Medak

News January 25, 2026

మెదక్ : పరేడ్‌ రిహార్సల్స్‌ పరిశీలన

image

గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జిల్లా పోలీస్‌ కార్యాలయ ప్రాంగణంలోని పరేడ్‌ గ్రౌండ్‌లో ఆదివారం రిహార్సల్స్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అదనపు ఎస్పీ మహేందర్‌ పర్యవేక్షించి, పోలీస్‌ దళాల విన్యాసాలను పరిశీలించారు. వేడుకల రోజున ఎలాంటి పొరపాట్లు జరగకుండా సజావుగా నిర్వహించేందుకు అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. బందోబస్తు ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు.

News January 25, 2026

మెదక్ పోలీస్ కార్యాలయం త్రివర్ణ శోభితం

image

గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో జిల్లా పోలీస్ కార్యాలయం శనివారం రాత్రి విద్యుత్ దీపాల అలంకరణతో త్రివర్ణమయంగా మారింది. ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు పర్యవేక్షణలో పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో వేడుకలకు సర్వం సిద్ధమైంది. ఈ వేడుకలకు కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు అధికారులు పరేడ్ గ్రౌండ్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

News January 24, 2026

MDK: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

బైక్ నియంత్రణ తప్పి కింద పడటంతో తలకు తీవ్ర గాయాలై యువకుడు మృతి చెందినట్లు హవేలిఘనపూర్ ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. దూప్ సింగ్ తండాకు చెందిన సుభాష్(34) మెదక్ నుంచి ఇంటికి వస్తుండగా శివారులో ఈ ప్రమాదం జరిగింది. చికిత్స నిమిత్తం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించగా, అక్కడ కోలుకోలేక మరణించాడు. కుటుంబంలో చేతికి వచ్చిన కొడుకు మృతి చెందడంతో తండాలో విషాదం నెలకొంది.

News January 23, 2026

సైన్స్ ఫెయిర్‌లో మెదక్ జిల్లాకు 3 బహుమతులు

image

సంగారెడ్డి జిల్లా కొల్లూరులో జరిగిన దక్షిణ భారత స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో మెదక్ జిల్లా ప్రతిభ చాటిందని డిఈఓ విజయ తెలిపారు. టీచర్ ఎగ్జిబిట్ విభాగంలో కొడపాక జడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయుడు వెంకటరమణ ప్రథమ స్థానం సాధించారు. విద్యార్థుల విభాగంలో తూప్రాన్ గీత స్కూల్ విద్యార్థిని మహతి 3వ స్థానం, సిద్ధార్థ రూరల్ స్కూల్ విద్యార్థి అక్షయ్ 4వ స్థానంలో నిలిచారు. విజేతలను డిఈఓ అభినందించారు.

News January 23, 2026

మెదక్: 25న 16వ జాతీయ ఓటరు దినోత్సవ వేడుకలు

image

ఈ నెల 25న 16వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలో ఓటరు దినోత్సవ వేడుకలను అన్ని శాఖల సమన్వయంతో ప్రజల భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ నగేశ్ ఆదేశించారు.
కలెక్టరేట్ కార్యాలయంలో ఓటర్ అవగాహన ర్యాలీపై అధికారులతో సమీక్షించారు. నా భారత్ – నా ఓటు అనే నినాదంతో అర్హత గల ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా వివిధ రకాల కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్య పరచాలన్నారు.

News January 23, 2026

MDK: ‘ఆపరేషన్ స్మైల్’.. 49 మంది చిన్నారులకు విముక్తి

image

మెదక్ జిల్లాలో ‘ఆపరేషన్ స్మైల్’ ద్వారా ఇప్పటివరకు 49 మంది బాలకార్మికులను రక్షించి తల్లిదండ్రులకు అప్పగించినట్లు అదనపు ఎస్పీ మహేందర్ తెలిపారు. మరో 12 మంది పిల్లలను సంరక్షణ కేంద్రాలకు తరలించామని, ఈ విషయంలో జిల్లావ్యాప్తంగా 41 కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. పనిలో చేరిన నలుగురు పిల్లలను తిరిగి బడిలో చేర్పించామని, బాల్యానికి అండగా నిలుస్తామని డీపీఓ అధికారుల సమావేశంలో ఆయన స్పష్టం చేశారు.

News January 23, 2026

MDK: ‘ఆపరేషన్ స్మైల్’.. 49 మంది చిన్నారులకు విముక్తి

image

మెదక్ జిల్లాలో ‘ఆపరేషన్ స్మైల్’ ద్వారా ఇప్పటివరకు 49 మంది బాలకార్మికులను రక్షించి తల్లిదండ్రులకు అప్పగించినట్లు అదనపు ఎస్పీ మహేందర్ తెలిపారు. మరో 12 మంది పిల్లలను సంరక్షణ కేంద్రాలకు తరలించామని, ఈ విషయంలో జిల్లావ్యాప్తంగా 41 కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. పనిలో చేరిన నలుగురు పిల్లలను తిరిగి బడిలో చేర్పించామని, బాల్యానికి అండగా నిలుస్తామని డీపీఓ అధికారుల సమావేశంలో ఆయన స్పష్టం చేశారు.

News January 23, 2026

MDK: ‘ఆపరేషన్ స్మైల్’.. 49 మంది చిన్నారులకు విముక్తి

image

మెదక్ జిల్లాలో ‘ఆపరేషన్ స్మైల్’ ద్వారా ఇప్పటివరకు 49 మంది బాలకార్మికులను రక్షించి తల్లిదండ్రులకు అప్పగించినట్లు అదనపు ఎస్పీ మహేందర్ తెలిపారు. మరో 12 మంది పిల్లలను సంరక్షణ కేంద్రాలకు తరలించామని, ఈ విషయంలో జిల్లావ్యాప్తంగా 41 కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. పనిలో చేరిన నలుగురు పిల్లలను తిరిగి బడిలో చేర్పించామని, బాల్యానికి అండగా నిలుస్తామని డీపీఓ అధికారుల సమావేశంలో ఆయన స్పష్టం చేశారు.

News January 23, 2026

మెదక్: దుర్గం చెరువులో యువ వ్యాపారి డెడ్ బాడీ

image

మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి కింద ఓ యువకుడి మృతదేహం లభ్యమవ్వడం కలకలం రేపింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని బయటకు తీశారు. మృతుడిని కేపీహెచ్‌బీ ప్రగతినగర్‌కు చెందిన కిరాణా వ్యాపారి నిమ్మల నరేశ్ (25)గా గుర్తించారు. ఇతని స్వగ్రామం మెదక్ జిల్లా శంకరంపేట మండలం కొత్తపేట అని పోలీసులు తెలిపారు. నరేశ్ మృతికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News January 22, 2026

రామాయంపేటలో నిధుల దుర్వినియోగంపై విచారణకు ఆదేశం

image

రామాయంపేట మున్సిపాలిటీలో నిధుల దుర్వినియోగంపై విచారణకు కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. గత రెండేళ్లుగా జరిగిన ఆర్థిక లావాదేవీలు, పనుల ఖర్చులపై నిజానిజాలు తేల్చేందుకు జిల్లా ఆడిట్ అధికారిని విచారణాధికారిగా నియమించారు. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. త్వరలోనే ఆడిట్ అధికారి పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదిక సమర్పించనున్నారు.