Medak

News July 15, 2024

మెదక్: పోస్టాఫీసులో 87 ఉద్యోగాలు

image

10వ తరగతి అర్హతతో BPM/ABPM జాబ్స్ భర్తీ చేయనున్నారు. మెదక్ డివిజన్‌లో 42, సంగారెడ్డి డివిజన్‌లో 45 పోస్టులను పోస్టల్ డిపార్ట్‌‌మెంట్ భర్తీ చేయనుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఎంపికైన వారికి BPM‌కు రూ.12 వేలు+అలవెన్సులు, ABPMకు రూ.10 వేలు+అలవెన్సులు శాలరీ ఇస్తారు. పూర్తి వివరాలకు www.appost.gdsonlineను సంప్రదించవచ్చు. SHARE IT

News July 15, 2024

సంగారెడ్డి: చిన్నారిని అత్యాచారం చేసిన వ్యక్తికి 20 ఏళ్ల జైలు

image

ఐదు సంవత్సరాల చిన్నారిపై అత్యాచారం చేసిన వ్యక్తికి 20 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ సంగారెడ్డిలోని ఫోక్సో కోర్టు న్యాయమూర్తి జయంతి సోమవారం తీర్పు ఇచ్చారు. పటాన్ చెరువులోని ఆల్విన్ కాలనీకి చెందిన నవీన్(30) 2018లో పక్కింటి చిన్నారిపై అత్యాచారం చేశారు. నేరం రుజువు కావడంతో నవీన్‌కు 20 సంవత్సరాల జిల్లా శిక్ష, రూ. 20వేల జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు. పోలీసులను ఎస్పీ రూపేష్‌ను అభినందించారు.

News July 15, 2024

జహీరాబాద్-తాండూర్ రైల్వే లైన్ సర్వే పూర్తి

image

2023-24 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రైల్వే రంగం అభివృద్ధికి తెలంగాణకు ప్రాధాన్యం కల్పించారు. తెలంగాణవ్యాప్తంగా రూ.50,848 కోట్లతో 2,647 కిలోమీటర్ల మేర నూతన లైన్లు విస్తరించేలా ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా వికారాబాద్‌ జిల్లా తాండూర్‌ నుంచి జహీరాబాద్‌కు 75 కిలోమీటర్ల మేర సుమారు రూ.1,350 కోట్లతో కొత్త రైల్వేలైన్‌ వేయనున్నారు. సర్వే పనులు సైతం పూర్తయ్యాయి.

News July 15, 2024

సిద్దిపేట: బావపై బామ్మర్ది దాడి.. మృతి

image

బామ్మర్ది దాడిలో బావ మృతిచెందిన ఘటన మేడ్చల్‌ జిల్లాలో జరిగింది. సిద్దిపేట జిల్లా కుకునూరు మం. తిప్పాపురం గ్రామానికి చెందిన రాజు(35) దంపతులు భార్య ఫ్యామిలీతో కలిసి జవహర్‌నగర్‌‌లో ఉంటున్నారు. శనివారం రాత్రి రాజు మద్యం మత్తులో భార్య, అత్తపై చేయి చేసుకున్నాడు. దీంతో బామ్మర్ది చందు పక్కనే ఉన్న చెక్కతో తలపై కొట్టాడు. తీవ్రంగా గాయపడిన రాజును గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయాడు.

