India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మెదక్ జిల్లాలో గల నాలుగు పురపాలక సంఘాలలో మొదటి రోజు బుధవారం 26 నామినేషన్లు దాఖలు అయ్యాయి. మెదక్-12, రామాయంపేట- 7 తూప్రాన్ – 4, నర్సాపూర్- 3 చొప్పున నామినేషన్లు సమర్పించారు. పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్న అభ్యర్థులు మొదటి రోజు తమ ఇంటి పన్ను బకాయిలు, నల్లా పన్నుబకాయలు చెల్లిస్తూ నో డ్యూ సర్టిఫికెట్లు తీసుకుంటూ నామినేషన్ పత్రాల కోసం అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడంలో తలమునకలయ్యారు.

మెదక్ జిల్లాలో గల నాలుగు పురపాలక సంఘాలలో మొదటి రోజు బుధవారం 26 నామినేషన్లు దాఖలు అయ్యాయి. మెదక్-12, రామాయంపేట- 7 తూప్రాన్ – 4, నర్సాపూర్- 3 చొప్పున నామినేషన్లు సమర్పించారు. పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్న అభ్యర్థులు మొదటి రోజు తమ ఇంటి పన్ను బకాయిలు, నల్లా పన్నుబకాయలు చెల్లిస్తూ నో డ్యూ సర్టిఫికెట్లు తీసుకుంటూ నామినేషన్ పత్రాల కోసం అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడంలో తలమునకలయ్యారు.

మెదక్ జిల్లాలో గల నాలుగు పురపాలక సంఘాలలో మొదటి రోజు బుధవారం 26 నామినేషన్లు దాఖలు అయ్యాయి. మెదక్-12, రామాయంపేట- 7 తూప్రాన్ – 4, నర్సాపూర్- 3 చొప్పున నామినేషన్లు సమర్పించారు. పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్న అభ్యర్థులు మొదటి రోజు తమ ఇంటి పన్ను బకాయిలు, నల్లా పన్నుబకాయలు చెల్లిస్తూ నో డ్యూ సర్టిఫికెట్లు తీసుకుంటూ నామినేషన్ పత్రాల కోసం అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడంలో తలమునకలయ్యారు.

పవిత్ర రంజాన్ మాసాన్ని ప్రశాంతంగా జరుపుకునే విధంగా జిల్లా అధికారులు సన్నాహకాలు చేపట్టనున్నారు. కలెక్టర్ రాహుల్ రాజ్ బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమీక్షలో, మసీదులు, ప్రార్థన మందిరాల వద్ద భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, కట్టుదిట్టమైన బందోబస్తు, పారిశుద్ధ్యం, త్రాగునీటి, విద్యుత్ సరఫరా చర్యలు చేపట్టాలని అధికారులు ఆదేశించారు.

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మెదక్ జిల్లా కలెక్టరేట్లో మీడియా సెంటర్ను కలెక్టర్ రాహుల్ రాజ్ బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, అదనపు కలెక్టర్ నగేశ్ పాల్గొన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో భాగంగా మీడియా సెంటర్ ద్వారా అభ్యర్థుల పత్రికా ప్రకటనలు, సోషల్ మీడియా ప్రచారంపై నిఘా ఉంటుందని కలెక్టర్ తెలిపారు.

ఏడుపాయల వనదుర్గా మాత జాతరను ఎల్లలు దాటేలా ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమీక్షలో భక్తులకు ఇబ్బందులు లేకుండా పార్కింగ్, తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, వైద్య సేవలు, క్యూలైన్లు, సీసీ కెమెరాలు, అగ్నిమాపక ఏర్పాట్లు చేయాలని సూచించారు. అధిక ధరలు, కల్తీ ఆహారం, మత్తు పదార్థాల విక్రయంపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రసిద్ధ ఏడుపాయల వనదుర్గా భవానీ మాత జాతరను అత్యంత ఘనంగా నిర్వహించాలని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులతో కలిసి ఆయన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, జాతర పరిసరాల్లో ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేపట్టి పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

నర్సాపూర్కు చెందిన GOVT టీచర్ఎ ల్. శ్రీనివాస్ జాతీయ స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల HYD ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన ఆయన తెలంగాణ ప్రతినిధిగా ఎంపికయ్యారు. ఫిబ్రవరి 17 నుంచి 19 వరకు ఢిల్లీలో జరగనున్న నేషనల్ సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్లో పాల్గొననున్నారు. శ్రీనివాస్ ప్రస్తుతం చిలప్చెడ్ మండలం గౌతాపూర్ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నారు.

రామాయంపేట మున్సిపాలిటీలో ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలను ముందే అమలు చేస్తూ పలు వార్డుల్లో మినీ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ప్రజలకు ఉచితంగా మినరల్ వాటర్ సరఫరా చేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ పథకాలను వివరిస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.

మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి కంపెనీ వద్ద బీహార్ రాష్ట్రానికి చెందిన సర్వాన్ కుమార్ హత్యకు పాల్పడిన నిందితుడు ఓం ప్రకాష్ రాయ్కి జీవిత ఖైదు, రూ.10 వేల జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ తీర్పునిచ్చినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. సునీల్ మొంజి, ధనుంజయ్, సర్వాన్ కుమార్ సోదరులు ఓ కంపెనీలో పనిచేస్తూ ఇక్కడే ఉంటున్నారన్నారు. ఓం ప్రకాష్ రాయ్ రాయితో కొట్టి హత్య చేసినట్లు వివరించారు.
Sorry, no posts matched your criteria.