Medak

News July 22, 2024

MDK: రైతుబీమా దరఖాస్తులకు ఆగస్టు 5 చివరి తేదీ

image

రైతుబీమా పథకానికి అర్హులైన కొత్త రైతుల నుంచి వ్యవసాయ శాఖ దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఆగస్టు 5 వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు రైతుబీమాకు దరఖాస్తు చేసుకోని 18 నుంచి 59 ఏండ్ల వయసు గల రైతులు ఏఈవోలకు దరఖాస్తులు ఇవ్వాలని సూచించింది. ఈనెల 28 వరకు పట్టాదారు పాస్‌బుక్‌ వచ్చిన రైతులు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.

News July 22, 2024

MDK: ఫోన్ కొనివ్వలేదని విద్యార్థిని సూసైడ్

image

సెల్‌ఫోన్ కొనివ్వలేదన్న మనస్తాపంతో డిగ్రీ విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. SI బాల్‌రాజు తెలిపిన వివరాలు.. చేగుంట మండలం రుక్మాపూర్ గ్రామానికి చెందిన రుచిత(18) మెదక్ డిగ్రీ కాలేజీలో ఫస్టియర్ చేస్తుంది. అక్కడే హాస్టల్‌కు వెళ్తానని, ఫోన్ ఇప్పించమని తండ్రిని కోరింది. కొన్ని రోజుల తర్వాత కొనిస్తానని చెప్పి తండ్రి పొలానికి వెళ్లాడు. దీంతో మనస్తాపానికి గురైన రుచిత ఇంట్లో ఉరేసుకుంది. ఘటనపై కేసు నమోదైంది.

News July 22, 2024

భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండండి: మెదక్ ఎస్పీ

image

ఉమ్మడి జిల్లాలో మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ అన్నారు. ఎలాంటి సమస్య ఉన్నా వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజలు ఎవరూ చేపల వేటకు వెళ్లొద్దని, పొలాల వద్ద రైతులు జాగ్రత్తంగా ఉండాలని చెప్పారు. విపత్కర సమయంలో పోలీస్ కంట్రోల్ నంబర్ 8712657888, డయల్ 100కు ఫోన్ చేయాలన్నారు.

News July 22, 2024

మెదక్: ప్రభుత్వ వైద్య కళాశాలను పరిశీలించిన కలెక్టర్

image

మెదక్ పట్టణంలోని ప్రభుత్వ వైద్య కళాశాలను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. వైద్య కళాశాలను క్షుణ్ణంగా పరిశీలించి మెడికల్ సూపరింటెండెంట్‌కు సూచనలు, ఆదేశాలు చేశారు. వైద్య కళాశాలకు డాక్టర్లు, సిబ్బందిని నియమించుకోవడం కోసం నోటిఫికేషన్ విడుదల చేయాలని సూచించారు. ప్రిన్సిపాల్ రవీంద్ర కుమార్, సూపరింటెండెంట్‌ చంద్ర శేఖర్ పాల్గొన్నారు.

News July 21, 2024

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఫైర్‌

image

కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి పాతపాట పాడారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ సమావేశం అనంతరం మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఉత్తమ్‌ అవాకులు చెవాకులు పేలి.. తన అవగాహన రాహిత్యాన్ని మరోసారి బయటపెట్టుకున్నారని ఆయన విమర్శించారు.

News July 21, 2024

HYD: క్షయకు BCG టీకాతో చెక్

image

HYD, RR, MDCL, VKB జిల్లాల పరిధిలో పెద్దలకు BCG టీకా అందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. క్షయ వ్యాధిని అంతం చేసే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. ఇందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టులో అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే మేడ్చల్ జిల్లాలో TB వ్యాధిగ్రస్థులను గుర్తించేందుకు, సర్వే నిర్వహించి, శాంపిల్స్ సేకరించి టెస్టులు చేస్తున్నారు.

News July 21, 2024

బల్కంపేట ఎల్లమ్మకు బోనం సమర్పించిన మంత్రి పొన్నం

image

సికింద్రాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి ఆదివారం హుస్నాబాద్ ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాలు అనంతరం బోనం సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రిని ఆలయ పూజారులు శాలువాతో సన్మానించి ప్రత్యేక పూజలు అనంతరం తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.

News July 21, 2024

మెదక్: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

image

భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి సూచించారు. ఏ సమయంలో అయినా ఎలాంటి ప్రమాదం తలెత్తిన క్షణాలలో అక్కడకు చేరుకొనే విధంగా పోలీస్ యంత్రాంగం సిద్ధంగా ఉన్నదని సిబ్బందన్నారు. విపత్కర సమయాల్లో సహాయం కోసం పోలీస్ కంట్రోల్ రూం నంబర్ 87126 57888, డయల్ 100కి లేదా దగ్గరలో ఉన్న పోలీస్ వారికి సమాచారం అందిస్తే తక్షణ సహాయక చర్యలు చేపడతామన్నారు.

News July 21, 2024

సంగారెడ్డి: రేపు ప్రజావాణి కార్యక్రమం

image

సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో 22వ తేదీన ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ప్రజల నుంచి నేరుగా అధికారులు వినతి పత్రాలు స్వీకరిస్తారని చెప్పారు. సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News July 21, 2024

మెదక్: గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న 3,703 మంది మల్టీపర్పస్ ఉద్యోగుల వేతనాల కోసం రూ. 24.89 కోట్ల నిధులు విడుదలయ్యాయి. నిధులను విడుదల చేస్తూ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ అనిత రామచంద్రన్ ఆదేశాలు జారీ చేశారు. సిద్దిపేట జిల్లాకు రూ. 11,75,72,000, సంగారెడ్డి జిల్లాకు రూ. 8,09,97,000, మెదక్ జిల్లాకు రూ. 5,03,97,500 విడుదలయ్యాయి.