Medak

News January 10, 2025

మునిపల్లి రిసార్ట్‌లో జంట సూసైడ్

image

పండగపూట సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. మునిపల్లి మండలం భూసరెడ్డిపల్లి గ్రామ శివారులోని రిసార్ట్‌లో జంట సూసైడ్ చేసుకుంది. స్థానికుల సమాచారం.. ఓ జంట గురువారం సాయంత్రం రిసార్ట్‌లో రూం అద్దెకు తీసుకున్నారు. ఉదయం రిసార్ట్ యజమాని పరిశీలించగా ఇద్దరు ఉరివేసుకొని కనిపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతులు ఎవరు అనేది తెలియాల్సి ఉంది.

News January 10, 2025

మెదక్: మోడల్ స్కూల్లో ప్రవేశాలు.. మిస్ చేసుకోకండి

image

తెలంగాణ మోడల్ స్కూల్‌లో 2025-26 ఏడాదిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 6వ తరగతిలో 100 సీట్లు, 7 నుంచి10వ ఖాళీ సీట్లు భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరి 28 వరకు అప్లై చేసుకోవాలి. APRIL 13న ప్రవేశ పరీక్ష ఉంటుందని అధికారులు తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఆసక్తి గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఝరాసంగం మోడల్ స్కూల్‌ ప్రిన్సిపల్ తేనావతి తెలిపారు.

News January 10, 2025

మెదక్: చనిపోయిన 5 నెలల తర్వాత పోస్టుమార్టం

image

రామాయంపేట మం. సుతారిపల్లికి చెందిన లక్ష్మి(48) మృతదేహానికి 5నెలల తర్వాత పోస్టుమార్టం నిర్వహించారు. లక్ష్మి చికిత్స పొందుతూ గతేడాది సెప్టెంబర్‌లో చనిపోగా అంత్యక్రియలు నిర్వహించారు. కాగా తన తల్లి చికిత్స చేస్తుండగానే చనిపోగా వైద్యులు ఆ విషయం చెప్పకుండా డబ్బులు తీసుకున్నాకే మృతిచెందినట్లు చెప్పారని ఆమె కుమార్తె HYDలో ఫిర్యాదు చేసింది. దీంతో గురువారం గాంధీ ఆస్పత్రి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు.

News January 9, 2025

మెదక్: గణతంత్ర దినోత్సవానికి ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

image

ఈనెల 26న నిర్వహించే గణతంత్ర దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. కలెక్టరేట్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. వేడుకలకు సంబంధించిన వేదికను తగిన శ్రద్ధతో ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో సురక్షితమైన వాతావరణంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు చర్యలు చెప్పటాలని కలెక్టర్ సూచించారు.

News January 9, 2025

సిద్దిపేట: విద్యార్థులను చితకబాదిన ఫిజికల్ డైరెక్టర్

image

విద్యార్థులను టీచర్ చితకబాదిన ఘటన సిద్దిపేట(D) దుద్దెడ గురుకులలో జరిగింది. టెన్త్,ఇంటర్ విద్యార్థులకు ఉదయం నిర్వహించిన స్టడీ అవర్స్‌కు ఆలస్యంగా వచ్చిన 30 మంది విద్యార్థులను PD వాసు ఒళ్లంతా వాతలు వచ్చేలా కొట్టాడు. తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని పిల్లలను చూసి కన్నీటిపర్యంతమయ్యారు. PDని సస్పెండ్ చేయాలని ఆందోళనకు దిగారు. తీవ్రంగా గాయపడిన వారికి సిద్దిపేటలోని ఓ ఆస్పత్రిలో చికిత్స చేయించినట్లు సమాచారం.

News January 9, 2025

తిరుపతి తొక్కిసలాటపై మంత్రి దామోదర దిగ్ర్భాంతి

image

తిరుపతి తొక్కిసలాట ఘటనలో భక్తులు మృతి చెందడంపై రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. తొక్కిసలాటలో గాయపడి, చికిత్స పొందుతున్న భక్తులు త్వరగా కోలుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి, టీటీడీకి ఆయన విజ్ఞప్తి చేశారు.

News January 9, 2025

మెదక్: జిల్లాలో టీబీ నియంత్రణకు విశేష కృషి: కలెక్టర్

image

మెదక్ జిల్లాలో టీబీ నియంత్రణకు విశేష కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. బుధవారం మెదక్ పట్టణంలోని జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్‌తో కలిసి జాతీయ టీబీ బృందం సభ్యులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. డెంగ్యూ, మలేరియా వ్యాధుల నివారణకు ఆరోగ్య శాఖ యంత్రాంగం పకడ్బందీగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

News January 8, 2025

మెదక్: మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం: డిప్యూటీ సీఎం

image

మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా సోలార్ పవర్ ప్లాంట్‌ల ఏర్పాటు ప్రగతిపై బుధవారం ప్రజాభవన్ నుంచి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్కతో కలసి వీసీ నిర్వహించారు. స్వయం సహాయక సంఘాల ద్వారా 1000 మెగావాట్ల సోలార్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు.. త్వరలో టెండర్లు ఖరారు చేస్తామన్నారు.

News January 8, 2025

మెదక్: గురుకులాల్లో అడ్మిషన్లు.. మిస్ చేసుకోకండి

image

రాష్ట్రంలోని SC, ST, BC, జ‌న‌ర‌ల్‌ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 2025-26కి 5వ తరగతి తోపాటు 6, 7, 8, 9 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరి 1లోగా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ఆసక్తి, అర్హత ఉన్న మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లా విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. పూర్తి వివరాలు https://tgcet.cgg.gov.in లో చూడొచ్చు.

News January 8, 2025

పటాన్‌చెరు: బైక్‌లో చున్నీ ఇరుక్కొని మహిళ మృతి

image

బైక్‌లో చున్నీ చిక్కుకొని మహిళ మృతి చెందిన ఘటన అమీన్‌పూర్‌లో నిన్న జరిగింది. పటాన్‌చెరు డివిజన్‌లోని జీపీ కాలనీకి చెందిన నవదీప్ దూలపల్లిలో MCA చేస్తున్నాడు. కాలేజీలో పేరెంట్స్ మీటింగ్‌కు తల్లి రజితను బైక్‌పై తీసుకెళ్తుండగా ఆమె చున్ని బైక్ టైరులో చిక్కుకొని కింద పడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదైనట్లు SI దుర్గయ్య తెలిపారు.

error: Content is protected !!