News July 15, 2024

పటాన్‌చెరు MLA పార్టీ మార్పుపై.. జోరుగా చర్చలు

image

పటాన్‌చెరు MLA మహిపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరనున్నారనే ప్రచారం స్థానికంగా చర్చనీయాంశమైంది. మహిపాల్‌రెడ్డి తన అనుచరులతో కాంగ్రెస్‌లో చేరికపై చర్చ జరపగా ఇందుకు పలువురు ఆసక్తి చూపనట్లు తెలిసింది. మరోవైపు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నాయకులు ఆయన్ని చేర్చుకోవద్దని అంటున్నారు. స్థానిక కాంగ్రెస్ నేత శ్రీనివాస్‌గౌడ్‌ వర్గం రహస్య సమావేశంతో ఆయన చేరికతో పార్టీ చీలిపోతుందని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

News July 15, 2024

ఆదిలాబాద్‌-పటాన్‌చెరు రైల్వే లైన్ సర్వే..

image

ఆదిలాబాద్‌-పటాన్‌చెరు రైల్వేలైన్ సర్వే పనులు కల్హేర్‌ మండలంలో NH-161 వెంట నిర్వహించారు. మహాదేవుపల్లి, మాసాన్‌పల్లి, దేవునిపల్లి, బాచేపల్లి మీదుగా నిజాంపేట్‌ మీదుగా లైన్‌ వేయనున్నారు. మొత్తం 317KM రైల్వేలైన్‌ ఏర్పాటుకు ద.మ రైల్వే అప్పట్లో రూ.5,700 కోట్లు మంజూరు చేసింది. ఇందులో భాగంగా 2వ విడత సర్వే చేస్తున్నారు. దీనికి 12ఏళ్ల క్రితం సర్వే చేయగా.. తిరిగి అదే మార్గంలో సర్వే చేసి గుర్తులు వేస్తున్నారు.

News July 15, 2024

సనాతన ధర్మంలో మహిళలకు అత్యున్నత స్థానం

image

భారతీయ సనాతన ధర్మంలో మహిళలకు అత్యున్నతమైన స్థానం కల్పించినట్లు ప్రముఖ ఆధ్యాత్మిక వక్త సత్యవాణి పేర్కొన్నారు. సదాశివపేటలో వీరశైవ సమాజం, ఆధ్వర్యంలో శివ పంచాక్షరి జపయజ్ఞ సామూహిక ఇష్ట లింగార్చన మహోత్సవం నిర్వహిస్తున్నారు. సృష్టిలో మహిళా మూర్తులకు ప్రత్యేకమైన స్థానం ఉందన్నారు. సమాజ అధ్యక్షులు చీల మల్లన్న, విశ్వనాథం, శ్రీశైలం, వీరేశం, బసవరాజు పాల్గొన్నారు.

News July 15, 2024

సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ రఘునందన్ సూచనలు

image

సిద్దిపేట అర్బన్ మండలం బక్రీ చెప్యాల శివారులోని బీజేపీ జిల్లా కార్యాలయం వద్ద ఆదివారం బీజేపీ జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డితో కలిసి మెదక్ ఎంపీ రఘునందన్ రావు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర పార్టీ నాయకులను చేర్చుకోవడంపై ఉన్న శ్రద్ధ ప్రజాసమస్యలు, పరిపాలనపై పెడితే బాగుంటుందన్నారు.

News July 14, 2024

మెదక్: బైక్, కారు ఢీకొని ఒకరి మృతి

image

రామాయంపేటలో హైవే- 44వ వై జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రామాయంపేట నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న బైక్‌ను వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నారాయణఖేడ్‌కు చెందిన రంగమ్మ(70) మృతిచెందగా, బాబురావు అనే వ్యక్తికి గాయాలయ్యాయి. అతన్ని రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

News July 14, 2024

సిద్దిపేట పేరు నిలబెట్టారు.. MLAగా గర్వంగా ఉంది: హరీశ్ రావు

image

పది ఫలితాలు గర్వకారణమని, కన్న తండ్రి లెక్క ఆనందంగా ఉందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 75 మంది విద్యార్థులకు ట్యాబ్‌లు అందజేశారు. మిమ్మల్ని కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల రుణం తీర్చుకునే అవకాశమని, ఈ ఫలితాలను స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో మంచి స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. వరుసగా ఐదు సార్లు అగ్రగామిగా నిలిచి సిద్దిపేట పేరు నిలబెట్టారని అభినందించారు.