Medak

News January 5, 2025

మెదక్: బాలికపై సామూహిక అత్యాచారం

image

మెదక్ జిల్లా మసాయిపేట మండలంలోని ఓ గిరిజన తండాలో దారుణం జరిగింది. ఎస్ఐ వివరాల ప్రకారం.. ఓ గ్రామానికి చెందిన బాలిక తల్లిదండ్రులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. దీంతో బాలిక అన్నయ్య, బాబాయ్ వారిని తీసుకుని ఆసుపత్రికి వెళ్లారు. అదునుగా తీసుకున్న ఇద్దరు యువకులు ఇంట్లో ఒంటరిగా ఉన్న 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దిరపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

News January 5, 2025

తూప్రాన్: మహిళను చంపిన వ్యక్తి అరెస్ట్

image

ఓ మహిళను నమ్మించి సహజీవనం చేస్తూ చంపిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తూప్రాన్ సీఐ రామకృష్ణ, మనోహరాబాద్ ఎస్ఐ సుభాష్ గౌడ్‌ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాలు.. బిహార్‌‌కు చెందిన సూరజ్ కుమార్ చంద్ర వంశీకి రజిని దేవి అనే మహిళతో పరిచయం ఏర్పడింది. వారు కొన్ని రోజులుగా కలిసే ఉంటున్నారు. ఈక్రమంలో వారి మద్య డబ్బుల విషయంలో తరచూ గొడవ జరగుతుండగా, రజినిని చంపినట్టు ఎస్ఐ తెలిపారు.

News January 5, 2025

సిద్దిపేట: సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలి: మంత్రి పొన్నం

image

జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలపై గ్రామ గ్రామాన అవగాహన కల్పించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్లతో శనివారం రాష్ట్ర సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాల్లో ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించాలన్నారు.

News January 4, 2025

సిద్దిపేట: నిషేధిత చైనా మాంజా అమ్మితే చర్యలు: సీపీ

image

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రభుత్వం నిషేధించిన చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ అనురాధ హెచ్చరించారు. జిల్లా పరిధిలో చైనా మాంజా విక్రయాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మాంజాతో మనుషులతో పాటు పక్షులకు ప్రమాదం పొంచి ఉందన్నారు. చైనా మాంజతో తలెత్తే అనార్థాలపై అందరు అవగాహన కలిగి ఉండాలన్నారు. చైనా మాంజాను అమ్మినా, రవాణా చేసినా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.

News January 4, 2025

ఉమ్మడి మెదక్ జిల్లాలో పెరిగిన చలి

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో చలి పంజా విసురుతోంది. సంగారెడ్డి, మెదక్ జిల్లాలో 6 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మెదక్ జిల్లాలోని బోడగట్టు, మనోహరబాద్, శివంపేట, నార్సింగి, కుల్చారం, సంగారెడ్డి జిల్లా కోహిర్, న్యాల్కల్, అల్మాయిపేట్, మాల్చెల్మా, నల్లవల్లి, అల్గోల్, సత్వార్, లక్ష్మీసాగర్, సిద్దిపేట జిల్లాలో అంగడి కిష్టాపూర్, పోతారెడ్డిపేట తదితర ప్రాంతాల్లో చలితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

News January 4, 2025

SDPT: రోడ్డు భద్రతపై ప్రజలు చైతన్యం కావాలి: మంత్రి పొన్నం

image

రోడ్డు భద్రతపై ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పాఠశాల విద్యార్థులతో కలిసి రోడ్డు భద్రతపై ఫ్లకార్డులతో అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. అన్ని శాఖల సమన్వయంతో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

News January 3, 2025

కేటీఆర్‌ను కలిసిన మెదక్ జిల్లా నేతలు

image

హైదరాబాద్‌లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ని నందినగర్ వారి నివాసంలో నూతన సంవత్సరం సందర్భంగా మెదక్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెదక్ జిల్లా నేతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రానున్న సస్థానిక సంస్థల ఎన్నికల పట్ల దిశా నిర్దేశం చేశారు.

News January 3, 2025

ప్రజాదర్బార్ నిర్వహిస్తామని డబ్బా కొట్టారు: హరీశ్ రావు

image

సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజూ ప్రజాదర్బార్ నిర్వహిస్తామని కాంగ్రెస్ అభయహస్తం మేనిఫెస్టోలో డబ్బా కొట్టారని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్‌ను జరపకపోగా పేరు మార్చి ప్రజావాణిని చేశారని తెలిపారు. సీఎం రేవంత్ కేవలం ఒకే ఒక్కరోజు హాజరై, 10ని.లు పాటు మాత్రమే ప్రజల నుంచి వినతులు స్వీకరించారని అన్నారు.

News January 3, 2025

UPDATE.. నార్సింగి: రోజూ వెళ్లే వైన్స్‌కే కన్నం వేశాడు..!

image

మెదక్ జిల్లా నార్సింగిలోని కనకదుర్గ వైన్స్‌లో చోరీకి వెళ్లి తాగి పడుకున్న నిందితుడిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. వారి వివరాల ప్రకారం.. నేపాల్‌కు చెందిన రాజాసోద్ రైస్ మిల్లులో హమాలీగా పనిచేస్తూ మద్యానికి బానిస అయ్యాడు. రోజూ మద్యం కొనుక్కుని తాగే వైన్స్‌కు కన్నం వేశాడు. మద్యం తాగి వైన్స్‌లోనే పడుకొని దొరికిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న దొంగను రామాయంపేట ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు.

News January 3, 2025

మెదక్: వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురి మృతి

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతిచెందారు. వివరాలిలా.. దుద్యాలలో కంది నూర్పిడి యంత్రంలో పడి మహిళ చనిపోగా.. పాపన్నపేటలో నీట మునిగి రైతు మృతిచెందాడు. సంగారెడ్డిలో చేపల వేటకు వెళ్లిన కార్మికుడు మరణించగా.. సిద్దిపేటలో బైక్ అదుపు తప్పి కూలీ చనిపోయాడు. పరిగిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందగా.. చేగుంటలో మద్యం మత్తులో వ్యక్తి కిందపడి చనిపోయాడు.

error: Content is protected !!