై చ‌ర్చ సంద‌ర్భంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు ఎక్సైజ్ అంశంపై తీవ్రంగా స్పందించారు. బీర్లు, లిక్క‌ర్ ధ‌ర‌లు రాబోయే రోజుల్లో భారీగా పెంచ‌బోతున్న‌ట్లు బ‌డ్జెట్ అంచ‌నాలు ప‌రిశీలిస్తే స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతుంద‌ని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. ఈ విష‌యంలో కాంగ్రెస్ నాయ‌కులు త‌లదించుకోవాల‌ని ఆయన విమ‌ర్శించారు.

News July 27, 2024

మోదీ ప్రభుత్వం ఐదేళ్లు పాలిస్తుంది: కేంద్రమంత్రి రామదాస్ అథవాలే

image

NDA పార్టీల భాగస్వామ్యంతో మోదీ ప్రభుత్వం ఐదేళ్లు పాలిస్తుందని కేంద్ర మంత్రి రామదాస్ అథవాలే ధీమా వ్యక్తం చేశారు. విపక్ష నేత రాహుల్ గాంధీ రిజర్వేషన్లు రద్దు చేస్తారని అబద్దపు ప్రచారం చేసినా యూపీ, మహారాష్ట్ర, బెంగాల్ రాష్ట్రాల్లో సీట్లు తగ్గినా ఇతర అనేక రాష్ట్రాల్లో గణనీయంగా సీట్లు గెలుపొందినట్లు మంత్రి పేర్కొన్నారు. దక్షిణ భారతదేశంలో సీట్లతో పాటు ఓట్లు పెరిగాయన్నారు. రిజర్వేషన్ రద్దు కాలేదన్నారు.

News July 27, 2024

సంగారెడ్డి: 5 నెలల క్రితం LOVE మ్యారేజ్.. ఇంతలోనే విషాదం

image

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ PS పరిధిలో ఈరోజు విషాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానిక సిద్ధార్థ ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉండే మహేశ్, హర్షిత 5 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. కొంతకాలంగా భర్త మానసికంగా, శారీరకంగా వేధిస్తుండడంతో తట్టుకోలేక ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. హర్షిత తండ్రి అనిల్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News July 27, 2024

KCR ఒక్కరి వల్ల తెలంగాణ రాలేదు: MLA

image

నాటి KCR పాలనలో బానిస సంకెళ్ల నుంచి విముక్తి కల్పించి, తెలంగాణ ప్రజల్లో ధైర్యం నూరిపోసిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని కాంగ్రెస్ VKB జిల్లా చీఫ్, పరిగి MLA రామ్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అన్నారు. తెలంగాణ బిల్లు పాసైన రోజు పార్లమెంట్‌లో KCR లేరని, విజయశాంతి ఆల్రెడీ కాంగ్రెస్‌లో చేరిపోయారని అన్నారు. KCR ఒక్కరి వల్ల తెలంగాణ రాలేదని, కాంగ్రెస్ మిత్ర కూటములంతా కలిసి సోనియాగాంధీని ఒప్పించడంతో వచ్చిందన్నారు.

News July 27, 2024

సంగారెడ్డి: అబ్దుల్ కలామ్ పెన్సిల్ ఆర్టిస్ట్ నివాళి

image

భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ వర్ధంతిని ఈ రోజు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం కడపల్ గ్రామానికి చెందిన మూగ చిత్ర కళాకారుడు గూడూరు ఆగమప్ప అబ్దుల్ కలాం చిత్రపటాన్ని పెన్సిల్‌తో గీసి శనివారం నివాళులర్పించారు. భారతదేశాన్ని అభివృద్ధి దిశగా కృషి చేసిన అబ్దుల్ కలాం భారతరత్నతో పాటు అత్యున్నత పౌర పురస్కారాలు అందుకున్నారని ఆర్టిస్టు పేర్కొన్నాడు.