Medak

News March 12, 2025

మెదక్: రూ.12 వేల లంచం కోసం ఆశపడి.. ఏసీబీకి చిక్కి

image

రూ.12 వేల లంచం కోసం ఆశపడి బంగారు భవిష్యత్ ఉన్న ప్రభుత్వ ఉద్యోగి ఏసీబీకి పట్టుబడ్డాడు. మెదక్ పురపాలక సంఘంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ నకిరేకంటి జానయ్య గెల్లి శైలజ తన సోదరుడు శ్రీనివాస్‌కు చెందిన 605 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఓపెన్ ప్లాట్‌పై దరఖాస్తుపై విచారణ, మ్యూటేషన్ కోసం రూ.20 వేల లంచం డిమాండ్ చేయగా.. రూ.12 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడు.

News March 12, 2025

మెదక్: దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: కలెక్టర్

image

మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో దివ్యాంగుల ప్రజావాణి కార్యక్రమం స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ స్వయంగా దివ్యాంగుల వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… దివ్యాంగుల కోసం ప్రత్యేక ప్రజావాణి విశేషణ స్పందన లభిస్తుందని అన్నారు.

News March 11, 2025

మెదక్: యువకుడి ఆత్మహత్య

image

కుటుంబ కలహాలతో యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మెదక్ జిల్లా నార్సింగ్ మండలంలో జరిగింది. స్థానికుల వివరాలిలా.. నార్సింగ్‌కు చెందిన యువకుడు స్వామి(38) ఇటీవల భార్య కాపురానికి రాకపోవడంతో మద్యంకు బానిసగా మారారు. సోమవారం రాత్రి ఇంట్లో గొడవపడి బయటకు వెళ్లిన స్వామి వల్లూరు అడవి ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.

News March 11, 2025

బాలిక చేయ్యి పట్టుకొని దాడి.. నిందితుడికి జైలు: ఎస్పీ

image

బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తి జైలు శిక్ష పడినట్లు మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. 2018 జనవరిలో చేగుంట మండలం చిట్టోజిపల్లికి చెందిన చల్మెడ సురేశ్.. ఓ బాలిక చెయ్యి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించి, కొట్టి అవమానించాడు. దీనిపై అప్పట్లో కేసు నమోదు కాగా విచారించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీ శారద నిందితుడికి 5 ఏళ్ల జెలు శిక్ష, రూ.30 వేల జరిమానా విధించినట్లు SP చెప్పారు.

News March 11, 2025

గవర్నర్ ప్రసంగానికి కేసీఆర్: BRS

image

మార్చి 12న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ముందుగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగం ఉండనుంది. కాగా రేపు జరిగే అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ హాజరై గవర్నర్ ప్రసంగం వింటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం మారిన తర్వాత కేసీఆర్ ఇంతవరకు అసెంబ్లీ సమావేశాలకు హాజరై మాట్లాడింది లేదు. మరి ఇప్పుడైనా వస్తారో లేదో అంటే వేచి చూడాల్సిందే !

News March 11, 2025

ఎమ్మెల్సీ అభ్యర్థులను చూసి షాకయ్యా: జగ్గారెడ్డి

image

ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన తర్వాత మైండ్ బ్లాంక్ అయిందని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. ఏం మాట్లాడాలో తెలియని షాక్ లో ఉన్నానాని, తానెందుకు షాక్ అయ్యానో భవిష్యత్తులో తెలుస్తుందని, సమయం వచ్చినప్పుడు మాట్లాడుతానన్నారు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ అడిగాను, నేను ఢిల్లీ వెళ్లే సమయానికి రాహుల్, ఖర్గే, కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో లేరని పేర్కొన్నారు.

News March 11, 2025

మెదక్: ‘నిరుద్యోగ యువతి, యువకులకు వృత్తి నైపుణ్య శిక్షణ’

image

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యువజన సర్వీసుల శాఖ వారిచే ఏర్పాటు చేసిన వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో నిరుద్యోగ యువతీ, యువకులు వివిధ స్వయం ఉపాధి కోర్సులకు శిక్షణ ఇవ్వడానికి 12వ బ్యాచ్ ప్రారంభమవుతున్నట్లు మెదక్ జిల్లా యువజన క్రీడాధికారి దామోదర్ రెడ్డి పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 15 లోపు మెదక్‌లోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు.

News March 11, 2025

కొడుకులు పట్టించుకోవడం లేదు.. కలెక్టర్‌కు దంపతుల ఫిర్యాదు

image

వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్ గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు కొడుకులు పట్టించుకోవడం లేదని జిల్లా కలెక్టర్‌ రాహుల్ రాజ్‌కు ఫిర్యాదు చేశారు. దేశి కోడయ్య (91), శివలక్ష్మి (85) దంపతులకు సత్యనారాయణ, కాశీనాథ్ కుమారులున్నారు. ఆస్తులన్నీ తీసుకున్న కొడుకులు వృద్ధాప్యంలో పట్టించుకోవడం లేదని ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వృద్ధులకు న్యాయం చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

News March 11, 2025

మెదక్: ప్రజావాణి అర్జీలకు పరిష్కారం చూపాలి: కలెక్టర్

image

ప్రజావాణి అర్జీలకు గుణాత్మక పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రభుత్వ జిల్లా అధికారులకు సూచించారు. టైం బాండ్‌లో ప్రజా ఫిర్యాదులు, వినతులు పరిష్కరించాలన్నారు. మెదక్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. అదనపు కలెక్టర్ నగేష్, డీఆర్ఓ భుజంగరావు, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ శ్రీనివాసరావులతో కలిసి ఫిర్యాదులు స్వీకరించారు.

News March 10, 2025

మెదక్: ప్రజావాణి వినతులు స్వీకరించిన ఎఎస్పీ

image

మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా అదనపు ఎస్పీ ఎస్.మహేందర్ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం ఆదేశించారు.