Medak

News April 17, 2025

టేక్మాల్: బైక్ యాక్సిడెంట్.. ఒకరి మృతి

image

టేక్మాల్ మండలం లక్ష్మన్ తండాకు చెందిన పొమ్లా నాయక్ బైక్ ఢీకొని మృతి చెందాడు. పోలీసుల వివరాలు.. టేక్మాల్‌కు చెందిన తలారి సతీశ్ తన బైక్‌తో ఎలకుర్తి గ్రామ శివారులో పొమ్లా నాయక్‌ను వెనకనుంచి బలంగా ఢీ కొట్టాడు. దీంతో పొమ్లా రోడ్డుపై పడి తీవ్ర గాయాలు కావడంతో మెదక్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ దయానంద్ తెలిపారు.

News April 17, 2025

నర్సాపూర్: తండ్రి హత్యకు ప్రయత్నించిన కొడుకు అరెస్ట్

image

తండ్రిపై దాడి చేసి చంపడానికి ప్రయత్నించిన కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నర్సాపూర్ ఎస్సై లింగం తెలిపిన వివరాల ప్రకారం.. నర్సాపూర్ మండలం చిన్నచింతకుంట గ్రామానికి చెందిన వడ్ల దశరథ్(60)పై ఆయన పెద్ద కుమారుడు నాగరాజు ఈనెల 12న ఆస్తి పంపకాలు చేయడం లేదని కత్తితో దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ కేసులో నాగరాజును బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

News April 17, 2025

ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి: మెదక్ ఎస్పీ

image

ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని, ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించాలని సూచించారు. నెలవారి నేర సమీక్షా సమావేశంలో పెండింగ్‌లో ఉన్న కేసులలో గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల్లో ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ చేయాలన్నారు.

News April 17, 2025

సర్వే వివరాలు పక్కాగా నమోదు చేయాలి: డీఈవో

image

మెదక్ జిల్లాలో ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించే యుడైస్ సర్వేలో పరిశీలించిన అంశాలను పక్కగా నమోదు చేయాలని జిల్లా విద్యాధికారి రాధా కిషన్ తెలిపారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. పాఠశాలలో విద్యార్థుల, ఉపాధ్యాయుల సంఖ్య, పాఠశాలల మౌలిక వసతుల వివరాలను పరిశీలించి, ఏమైనా తప్పులు ఉంటే యుడైస్ వెబ్ సైట్లో సరిదిద్దుకోవాలని పాఠశాల హెచ్ఎంలకు సూచించారు.

News April 16, 2025

కాంగ్రెస్ పాలనలో ప్రజల బతుకులు ఎడారి: హరీశ్ రావు

image

వేసవి నేపథ్యంలో రాష్ట్రంలోని పలుచోట్ల భూగర్భజలాలు తగ్గడం, నీటి ఎద్దడి పెరగడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ నేత సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు సాగు నీళ్ల కోసం రైతుల గోస పడితే.. ఇప్పుడు తాగు నీళ్ల కోసం ప్రజల ఘోష పడాల్సి వస్తుందని అన్నారు. కాంగ్రెస్‌ పాలనలో పొలాలు తడారిపోతున్నాయని.. ప్రజల బతుకులు ఎడారి అయిపోతున్నాయని ఆవేదన చెందారు.

News April 16, 2025

మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మి శారదా బదిలీ

image

మెదక్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మి శారదా బదిలీ అయ్యారు. మెదక్ జిల్లాకు కొత్త న్యాయమూర్తిగా జగిత్యాల జిల్లా నుంచి నీలిమ రానున్నారు. ఇక్కడి నుంచి లక్ష్మి శారదా సూర్యాపేటకు బదిలీ అయ్యారు. లక్ష్మి శారదా ఇక్కడ 2022 జూన్ 2 నుంచి పనిచేస్తున్నారు. లక్ష్మి శారదా హయాంలో 2వ అంతస్తు నిర్మాణానికి శంకుస్థాపన, కొత్త కోర్టులు మంజూరు చేయించారు.

News April 16, 2025

రామాయంపేటలో వడదెబ్బతో వృద్ధుడి మృతి

image

వడదెబ్బతో వృద్ధుడు మృతి చెందిన ఘటన రామాయంపేటలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. రామాయంపేట పట్టణానికి చెందిన ఎరుకల బాలయ్య(82) కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. రోజు మాదిరిగానే సోమవారం కూడా పనికి వెళ్లారు. తిరిగి వచ్చిన ఆయన నీరసంగా ఉందని ఇంట్లోనే ఉన్నాడు. మంగళవారం రాత్రి అకస్మాత్తుగా మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

News April 16, 2025

రోడ్లపై ధాన్యం ఆరబోసి ప్రమాదాలకు కారణం కావొద్దు: ఎస్పీ

image

రైతులు రోడ్లపై ధాన్యం ఆరబోసి ప్రమాదాలకు కారణం కావొద్దని మెదక్ SP ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. రోడ్లపై వరి ధాన్యం ఆరబెట్టడంతో రోడ్లు ఇరుకుగా మారి రోడ్డు ప్రమాదాలు జరుగుతాయన్నారు. అదేవిధంగా ధాన్యంపై మోటార్ సైకిల్ వెళ్తే స్కిడ్ అయ్యి పడే అవకాశం ఉందన్నారు. రాత్రి సమయాల్లో రోడ్డుపై ధాన్యం కుప్పలు చేసి బండరాళ్లు పెట్టడంతో వాహనదారులు ప్రమాదాలుకు గురవతున్నారని, ఈ విషయాన్ని రైతులు గమనించాలన్నారు.

News April 16, 2025

భూభారతి చట్టంపై అవగాహన కల్పించాలి: కలెక్టర్

image

భూ భారతి చట్టంపై మండలాల్లో అవగాహన సదస్సులను పక్కాగా నిర్వహించాలని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. ఆలాగే జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను త్వరితగతిన ప్రారంభించి కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ఆర్డీవోలు,తహశీల్దార్లు, సివిల్ సప్లై అధికారులతో భూ భారతి చట్టం, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై సమీక్షించారు.

News April 16, 2025

మెదక్: రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు మృతి

image

రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు మృతిచెందారు. ఈ ప్రమాదం సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలం బాచుపల్లిలో మంగళవారం రాత్రి జరిగింది. రేగోడ్ మండలంలోని పట్టెపొలం తండాకు చెందిన లావుడియా సక్రీ బాయి, సుభాష్ బైక్‌పై వెళ్తున్నారు. నిజాంపేట్ మండలం బాచుపల్లి శివారులో లారీ ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.