India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జిల్లాల పునర్విభజనపై అసెంబ్లీలో రెవెన్యూ మంత్రి పొంగులేటి ప్రకటనతో మార్పులపై ఆశలు పుట్టుకొచ్చాయి. ఉమ్మడి మెదక్ జిల్లాను సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలుగా విభజించారు. కాగా, ఒక జిల్లాలోని మండలం మరో జిల్లా, నియోజకవర్గంలో ఉండడంతో ప్రజలకు, అధికారులకు ఇబ్బందిగా మారింది. పార్టీల అధ్యక్షులు సైతం గందరగోళంలో ఉండిపోయారు. ఈక్రమంలో ఉమ్మడి జిల్లా ప్రజలకు జిల్లాల పునర్విభజనపై ఆశలు చిగురించాయి.

అధికారులు అత్యుత్తమ సేవలతో జిల్లా అభివృద్ధిలో ప్రథమ స్థానంలో నిలపాలని కలెక్టర్ రాహుల్ రాజ్ పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్లో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ టేబుల్, వాల్ క్యాలెండర్ ఆవిష్కరించారు. అనంతరం అదనపు కలెక్టర్ నగేశ్, ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ప్రెసిడెంట్ విట్టల్, సెక్రటరీ నాగభూషణం, అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, ట్రెజరర్ ఎల్లయ్య ఉన్నారు.

టేక్మాల్ గ్రామంలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. భవనంపై పతంగి ఎగురవేస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడి లక్ష్మణ్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. మొదటి అంతస్తు నుంచి పడటంతో లక్ష్మణ్ కాలు విరిగినట్లు స్థానికులు తెలిపారు. గమనించిన కుటుంబ సభ్యులు బాధితుడిని చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పండుగ వేళ అప్రమత్తంగా ఉండాలని గ్రామస్థులు కోరుతున్నారు.

రైతులు పురుగుమందులు పిచికారి చేసే సమయంలో వారి ఆరోగ్య పరిరక్షణకు సంరక్షణ కిట్లు అందజేయడం జిల్లా వ్యవసాయ శాఖ పనితీరు హర్షణీయమని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం నూతన సంవత్సర శుభాకాంక్షల సందర్భంగా పూల బొకేలుకు బదులు సంరక్షణ కిట్లు అందజేయాలన్న కలెక్టర్ పిలుపుకు అనుగుణంగా వ్యవసాయ శాఖ ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది.

మెదక్ జిల్లాలో 27 మందికి ల్యాబ్ టెక్నీషియన్గా పోస్టింగ్లు ఇచ్చారు. ఈరోజు హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో మంత్రి దామోదర రాజానర్సింహా, ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ చేతులు మీదుగా అభ్యర్థులు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అభ్యర్థులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

మెదక్ జిల్లాను సిరిసిల్ల జోన్ నుంచి తొలగించి, చార్మినార్ జోన్లో కలపాలని కోరుతూ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్కు ఉద్యోగ సంఘాలు వినతిపత్రం అందజేశాయి. ప్రస్తుత జోన్ వల్ల పదోన్నతుల్లో ఉద్యోగులకు, ఉద్యోగ అవకాశాల్లో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం జిల్లాల పునర్విభజనపై పునరాలోచన చేస్తున్న తరుణంలో, మెదక్ను చార్మినార్ జోన్లో చేర్చి న్యాయం చేయాలని కోరారు.

మెదక్ జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాలు ఎగురవేసే సమయంలో ప్రజలంతా అవసరమైన అన్ని రకాల జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు సూచించారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను పురస్కరించుకొని జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పండుగ అంటే గాలిపటాల సంబరమని, అయితే ఆనందంగా జరుపుకోవాలని పేర్కొన్నారు.

ఎమ్మెల్సీ డాక్టర్ వంటేరు యాదవ రెడ్డికి విద్యుత్ శాఖ తరపున ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గృహజ్యోతి, వ్యవసాయ ఉచిత విద్యుత్ వినియోగదారులకు అందజేస్తున్న సంక్రాంతి శుభాకాంక్షలు లేఖలను మెదక్ విద్యుత్ శాఖ ఎస్ఈ నారాయణ నాయక్ అందజేశారు. ఎమ్మెల్సీకి గృహజ్యోతి పథకం, వ్యవసాయ ఉచిత విద్యుత్ పథకం గురించి వివరించారు. డీఈ టెక్నికల్ విజయ శ్రీనివాస్, తూప్రాన్ ఏఈ వెంకటేశ్వర్లు, ఏఈ కమర్షియల్ రాజు పాల్గొన్నారు.

మున్సిపల్ ఎన్నికల నగారా త్వరలో మోగనుండటంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ఓటరు జాబితా విడుదల కావడంతో ఇప్పుడు అందరి దృష్టి రిజర్వేషన్లపైనే ఉంది. తమ వార్డు ఏ వర్గానికి కేటాయిస్తారోనని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు టికెట్ల కోసం పైరవీలు ముమ్మరం చేస్తూనే, వార్డుల్లో ప్రచారం మొదలుపెట్టారు. రిజర్వేషన్లు ఖరారైతేనే పోటీపై స్పష్టత రానుంది.

మెదక్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. మహిళా ఓటర్లు 45,168 మంది ఉండగా, పురుష ఓటర్లు 42,015 మంది ఉన్నారు. మెదక్ మున్సిపాలిటీలో 19,406, తూప్రాన్ 10,302, నర్సాపూర్ 8,656, రామాయంపేట 6,804 మహిళా ఓటర్లు ఉండగా, మెదక్ 17,548, తూప్రాన్ 9,957, నర్సాపూర్ 8,219, రామాయంపేట 6,291 మంది పురుష ఓటర్లు ఉన్నారు. మెదక్, నర్సాపూర్లో ఒక్కొక్క ఓటరు ఇతరులు ఉన్నారు.
Sorry, no posts matched your criteria.